భారత చెస్ చరిత్రలో ఈ ఆదివారం ఒక ప్రత్యేకమైన రోజు. మన చదరంగ తారలు మన దేశ చెస్ చరిత్రలోనే అతి పెద్ద విజయన్నందుకున్నారు ఈ రోజు. ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత్ తొలిసారిగా స్వర్ణం సొంతం చేసుకుంది.
93 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఇప్పటిదాకా భారత్ ఒక్కసారి మాత్రమే పతకం గెలిచింది. 2014లో కాంస్యం సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏకంగా పసడి నెగ్గి చరిత్ర సృష్టించింది. ఈ విజయంలో మన తెలుగు చెస్ తారలు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంటేల హరికృష్ణలది కీలక పాత్ర. వీరితో పాటు విశ్వనాథన్ ఆనంద్, విదిత్ గుజరాతి, ప్రజ్ఞానానంద, దివ్య దేశ్ ముఖ్, భక్తి కులకర్ణి విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.
కరోనా నేపథ్యంలో తొలిసారిగా చెస్ ఒలింపియాడ్ను ఆన్ లైన్ ద్వారా నిర్వహించారు. ఐతే భారత్కు పసిడి నాటకీయ రీతిలో దక్కింది. రష్యాతో ఒక దశలో భారత్ 1.5-2.5తో వెనుకబడింది. కానీ ఆ దశలో చివరి రెండు గేమ్లు ఆడుతున్న భారత క్రీడాకారులు ఆధిక్యంలో కనిపించారు. గేమ్లు కొనసాగితే వాళ్లే విజేతలుగా నిలిచేవాళ్లు. భారత్కు టైటిల్ సొంతమయ్యేది. కానీ ఆ సమయంలో సర్వర్ డౌన్ అయి గేమ్లు తేడా అయిపోయాయి. సాంకేతికంగా భారత క్రీడాకారులిద్దరూ ఓడిపోయినట్లు టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు.
దీంతో భారత్ తీవ్ర నిరాశలో మునిగిపోయింది. ఐతే సాంకేతిక కారణాలతోనే మనవాళ్లు ఓడిపోయినట్లు తేలిందని.. ఇది సమంజసం కాదని మన బృందం మళ్లీ గేమ్లు నిర్వహించాలని కోరింది. అలా సాధ్యం కాదని తేల్చిన ఫిడె.. భారత్, రష్యా రెండు జట్లనూ విజేతలుగా ప్రకటించారు. అలా భారత్ నాటకీయ రీతిలో చెస్ ఒలింపియాడ్ విజేతగా నిలిచింది.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…