Trends

ఘోరం: అమెరికాలో ఐదుగురు అమలాపురం వాసులు దుర్మరణం


అగ్రరాజ్యం అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు తెలుగు వారు దుర్మరణం పాలు కావటం షాకింగ్ గా మారింది. ఈ ఉదంతం గురించిన సమాచారం అందినంతనే అమలాపురంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. టెక్సాస్ హైవేలో జరిగిన ఈ ప్రమాదాన్ని జీర్ణించుకోవటం కష్టంగా మారింది. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన వారంతా ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులుగా చెబుతున్నారు.

జాన్సన్ కౌంటీ వద్ద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.రెండు వాహనాలు వేగంగా వచ్చి ఢీ కొట్టాయని చెబుతున్నారు. టెక్సాస్ నుంచి డల్లాస్ కు వెళుతున్న మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరణించిన వారంతా ఎమ్మెల్యే పొన్నాడ బాబాయ్ నాగేశ్వరరావు కుటుంబ సభ్యులుగా తెలుస్తోంది.

పొన్నాడ నాగేశ్వరరావు.. ఆయన సతీమణి సీతామహాలక్ష్మి.. కుమార్తె నవీన గంగ.. మనమడు, మనమరాలు కూడా ఈ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. నాగేశ్వరావు అల్లుడు, నవీన గంగ భర్త లోకేశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం షాకింగ్ గా మారింది. ఈ ప్రమాదంపై స్పందిస్తున్న తెలుగు సంఘాల వారు స్థానిక అధికారులతో మాట్లాడి సహాయ కార్యక్రమాల్ని చేపడుతున్నారు.

This post was last modified on December 27, 2023 3:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

2 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

3 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

3 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

3 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

5 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

6 hours ago