Trends

ఇండియ‌న్ చెస్ స్టార్స్.. అద్భుతం చేశారు

భార‌త చెస్ చ‌రిత్ర‌లో ఈ ఆదివారం ఒక ప్ర‌త్యేకమైన రోజు. మ‌న చ‌ద‌రంగ తార‌లు మ‌న దేశ చెస్ చ‌రిత్ర‌లోనే అతి పెద్ద విజ‌య‌న్నందుకున్నారు ఈ రోజు. ప్ర‌తిష్ఠాత్మ‌క చెస్ ఒలింపియాడ్‌లో భార‌త్ తొలిసారిగా స్వ‌ర్ణం సొంతం చేసుకుంది.

93 ఏళ్ల టోర్నీ చ‌రిత్ర‌లో ఇప్ప‌టిదాకా భార‌త్ ఒక్క‌సారి మాత్ర‌మే ప‌త‌కం గెలిచింది. 2014లో కాంస్యం సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏకంగా ప‌స‌డి నెగ్గి చ‌రిత్ర సృష్టించింది. ఈ విజ‌యంలో మ‌న తెలుగు చెస్ తార‌లు కోనేరు హంపి, ద్రోణ‌వ‌ల్లి హారిక‌, పెంటేల హ‌రికృష్ణ‌ల‌ది కీల‌క పాత్ర‌. వీరితో పాటు విశ్వ‌నాథ‌న్ ఆనంద్, విదిత్ గుజ‌రాతి, ప్ర‌జ్ఞానానంద‌, దివ్య దేశ్ ముఖ్‌, భ‌క్తి కుల‌క‌ర్ణి విజ‌యంలో త‌మ వంతు పాత్ర పోషించారు.

క‌రోనా నేప‌థ్యంలో తొలిసారిగా చెస్ ఒలింపియాడ్‌ను ఆన్ లైన్ ద్వారా నిర్వ‌హించారు. ఐతే భార‌త్‌కు ప‌సిడి నాట‌కీయ రీతిలో ద‌క్కింది. ర‌ష్యాతో ఒక ద‌శ‌లో భార‌త్ 1.5-2.5తో వెనుక‌బ‌డింది. కానీ ఆ ద‌శ‌లో చివ‌రి రెండు గేమ్‌లు ఆడుతున్న భార‌త క్రీడాకారులు ఆధిక్యంలో క‌నిపించారు. గేమ్‌లు కొన‌సాగితే వాళ్లే విజేత‌లుగా నిలిచేవాళ్లు. భార‌త్‌కు టైటిల్ సొంత‌మయ్యేది. కానీ ఆ స‌మ‌యంలో స‌ర్వ‌ర్ డౌన్ అయి గేమ్‌లు తేడా అయిపోయాయి. సాంకేతికంగా భార‌త క్రీడాకారులిద్ద‌రూ ఓడిపోయిన‌ట్లు టోర్నీ నిర్వాహ‌కులు ప్ర‌క‌టించారు.

దీంతో భార‌త్ తీవ్ర నిరాశ‌లో మునిగిపోయింది. ఐతే సాంకేతిక కార‌ణాల‌తోనే మ‌న‌వాళ్లు ఓడిపోయిన‌ట్లు తేలింద‌ని.. ఇది స‌మంజ‌సం కాద‌ని మ‌న బృందం మ‌ళ్లీ గేమ్‌లు నిర్వ‌హించాల‌ని కోరింది. అలా సాధ్యం కాద‌ని తేల్చిన ఫిడె.. భార‌త్‌, ర‌ష్యా రెండు జ‌ట్ల‌నూ విజేత‌లుగా ప్ర‌క‌టించారు. అలా భార‌త్ నాట‌కీయ రీతిలో చెస్ ఒలింపియాడ్ విజేత‌గా నిలిచింది.

This post was last modified on August 31, 2020 9:49 am

Share
Show comments
Published by
Satya
Tags: ChessIndia

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago