తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు పెద్దలు…తల్లిదండ్రుల తర్వాత పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే గురువులకు ఆ స్థానం దక్కింది. గతంలో గురువు అంటే భయం, భక్తి, గౌరవం ఉండేవి. గురువు, విద్యార్థుల మధ్య సంబంధం కూడా పవిత్రంగా ఉండేంది. కానీ, కలికాలంలో ఆ బంధానికి ఉన్న విలువను కొందరు ఉపాధ్యాయులు మంటగలుపుతున్నారు.
గురుశిష్యుల మధ్య బంధానికి కళంకం తెస్తున్నారు. అభంశుభం తెలియని వయసులో ఉన్న పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కొందరు ఉపాధ్యాయులు కామాంధులుగా మారి పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. మరికొందరైతే విద్యార్థులకు మాయమాటలు చెప్పి లొంగదీసుకొని తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో మన దేశంతో పాటు అమెరికా వంటి పాశ్చాత్య దేశాలలో కూడా ఈ కల్చర్ పెరిగింది.
ఈ క్రమంలోనే తాజాగా అమెరికాలో ఓ మహిళా కౌన్సెలర్…4 ఏళ్ల విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకున్న ఘటన సంచలనం రేపుతోంది. అమెరికాలోని పెన్సిల్వేనియా మిడిల్ స్కూల్ లో గైడెన్స్ కౌన్సెలర్ గా ఉన్న 35 ఏళ్ల కెల్లీ అనే మహిళ అదే పాఠశాలలో చదువుతున్న 14 ఏళ్ల బాలుడితో అనైతిక సంబంధాన్ని పెట్టుకుంది. బాలుడిని లోబరుచుకొని సెక్స్ చేసింది. అయితే, చివరకు ఓ బంధువు ద్వారా వీరి గుట్టురట్టుకావడంతో పెన్సిల్వేనియా పోలీసులు రంగంలోకి దిగారు.
కెల్లితో సెక్సువల్ రిలేషన్ షిప్ లో ఉన్నానని ఆ బాలుడు తనతో చెప్పాడని సదరు బంధువు అన్నారు. 2022 నుంచి కెల్లీ..ఆ బాలుడిని తరుచుగా ఆఫీసుకు పిలుస్తుండేదని, క్లాసులు జరుగుతున్నప్పుడు కూడా పిలిచేదని, వీరిద్దరి మధ్య మెసేజులు కూడా నడిచాయని విచారణలో తేలింది. గత ఏడాది జూన్, జూలై నెలల్లో కెల్లీ, తనతో పలుమార్లు లైంగికంగా కలిసినట్లు బాలుడు వెల్లడించాడు. దీంతో కెల్లీని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
This post was last modified on November 15, 2023 6:43 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…