తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు పెద్దలు…తల్లిదండ్రుల తర్వాత పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే గురువులకు ఆ స్థానం దక్కింది. గతంలో గురువు అంటే భయం, భక్తి, గౌరవం ఉండేవి. గురువు, విద్యార్థుల మధ్య సంబంధం కూడా పవిత్రంగా ఉండేంది. కానీ, కలికాలంలో ఆ బంధానికి ఉన్న విలువను కొందరు ఉపాధ్యాయులు మంటగలుపుతున్నారు.
గురుశిష్యుల మధ్య బంధానికి కళంకం తెస్తున్నారు. అభంశుభం తెలియని వయసులో ఉన్న పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కొందరు ఉపాధ్యాయులు కామాంధులుగా మారి పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. మరికొందరైతే విద్యార్థులకు మాయమాటలు చెప్పి లొంగదీసుకొని తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో మన దేశంతో పాటు అమెరికా వంటి పాశ్చాత్య దేశాలలో కూడా ఈ కల్చర్ పెరిగింది.
ఈ క్రమంలోనే తాజాగా అమెరికాలో ఓ మహిళా కౌన్సెలర్…4 ఏళ్ల విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకున్న ఘటన సంచలనం రేపుతోంది. అమెరికాలోని పెన్సిల్వేనియా మిడిల్ స్కూల్ లో గైడెన్స్ కౌన్సెలర్ గా ఉన్న 35 ఏళ్ల కెల్లీ అనే మహిళ అదే పాఠశాలలో చదువుతున్న 14 ఏళ్ల బాలుడితో అనైతిక సంబంధాన్ని పెట్టుకుంది. బాలుడిని లోబరుచుకొని సెక్స్ చేసింది. అయితే, చివరకు ఓ బంధువు ద్వారా వీరి గుట్టురట్టుకావడంతో పెన్సిల్వేనియా పోలీసులు రంగంలోకి దిగారు.
కెల్లితో సెక్సువల్ రిలేషన్ షిప్ లో ఉన్నానని ఆ బాలుడు తనతో చెప్పాడని సదరు బంధువు అన్నారు. 2022 నుంచి కెల్లీ..ఆ బాలుడిని తరుచుగా ఆఫీసుకు పిలుస్తుండేదని, క్లాసులు జరుగుతున్నప్పుడు కూడా పిలిచేదని, వీరిద్దరి మధ్య మెసేజులు కూడా నడిచాయని విచారణలో తేలింది. గత ఏడాది జూన్, జూలై నెలల్లో కెల్లీ, తనతో పలుమార్లు లైంగికంగా కలిసినట్లు బాలుడు వెల్లడించాడు. దీంతో కెల్లీని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…