Trends

ఘోరం: అమెరికాలో ఐదుగురు అమలాపురం వాసులు దుర్మరణం


అగ్రరాజ్యం అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు తెలుగు వారు దుర్మరణం పాలు కావటం షాకింగ్ గా మారింది. ఈ ఉదంతం గురించిన సమాచారం అందినంతనే అమలాపురంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. టెక్సాస్ హైవేలో జరిగిన ఈ ప్రమాదాన్ని జీర్ణించుకోవటం కష్టంగా మారింది. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన వారంతా ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులుగా చెబుతున్నారు.

జాన్సన్ కౌంటీ వద్ద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.రెండు వాహనాలు వేగంగా వచ్చి ఢీ కొట్టాయని చెబుతున్నారు. టెక్సాస్ నుంచి డల్లాస్ కు వెళుతున్న మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరణించిన వారంతా ఎమ్మెల్యే పొన్నాడ బాబాయ్ నాగేశ్వరరావు కుటుంబ సభ్యులుగా తెలుస్తోంది.

పొన్నాడ నాగేశ్వరరావు.. ఆయన సతీమణి సీతామహాలక్ష్మి.. కుమార్తె నవీన గంగ.. మనమడు, మనమరాలు కూడా ఈ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. నాగేశ్వరావు అల్లుడు, నవీన గంగ భర్త లోకేశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం షాకింగ్ గా మారింది. ఈ ప్రమాదంపై స్పందిస్తున్న తెలుగు సంఘాల వారు స్థానిక అధికారులతో మాట్లాడి సహాయ కార్యక్రమాల్ని చేపడుతున్నారు.

This post was last modified on December 27, 2023 3:42 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ..కప్ కొడతారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…

2 hours ago

సతీసమేతంగా అమెరికాకు చంద్రబాబు

ఏపీలో ఎన్నికల పోరు ముగియడంతో ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులు,…

2 hours ago

పుష్ప 2 పోటీ – తగ్గనంటున్న శివన్న

ఇంకో మూడు నెలల్లో ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న పుష్ప 2 ది రైజ్ విడుదల తేదీలో ఎలాంటి మార్పు…

2 hours ago

లవ్ మీ మీద బండెడు బరువు

సింగల్ స్క్రీన్లు అధిక శాతం తాత్కాలికంగా మూతబడి, కుంటినడనన మల్టీప్లెక్సులను నెట్టుకొస్తున్న టైంలో ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజ్ లవ్…

3 hours ago

భైరవ బుజ్జిలను తక్కువంచనా వేయొద్దు

నిన్న ఊరించి ఊరించి ఆలస్యంగా విడుదల చేసిన కల్కి 2898 ఏడిలోని బుజ్జి మేకింగ్ వీడియో చూసి అభిమానుల నుంచి…

4 hours ago

కుప్పం బాబుకు లక్ష ‘కప్పం’ చెల్లిస్తుందా ?

కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడుకు పెట్టని కోట. 1983లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ టీడీపీ తప్ప…

4 hours ago