సాధారణంగా ఏ ఉద్యోగంలో అయినా.. నిర్ణీయ వయసు రాగానే రిటైర్మెంట్ ప్రకటిస్తారు. అనంతరం.. పింఛను లేదా.. పీఎఫ్ తీసుకుని సదరు ఉద్యోగులు.. ఇంటికే పరిమితం అవుతారు. ఇలానే.. గత 35ఏళ్లుగా దొంగ తనాలు చేస్తూ.. ఎవరి కంటికీ చిక్కకుండా.. ఈ వృత్తితోనే కుటుంబాన్ని పోషిస్తున్న ఓ పెద్దాయన.. తాజాగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు తెలిపాడు. నిజానికి ఆయన రిటైర్మెంట్ ప్రకటించే వరకు కూడా.. తన కుటుంబానికి తప్ప.. పొరుగింటి వారికి కూడా ‘ఈయన దొంగ’ అనే మాట తెలియదు.
అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. అయితే.. 35 ఏళ్ల చోర వృత్తికి రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయన కుటుంబం పండగ చేసింది. వెంటనే విషయం బయటకు వచ్చింది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇంకేముంది.. జైలుకు తరలించారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
ఆద్యంతం ఆసక్తి..
చోరీ వృత్తినే కులవృత్తిగా మార్చుకొని 35 ఏళ్లుగా సుమారు 1000కి పైగా చోరీలకు పాల్పడిన ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి సహకరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మైలాడుదురై జిల్లా అక్కూరు సిరుపులినాయనార్ వీధిలో ఉంటున్న శంకర్ ఇంట్లో ఏడు రోజుల క్రితం ప్రవేశించిన ఆగంతకుడు 44 సవర్ల నగలు చోరీ చేశాడు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ మీనా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. కానీ, ఎంతకీ దొంగ ఆచూకీ చిక్కలేదు.
ఇంతలోనే శేఖర్(60) అనే వ్యక్తి చోరీలకు రిటైర్మెంట్ ప్రకటించాడనే విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీంతో ఆదిశగా పోలీసులు దృష్టి పెట్టారు. శేఖర్ను అదుపులోకి తీసుకొని విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. శేఖర్ 35 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతుండగా, అతనిపై నాగపట్టినం, కారైక్కాల్, మైలాడుదురై, కడలూరు, తిరువారూరు, తంజావూరు సహా పలు జిల్లాల్లో 100కు పైగా చోరీ కేసులున్నట్లు విచారణలో తెలిసింది.
అయితే.. ఏ కేసులోనూ.. ఆయనను పోలీసులు పట్టుకోలేకపోయారట. పట్టుకున్నా.. వెంటనే బెయిల్ వచ్చేసేదట. ఇక, పగటి పూట పలు ప్రాంతాల్లో సంచరించి తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి రాత్రి వేళల్లో చోరీకి పాల్పడుతుంటాడట. మొత్తానికి 35 ఏళ్ల సర్వీసుకు రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజు.. ఇలా ఊచలు లెక్కించాల్సి రావడం.. శేఖర్ ఊహించి ఉండకపోవచ్చని అంటున్నారు పోలీసులు.
This post was last modified on November 18, 2023 2:32 pm
వైసీపీ నాయకులపై కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు పడ్డాయి. జైలు-బెయిలు అంటూ.. నాయకులు, అప్పట్లో వైసీపీకి అనుకూలంగా…
ఏపీని కుదిపేస్తున్న లిక్కర్ కుంభకోణం వ్యవహారంపై ఇప్పుడు కేంద్రం పరిధిలోని ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్ దృష్టి పెట్టింది. ఏపీ మద్యం…
ఇండస్ట్రీలో అంతే. ఒక్క హిట్ జాతకాలను మార్చేస్తుంది. ఒక్క ఫ్లాప్ ఎక్కడికో కిందకు తీసుకెళ్తుంది. డ్రాగన్ రూపంలో సూపర్ సక్సెస్…
లోకనాయకుడు కమల్ హాసన్ చాలా ప్లాన్డ్ గా ప్రమోషన్ల విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఆకట్టుకునేలా ఉంది. వచ్చే నెల జూన్…
భారత్ అంటే నరనరాన పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు… ఇప్పటిదాకా భారత్ పై లెక్కలేనన్ని దాడులకు దిగారు.…
ఇప్పటి దర్శకులకు వేగం అలవడటం లేదు. కారణాలు సవాలక్ష ఉండొచ్చు కానీ పరిశ్రమకు అవసరమైన స్పీడ్ అంది పుచ్చుకుని ఎక్కువ…