Trends

క‌ప్పు కొట్టారో.. కోట్ల పంట‌లే!!

ప్ర‌పంచ వ‌న్డే క్రికెట్ క‌ప్ పోటీల్లో ఫైనల్స్‌కు చేరిన‌ భార‌త్‌-ఆస్ట్రేలియా జ‌ట్లు గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్ లో ఉన్న న‌రేంద్ర మోడీ స్టేడియంలో త‌ల‌ప‌డుతున్నాయి. ఈ ఫైన‌ల్స్ లో గెలిచే జ‌ట్టుకు.. క‌ప్పుతోపాటు.. కోట్ల‌కు కోట్ల న‌గ‌దు బ‌హుమానంగా ఇవ్వ‌నున్నారు. ఇక‌, ఓడిపోయినా.. ఇంత‌కు కొంత త‌క్కువ‌గా అయినా.. కోట్ల‌కు కోట్ల సొమ్మే ఆ జ‌ట్టుకు కూడా ద‌క్క‌నుంది. ఇది.. బీసీసీఐ అధికారికంగా ప్ర‌క‌టించిన మొత్తం. ఇది కాకుండా.. ప్ర‌భుత్వాలు ప్ర‌క‌టించే మొత్తాలు చాలా డిఫ‌రెంట్‌గా ఉన్నాయి.

అదేస‌మ‌యంలో వివిధ పారిశ్రామిక దిగ్గ‌జాలు.. గెలిచే జ‌ట్టుపై కోట్ల‌రూపాయ‌ల క‌న‌క వ‌ర్షం కురిపించేందు కు రెడీ అయ్యారు. ఇక‌, యాడ్ కంపెనీలు కూడా ఇదే రేంజ్‌లో సొమ్మును విర‌జిమ్మ‌నున్నాయి. ఇవ‌న్నీఒక ఎత్త‌యితే.. క‌ప్పును సొంతం చేసుకోవ‌డం ద్వారా ప్ర‌జ‌ల అభిమాన వ‌ర్షంలో జ‌ట్టు త‌ల‌మున‌కలు కానుండ‌డం మ‌రో విశేషం.

గెలిస్తే.. ద‌క్కే సొమ్ము ఎంత‌?

  • ఫైన‌ల్స్‌లో క‌ప్పుకొట్టే జ‌ట్టుకు 40 లక్షల డాలర్లు అంటే.. సుమారు రూ.33.31 కోట్లు అందజేయనున్నారు.
  • ఫైన‌ల్స్‌లో ఓడిపోయి.. రన్నరప్‌గా నిలిచే జ‌ట్టుకు 2 మిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.16.65 కోట్లు దక్కనున్నాయి.
  • ఇది కాకుంగా.. గెలిచే జ‌ట్టుకు ఆయా దేశాలు(భార‌త్ 30 కోట్లు ప్ర‌క‌టించింది. ఆస్ట్రేలియా 25 కోట్లు ప్ర‌క‌టించింది) కోట్ల వ‌ర్షం కురిపించ‌నున్నాయి.
  • ఇక‌, యాడ్ కంపెనీలు ఇప్ప‌టికే గెలిచే జ‌ట్టుకు 10 కోట్లు, ఓడిపోయిన జ‌ట్టు కు 5 కోట్లు ప్ర‌క‌టించింది.
  • పారిశ్రామిక దిగ్గ‌జం టాటా 15 కోట్లు, మ‌హింద్రా కంపెనీ 10 కోట్లు ప్ర‌క‌టించారు.
  • ఈ ప్ర‌పంచ క‌ప్ మొత్తం ప్రైజుమనీ 10 మిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.83.29 కోట్లు.
  • లీగ్‌ దశలో ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుకు 40,000 డాలర్ల చొప్పున లభిస్తాయి.
  • సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయిన ఒక్కో జట్టుకు 8 లక్షల డాలర్లను అందజేయనున్నారు. లీగ్‌ స్టేజీలోనే టోర్నీ నుంచి బయటకు వెళ్లిన ఒక్కో జట్టుకు లక్ష డాలర్ల చొప్పున అందిస్తారు.

This post was last modified on November 19, 2023 4:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago