Trends

డ్ర‌గ్స్ పేరుతో ఐటీ ఎంప్లాయ్‌ నుంచి 3.46 ల‌క్ష‌లు దోపిడీ!

వైట్ కాల‌ర్ జాబ్ అంటే.. అంద‌రికీ తెలుసు. కానీ, వైట్ కాల‌ర్ దోపిడీల గురించిచాలా త‌క్కువ మందికే తెలుసు. కానీ, ఇప్పుడు వైట్ కాల‌ర్ నేరాలు జోరుగా పెరుగుతున్నాయి. పోలీసుల‌కు కూడా.. ఈ కేసుల చిక్కులు విప్ప‌డం చాలా క‌ష్టంగా మారింది. ఈ నేరాలు కూడా.. అంతుచిక్క‌కుండా ఉన్నాయి. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. ప్ర‌పంచ మేధావులు మెద‌ళ్ల‌ను రంగ‌రిస్తే.. వ‌చ్చే ఆలోచ‌న‌ల‌న్నీ.. ఈ నేరగాళ్ల‌కే వ‌స్తున్నాయంటే ఆశ్చ‌ర్యం అనిపించ‌క‌మాన‌దు.

మోసాల్లో ర‌క‌ర‌కాలు..

  • ఫోన్లు చేసి మాట‌లు క‌లిపి.. బెదిరించి.. వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని తీసుకుని దోపిడీ చేయ‌డం
  • ఫోన్ల‌కు మెసేజ్‌లు పంపించి.. దీనిపై క్లిక్ చేస్తే. అద్భుత‌మైన గిఫ్ట్ మీకే అని చెప్ప‌డం ద్వారా.. చేసే మోసాలు
  • మీరు ల‌క్కీడ్రాలో ఎంపిక‌య్యార‌ని.. ఆశ‌లు ఊరిస్తూ.. చేసే మోసాలు
  • ఇక‌, మ‌న కంప్యూట‌రో.. ఫోనో.. ఏది వీలైతే.. దానిలోకి వ‌చ్చేసి.. మ‌న ఆనుపానులు తెలుసుకుని చేసే ఘ‌రానా మోసాలు.
  • ఇక్క‌డ దొంగ‌లు ఎవ‌రూ.. క‌ళ్ల జోళ్లు పెట్టుకోరు… గ‌ళ్ల లుంగీలు క‌ట్టుకోరు. కంటికి కూడా క‌నిపించ‌రు. ఇదే వారి స్ట‌యిల్. కానీ, కోట్ల‌లో సొమ్ము దోచేస్తారు.

తాజాగా ఏం జ‌రిగింది?

బెంగళూరుకు చెందిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోకి.. ఓ ఫోన్‌ వచ్చింది. అవతలి వ్యక్తి మాట్లాడుతూ.. ముంబయి సైబర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్నాడు. మీరు తైవాన్‌ నుంచి కొరియర్‌లో ఎండీఎంఏ డ్ర‌గ్స్‌ తెప్పించుకున్నట్లు తేలింది. ఆ కొరియర్‌ మీరే బుక్‌ చేసినట్లు ఆధారాలున్నాయి. బెంగళూరు సైబర్‌ పోలీసులకు మీపై ఫిర్యాదు చేస్తున్నాం. వారు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అన్నాడు.

దీంతో స‌హ‌జంగానే ఉండే బెరుకు ఆమెను కూడా ఆవ‌రించింది. దీంతో ఏం చెయ్యాలో చెప్ప‌మ‌ని .. ఫోన్‌లైన్‌లో ఉన్న వ్య‌క్తినే ప్రాధేయ ప‌డింది. ఇదే అదునుగా భావించిన సైబర్ కంత్రీ.. రిజర్వ్‌ బ్యాంక్‌లో రూ. 3.46 లక్షలు డిపాజిట్ చేయండి, తర్వాత మొత్తం తిరిగి మళ్లీ మీకే వస్తుంది. మీకు ఈ కేసుకు సంబందం లేద‌ని చెబుతామ‌ని న‌మ్మ‌బ‌లికాడు.

పాపం.. ఆ ఉద్యోగి.. క‌ష్ట‌ప‌డి సంపాయించుకున్న సొమ్మును ఒక్క క్లిక్‌తో వాడి అకౌంట్‌కు జ‌మ‌చేసింది. ఇంకేముంది.. సొమ్ము ప‌డ‌గానే చిత్త‌గించాడు. ఫోన్ స్విచ్ఛాఫ్‌. రోజులు గడిచినా చెల్లించిన డబ్బు వెనక్కి రాలేదు. దీంతో మోసపోయానని అర్థమై బెంగళూరు సైబర్‌ పోలీసులను ఆశ్రయించింది. ఇది మోస‌మ‌ని తెలిసి.. క‌న్నీరుమున్నీరైంది. సో.. ఇలాంటి ఉదాహ‌ర‌ణలు దేశ‌వ్యాప్తంగా చాలా ఉన్నాయి. కాబ‌ట్టి.. తెలియ‌ని వారు ఫోన్లు ఎత్త‌కుండా ఉంటేనే బెట‌ర్ అంటున్నారు నిపుణులు.

This post was last modified on December 5, 2023 2:36 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది

ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…

3 hours ago

జైలుకు వెళ్ల‌కుండా మీరే న‌న్ను కాపాడాలి:  కేజ్రీవాల్‌

కీల‌క‌మైన నాలుగోద‌శ ఎన్నికల పోలింగ్ స‌మ‌యంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆప్ అధినేత అర‌వింద్ కేజ్రీవా ల్‌.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.…

3 hours ago

ఏపీలో బెట్టింగ్ మార్కెట్ ఏం చెబుతోంది?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ తెలుగువారి చూపంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీదనే. అక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఫలితాలు ఎలా…

3 hours ago

ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన ఓటరు !

నాయకుడు అంటే నలుగురికి ఆదర్శంగా నిలవాలి. అందునా ప్రజాప్రతినిధి అంటే మరింత బాధ్యతతో వ్యవహరించాలి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన తాను…

4 hours ago

ప‌ల్నాడులో ఆ 4 నియోజ‌క‌వ‌ర్గాలు హాట్ హాట్‌!

కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారుల వ‌ర‌కు కూడా.. అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నా రు. అధికారుల‌ను మార్చేశారు.…

6 hours ago

కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట‌ర్ల బారులు…. సంకేతం ఏంటి?

రాష్ట్రంలో కీల‌క నాయ‌కులు పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో అనూహ్య‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఉద‌యం 6 గంట‌ల నుంచే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని…

6 hours ago