Trends

ఇంటి కోసం.. ఆ ఇంట్లో ఆరుగురిని చంపేశాడు

కలలో కూడా ఊహించలేని దుర్మార్గమిది. ఒక ఇంటి మీద కన్నేసి.. ఆరుగురిని చంపేసిన ఆరాచక ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. స్నేహితుడి ఇంటిని సాంతం చేసుకోవటానికి.. ఆ ఇంట్లోని ఆరుగురిని హత్య చేసిన వైనం షాకింగ్ గా మారింది. వరస పెట్టి సాగుతున్న హత్యల పరంపర మీద ఫోకస్ చేసిన పోలీసులు ఒక్కొక్క హత్య వెనకున్న మిస్టరీని చేధించగా ఈ ఆరాచక ఉదంతం వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఆరు హత్యల్లోకి వెళితే..

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని మాక్లుర్ కు ప్రసాద్ కుటుంబం ఉండేది. గతంలో వారంతా గ్రామాన్ని వదిలేసి.. మాచారెడ్డికి వెళ్లిపోయి.. స్థిరపడింది. ప్రసాద్ కు భార్య.. ఇద్దరు పిల్లలు.. ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ప్రసాద్ కు ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడి పేరు ప్రశాంత్. అతడు మాక్లుర్ లోని ప్రసాద్ ఇంటిని సొంతం చేసుకోవాలన్న దురాశ ఉండేది. తన ప్లాన్ లో భాగంగా లోన్ ఇప్పిస్తానని చెప్పి.. అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు.

ముందుగా అనుకున్న ప్రకారం ఆ ఇంటికి బ్యాంక్ లోన్ రాలేదు. దీంతో.. ఇంటిని తిరిగి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని ప్రశాంత్ మీద ఒత్తిడి తెచ్చాడు ప్రసాద్. ఈ నేపథ్యంలో ఆ ఇంటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఇందులో భాగంగా ప్రసాద్ ను బయటకు తీసుకెళ్లాడు. నిజామాబాద్ – కామారెడ్డి నేషనల్ హైవే మీద అటవీ ప్రాంతంలో హత్య చేశాడు. ఆ తర్వాతి రోజు ప్రసాద్ ఇంటికి వెళ్లి మీ భర్తను పోలీసులు అరెస్టు చేశారని నమ్మించి.. ఆమెను బయటకు తీసుకెళ్లాడు.

ఆమెను కూడా హత్య చేసి.. బాసర నదిలో వదిలేశాడు. ఆ తర్వాత ప్రసాద్ పెద్ద సోదరిని హత్య చేసి.. వారి ఇద్దరి పిల్లలను హత్య చేశాడు. చివరకు ప్రసాద్ చిన్న సోదరిని మాచారెడ్డి సమీపంలో హత్య చేశాడు. ఇలా ఒక ఇంటి కోసం ఆరుగురిని హత్య చేసిన ప్రశాంత్ వయసు ఇరవై ఏళ్లు కావటం గమనార్హం. మొదటి మూడు హత్యలు ప్రశాంత్ ఒక్కడే చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మిగిలిన మూడు హత్యల్ని మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.

హత్యకు గురైన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావటంతోఎక్కడా మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. నమ్మిన స్నేహితుడే ఇంతలా హత్యలు చేయటాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేని పరిస్థితి. గ్రామంలోని ఒక ఇంటి కోసం ఒక కుటుంబం మొత్తాన్ని అంతమొందించిన కర్కసత్వం గురించి తెలిసిన వారంతా నోట మాట రాలేని పరిస్థితి. మనుషులు మరీ ఇంత దారుణంగా మారిపోతారా? అన్న మాట ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా మాట్లాడుకుంటున్నారు.

This post was last modified on December 19, 2023 9:47 am

Share

Recent Posts

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

31 minutes ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

2 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

2 hours ago

టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి `వ‌ర్గ‌`పోరు…!

పార్టీలు బ‌లంగా ఉండాలంటే.. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల మ‌ద్ద‌తు అవ‌స‌రం. నాయ‌కులు, అధినేత‌లు ఎంత బ‌లంగా ఉన్నా.. స‌మాజంలోని వ‌ర్గాలు…

3 hours ago

ఎన్డీయే క‌న్వీన‌ర్‌గా చంద్ర‌బాబు… ఛాన్స్ ఖాయ‌మేనా?

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మిని బ‌లోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మ‌రింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మ‌క అడుగులు…

7 hours ago

ర‌వితేజ హిట్టు కొడితే ఆల్ హ్యాపీస్

తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వ‌ర్గాలున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందులో ఒక వ‌ర్గానికి ఇంకో వ‌ర్గానికి అస్స‌లు…

8 hours ago