అగ్రరాజ్యం అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు తెలుగు వారు దుర్మరణం పాలు కావటం షాకింగ్ గా మారింది. ఈ ఉదంతం గురించిన సమాచారం అందినంతనే అమలాపురంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. టెక్సాస్ హైవేలో జరిగిన ఈ ప్రమాదాన్ని జీర్ణించుకోవటం కష్టంగా మారింది. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన వారంతా ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులుగా చెబుతున్నారు.
జాన్సన్ కౌంటీ వద్ద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.రెండు వాహనాలు వేగంగా వచ్చి ఢీ కొట్టాయని చెబుతున్నారు. టెక్సాస్ నుంచి డల్లాస్ కు వెళుతున్న మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరణించిన వారంతా ఎమ్మెల్యే పొన్నాడ బాబాయ్ నాగేశ్వరరావు కుటుంబ సభ్యులుగా తెలుస్తోంది.
పొన్నాడ నాగేశ్వరరావు.. ఆయన సతీమణి సీతామహాలక్ష్మి.. కుమార్తె నవీన గంగ.. మనమడు, మనమరాలు కూడా ఈ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. నాగేశ్వరావు అల్లుడు, నవీన గంగ భర్త లోకేశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం షాకింగ్ గా మారింది. ఈ ప్రమాదంపై స్పందిస్తున్న తెలుగు సంఘాల వారు స్థానిక అధికారులతో మాట్లాడి సహాయ కార్యక్రమాల్ని చేపడుతున్నారు.
This post was last modified on December 27, 2023 3:42 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…