Trends

రోహిత్, కోహ్లి ఆడరు.. రాహుల్ ఉండడు

వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు విజేతగా నిలుస్తుందని అభిమానులు ఎంతగానో ఆశించారు. కానీ ఫైనల్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మన జట్టు ఓటమి పాలైంది.ఆస్ట్రేలియా కప్పు ఎగరేసుకుపోయింది. వన్డే కెరీర్లను ఘనంగా ముగించాలని చూసిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు నిరాశ తప్పలేదు. ఈ టోర్నీతోనే కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం కూడా ముగిసింది. ఆయనకు కూడా ఆఖర్లో చేదు గుళిక తప్పలేదు.

ఐతే వన్డే కెరీర్లు ముగించబోతున్నట్లు రోహిత్, కోహ్లి అధికారిక ప్రకటన ఏమీ చేయలేదు. అలాగే ద్రవిడ్ కూడా ఇంతటితో తాను కోచ్‌గా దిగిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. దీంతో వీరి భవితవ్యంపై అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి. కానీ బీసీసీఐ వర్గాల ప్రకారం వీరి కథ ముగిసినట్లే అంటున్నారు.

రోహిత్, కోహ్లి కేవలం టెస్టుల్లో మాత్రమే కొనసాగే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రోహిత్ వయసు 36 ఏళ్లు కాగా.. కోహ్లికి 35 ఏళ్లు నిండాయి. ఇంకో నాలుగేళ్ల తర్వాత జరిగే వన్డే ప్రపంచకప్ వరకు వీళ్లు కొనసాగడం కష్టం. ఆ టోర్నీలో ఆడనపుడు వన్డేలు ఆడటంలో అర్థం ఉండదు. పైగా ఈ రోజుల్లో వన్డేలు బాగా తగ్గిపోయాయి. ఆల్రెడీ వీళ్లిద్దరూ టీ20లకు దూరం అయ్యారు. ఏడాది గ్యాప్ వచ్చేసింది. జట్టును యువ ఆటగాళ్లతో నింపేస్తున్నారు. దీంతో ఇక మళ్లీ టీ20ల్లోకి పునరామగనం చేయడం కష్టమే. కాబట్టి పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రోహిత్, కోహ్లి దూరమైనట్లే. ఓపిక ఉన్నంత వరకు టెస్టులు ఆడి రిటైరైపోవడమే అన్నమాట.

ఇక ద్రవిడ్ విషయానికి వస్తే.. అతడి పదవీ కాలాన్ని ఇంకో ఏడాది కొనసాగించడానికి బీసీసీఐ సిద్ధంగా ఉన్నప్పటికీ.. ద్రవిడ్‌కే ఇష్టం లేదట. కుటుంబంతో సమయం గడపడం కోసం కోచ్ పదవి వదిలేయాలనుకుంటున్నాడట. రెండు మూడు నెలలు మాత్రమే పని ఉండే ఐపీఎల్ కోచ్ పదవిని ద్రవిడ్ చేపట్టనున్నట్లు సమాచారం.

This post was last modified on November 23, 2023 2:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

2 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

2 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

2 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

4 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

5 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

5 hours ago