అగ్రరాజ్యం అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు తెలుగు వారు దుర్మరణం పాలు కావటం షాకింగ్ గా మారింది. ఈ ఉదంతం గురించిన సమాచారం అందినంతనే అమలాపురంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. టెక్సాస్ హైవేలో జరిగిన ఈ ప్రమాదాన్ని జీర్ణించుకోవటం కష్టంగా మారింది. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన వారంతా ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులుగా చెబుతున్నారు.
జాన్సన్ కౌంటీ వద్ద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.రెండు వాహనాలు వేగంగా వచ్చి ఢీ కొట్టాయని చెబుతున్నారు. టెక్సాస్ నుంచి డల్లాస్ కు వెళుతున్న మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరణించిన వారంతా ఎమ్మెల్యే పొన్నాడ బాబాయ్ నాగేశ్వరరావు కుటుంబ సభ్యులుగా తెలుస్తోంది.
పొన్నాడ నాగేశ్వరరావు.. ఆయన సతీమణి సీతామహాలక్ష్మి.. కుమార్తె నవీన గంగ.. మనమడు, మనమరాలు కూడా ఈ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. నాగేశ్వరావు అల్లుడు, నవీన గంగ భర్త లోకేశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం షాకింగ్ గా మారింది. ఈ ప్రమాదంపై స్పందిస్తున్న తెలుగు సంఘాల వారు స్థానిక అధికారులతో మాట్లాడి సహాయ కార్యక్రమాల్ని చేపడుతున్నారు.
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…
కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…