Trends

షోయబ్ మాలిక్ రెండో పెళ్లి..వైరల్ ఫొటో

భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ లు పెళ్లి చేసుకోవడంపై గతంలో పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దాయాది దేశం పాక్ జాతీయుడిని సానియా వివాహం చేసుకోవడంపై పలు హిందూ సంఘాలు, పలువురు భారతీయులు మండిపడ్డారు. అయితే, ఈ జంట విడిపోయారని, విడాకులు కూడా తీసుకున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే తాజాగా తాను రెండో పెళ్లి చేసుకున్న ఫొటోలను షోయబ్ మాలిక్ సోషల్ మీడియాలో షేర్ చేయడం సంచలనం రేపింది.

పాకిస్థాన్ నటి సనా జావెద్ ను తాను పెళ్లి చేసుకున్నట్టు షోయబ్ మాలిక్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి అఫీషియల్ గా ప్రకటించాడు. సనాను పెళ్లి చేసుకున్న ఫొటోలను షేర్ చేశాడు. పెళ్లి దుస్తుల్లో ఉన్న కొత్త జంట ఫొటోలు చూసి సానియా, షోయబ్ విడాకులు తీసుకున్న సంగతి నిజమేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొద్ది రోజులుగా సానియా సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుు చూసి చాలామంది వారు విడిపోయారని నిర్ధారణకు వచ్చారు.

మరోవైపు, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ రెండో పెళ్లికి రెడీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. తాజాగా షమీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షమీ పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్న ఫొటోలు పోస్టు చేసిన వైనం ఆ ప్రచారం నిజమే అనేలా చేస్తోంది. ఆ లుక్ ఏంటి? మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారా? అని నెటిజన్లు ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు. అయితే, షమీ మాత్రం ఆ కామెంట్లపై స్పందించలేదు.

గతంలో షమీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆయన భార్య హసీన్ జహాన్ విడాకులు కోరుతూ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ఆ విడాకుల కేసు కోర్టు విచారణలో ఉంది. మరోవైపు, మోకాలి గాయంతో బాధపడుతున్న షమీ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. 2024 జూన్‌ 1 నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌ నకు ఫిట్ నెస్ సాధించే పనిలో ఉన్నాడు.

This post was last modified on January 20, 2024 4:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

2 hours ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

2 hours ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

4 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

4 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

5 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

5 hours ago