అభిమానుల ప్రార్థనలు ఫలించాయి. వన్డే ప్రపంచకప్లో భారత జట్టు సెమీఫైనల్ గండాన్ని దాటింది. న్యూజిలాండ్ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. గత రెండు ప్రపంచకప్ల్లోనూ లీగ్ దశలో ఆధిపత్యం చలాయించి, సెమీఫైనల్లో ఓడిపోవడం.. పైగా 2019లో న్యూజిలాండ్ చేతిలోనే ఓటమి పాలవడంతో.. ఈసారి కంగారు తప్పలేదు. సెంటిమెంట్ రిపీటవుతుందేమో అని అభిమానులు భయపడ్డారు.
నిజానికి కివీస్ ఈ మ్యాచ్లో అంత తేలిగ్గా ఏమీ లొంగలేదు. 398 పరుగుల భారీ లక్ష్యం ఉన్నా.. దాన్ని ఛేదించేందుకు గట్టిగా పోరాడింది. మిచెల్, విలియమ్సన్ భాగస్వామ్యం ప్రమాదకరంగా మారిన సమయంలో భారత అభిమానులకు టెన్షన్ తప్పలేదు. అలాంటి సమయంలో బౌలింగ్కు వచ్చి ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్ను మలుపు తిప్పిన బౌలర్ షమి. ఆరంభంలో రెండు వికెట్లు.. చివర్లో ఇంకో మూడు వికెట్లతో మొత్తంగా 7 వికెట్లు తీసి సంచలనం రేపాడు షమి.
మ్యాచ్లో కోహ్లి, శ్రేయస్ సెంచరీలు బాదినా.. అసలైన హీరో మాత్రం షమినే. అందుకే నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో షమినే ట్రెండ్ అవుతున్నాడు. ఐతే అదే సమయంలో షమి మాజీ భార్య హసీన్ జహాన్ సైతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. కొన్నేళ్ల కిందట వీళ్లిద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటికే పెళ్లయి పిల్లలున్న హసీన్ను షమి పెళ్లాడాడు. కానీ వీరి వైవాహిక జీవితం ఎంతో కాలం సవ్యంగా సాగలేదు. హసీన్ తనకు పిల్లలున్న సంగతి చెప్పకుండానే షమిని పెళ్లాడింది. ఆమె ఇంకా మరి కొన్ని మోసాలు చేసినట్లు షమి సన్నిహితులు చెబుతారు. కానీ షమి మీదే వేధింపుల కేసులు పెట్టి అతణ్ని రోడ్డుకీడ్చే ప్రయత్నం చేసింది.
సౌమ్యుడిగా పేరున్న షమి ఈ కేసుల వల్ల కొంత కాలం వేదనకు గురయ్యాడు. కొన్నాళ్లు ఆటకు కూడా దూరంగా ఉన్నాడు. ఇప్పటికీ ఆ కేసులు అతణ్ని వెంటాడుతున్నాయి. కాగా ఆమె మీద ఉన్న కసితోనే షమి.. ప్రపంచకప్లో రెచ్చిపోయి బౌలింగ్ చేస్తున్నాడని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. వికెట్లలో తన మాజీ భార్యను చూసుకుంటున్నాడని.. ఎక్కడో కసిని ఇక్కడ చూపిస్తున్నాడని రకరకాల మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడా మీమ్స్ అన్నీ వైరల్ అవుతున్నాయి.
This post was last modified on November 16, 2023 4:42 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…