Trends

విడాకుల వివాదం.. వేల కోట్లు నష్టపోతున్న రేమండ్

వ్యాపారం వేరు. వ్యక్తిగతం వేరు అని పలువురు చెబుతుంటారు. కానీ.. ఈ వాదన అన్నిసార్లు సరైనది కాదు.కొన్నిసార్లు వ్యక్తిగత అంశాలు వ్యాపారం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంటాయి. ప్రముఖ రేమండ్ సంస్థ ఇప్పుడు అలాంటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది.

రేమండ్ ఛైర్మన్.. ఎండీ గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోదీతో వైవాహిక సంబంధానికి ముగింపు పలుకుతున్న వేళలో.. వారి మధ్య వివాదం ఆ స్టాక్ మీద తీవ్రంగా ఉందని చెప్పాలి. విడాకుల మీద గౌతమ్ సింఘానియా ప్రకటన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్ లో రేమండ్ స్టాక్ చిగురుటాకులా వణుకుతోంది. వివాదం తెర మీదకు వచ్చిన పన్నెండో సెషన్ నాటికి రేమండ్ షేర్ ఏకంగా 14 శాతం పడిపోవటం గమనార్హం.

గడిచిన ఆరు రోజులుగా రేమండ్ షేర్ వాల్యూ 10 శాతానికి పైనే పడిపోయింది. కంపెనీ చరిత్రలోనే తొలిసారి అత్యదిక నష్టాల్ని ఎదుర్కొంటోందన్న మాట వినిపిస్తోంది. రేమండ్ షేర్ పతనంతో ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10వేల కోట్ల దిగువకు పడిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కేవలం 12 సెషన్లలోనే రేమండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,500 కోట్ల రూపాయిలకు పడిపోవటం ఆందోళనకు గురి చేసేలా మారిందని చెప్పాలి. సింఘానియా.. నవాజ్ మోడీల మధ్య సెటిల్ మెంట్ యుద్ధం కోర్టుకు వెళితే..రేమండ్ షేర్ హోల్డర్లు నష్టపోయే ప్రమాదం ఉందన్న మాట నిపుణుల నోట వినిపిస్తోంది.

నవంబరు 10న ఈ షేరు ధర రూ.1889 ఉండగా.. నవంబరు 30 నాటికి దీని ధర రూ.1502గా ఉంది. ఏ రోజుకు ఆ రోజు ఈ షేరు నేల చూపులు చూడటమే తప్పించి.. పైకి లేచిందే లేదు.వ్యాపారంలో ఒడిదుడుకులు మామూలే అయినప్పటికీ.. దాదాపు మూడు వారాలుగా ఆ షేరు క్రమంగా క్షీణించటమే కానీ.. ఒక్క సెషన్ లోనూ పైకి వెళ్లింది లేదు. ఈ పరిణామాలు షేర్ హోల్డర్లను ఆందోళనకు గురి చేస్తోంది.

గౌతమ్- నవాజ్ లు విడిపోతే రేమండ్ మార్కెట్ వాల్యూ మీదా.. ఆస్తుల మీదా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్న వేళలో.. గౌతమ్ సింఘానియా కంపెనీ బోర్డుకు.. ఉద్యోగులకు ఒక లేఖ రాశారు.వ్యక్తిగత సమస్యలు ఉన్నప్పటికీ రేమండ్ వ్యాపారం నిర్వారామంగా కొనసాగుతుందన్న భరోసాను ఇచ్చారు. నవాజ్ మీద వస్తున్న ఆరోపణలకు బదులు ఇవ్వని ఆయన మౌనంగా ఉండటాన్ని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వేళ.. ఆయన లేఖ రాశారు.

ఉద్యోగులు.. బోర్డు సభ్యులకు పంపిన అంతర్గత ఈమొయిల్లో తన వ్యక్తిగత జీవితంలో కొనసాగుతున్న సవాల్లు రేమండ్ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేవంటున్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో తన కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవటమే తనకు ముఖ్యమన్న ఆయన.. దానిపై తాను స్పందించనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రేమండ్ స్టాక్ మీద ఎంత ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on December 1, 2023 12:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

యూత్ హీరోలు రూటు మారుస్తున్నారు

దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…

60 minutes ago

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

5 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

5 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

5 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

6 hours ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

6 hours ago