దేశంలో గత ఐదేళ్లుగా ప్రముఖంగా వినిపిస్తున్న పేరు అదానీ. ప్రముఖ పారిశ్రామిక వేత్తగా ఆయన వెలు గొందుతున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు దన్నుతో ఆయన వ్యాపారాలు విస్తరించుకుంటున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. అదానీ గురించి పార్లమెంటు లో ప్రశ్నలు సంధించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) ఎంపీ మొహువా మొయిత్రాపై ఏకంగా వేటు కూడా పడిన విషయం తెలిసిందే.
ఇంత వివాదాస్పద సమయంలోనూ అదానీ హవా దేశంలో కొనసాగుతుండడం గమనార్హం. తాజాగా ప్రముఖ ఆర్థిక కార్యకలాపాల విశ్లేషణ సంస్థ బ్లూమ్ బర్గ్ వెలువరించిన నివేదికలో దేశంలో అత్యంత సంపన్నడుగా గౌతం అదానీ ముందువరుసలో నిలబడడం గమనార్హం. ఆయన ఆస్తులు మరింత పెరిగాయని.. ఆయనకు సంబంధించి షేర్ మార్కెట్ తారా జువ్వలా ఎగిసి పెరిగిందని బ్లూమ్బర్గ్ నివేదిక స్పష్టం చేసింది.
తాజాగా బ్లూమ్ బర్గ్ మిలియనీర్ సంస్థ వెలువరించిన నివేదిక ప్రకారం.. అదానీ సంపద 97.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది దేశంలోనే అతి పెద్ద సంపద అని పేర్కొంది. ముఖ్యంగా రెండు రోజుల కిందట సుప్రీంకోర్టు అదానీ విషయంపై స్పందిస్తూ.. ఆయనపై సీబీఐ, ఈడీ వంటి సంస్థలను ప్రయోగించాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం జరుగుతున్న సెబీ విచారణ చాలని పేర్కొన్న దరిమిలా అదానీ సంపద పుంజుకున్నట్టు ఈ సంస్థ పేర్కొంది.
ఇదే.. సమయంలో ఇప్పటి వరకు దేశంలో అతి పెద్ద సంపన్నడుగా ఉన్న జియో అధినేత ముఖేష్ అంబానీ.. ఇప్పుడు రెండో ప్లేస్కు చేరుకున్నట్టు బ్లూమ్ బర్గ్ నివేదిక పేర్కొంది. ఆయన సంపద 97 బిలియన్ డాలర్లకు చేరినట్టు తెలిపింది. ఇక, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నఅత్యధిక సంపన్నుల జాబితాలో అదానీ 12వ స్థానంలో ఉండగా.. ఆయన తర్వాత అంబానీ 13వ ప్లేస్లో ఉన్నారని ఈ నివేదిక స్పష్టం చేయడం విశేషం.
This post was last modified on January 5, 2024 10:02 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…