విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్న భారతీయ విద్యార్ధులు మొదటి ఆప్షన్ గా అమెరికానే ఎంచుకుంటున్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్, గ్రాడ్యేయేషన్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ చేయటం కోసం ఏమాత్రం అవకాశం ఉన్న వాళ్ళయినా అమెరికా వెళ్ళటానికే మొగ్గు చూపుతున్నారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖే ప్రకటించింది. అమెరికాలో చదువుకునే విదేశీయ విద్యార్ధుల అవకాశాలపై ఓపెన్ డోర్స్ రిపోర్టు (ఓడీఆర్) తాజా గణాంకాలను విదేశాంగ శాఖ ప్రస్తావించింది.
2022-23 విద్యా సంవత్సరంలో అమెరికాలో చదువుకోవటానికి వచ్చిన భారతీయ విద్యార్ధులు 35 శాతం పెరిగిందట. ఆల్ టైం రికార్డుగా 2,68,923 మంది భారతీయ విద్యార్ధులు అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. వీరిలో కూడా 41 శాతం మంది లెక్కలు, కంప్యూటర్ సైన్స్ చదువుకోవటానికే ఇష్టపడినట్లు చెప్పింది. వివిధ దేశాల నుండి అమెరికాలో చదువుకోవటానికి వచ్చిన విద్యార్ధుల శాతం గతంతో పోల్చితే 12 శాతం పెరిగింది.
2019-21 మధ్య కరోనా వైరస్ కారణంగా అమెరికాకు రావటం ప్రపంచవ్యాప్తంగా మందగించింది. ఇందులో భాగంగానే ఇండియన్ విద్యార్ధుల సంఖ్య కూడా బాగా తగ్గింది. అమెరికాకు వెళ్ళటానికి భారతీయులు భయపడటం లేదా అమెరికా వీసాలు జారీచేయకపోవటంతో అక్కడకు వెళ్ళే విద్యార్ధుల సంఖ్య తగ్గిపోయింది. దాని ప్రభావమో ఏమో కరోనా ప్రభావం తగ్గగానే ఒక్కసారిగా విద్యార్ధుల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఓపెన్ సోర్స్ పద్దతిలో చదువులు, ఉద్యోగాలు, చదువుకుంటూనే పార్ట్ టైమ్ గా ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి అమెరికా విశ్వవిద్యాలయాలు. డాలర్ల మోజులు భారతీయ యువత కూడా అమెరికాపై మోజు పెంచుకుంటున్నది.
మనదేశంలో చదువుకోవాలన్నా, ఉద్యోగాలు తెచ్చుకోవాలన్నా రిజర్వేషన్లు, అనేక రకాల ఒత్తిళ్ళు, ప్రయత్నాలుంటాయని అందరికీ తెలిసిందే. అదే అమెరికాలో అయితే ఇలాంటి గొడవలేమీ ఉండవు. చదువులో మార్కులు, గ్రేడులు మాత్రమే విద్యార్ధి ప్రతిభను నిర్ణయిస్తాయి. దాన్నిబట్టే ఉన్నత చదువులు, పార్ట్ టైమ్ ఉద్యోగాలు, పూర్తిస్ధాయి ఉద్యోగాల్లో ఎంపికవుతారు. ఇక్కడ వయసు, అనుభవం అన్నపదాలకు పెద్దగా విలువలేదు. వ్యక్తిని నిర్ణయించేది కేవలం విద్యార్ధి ప్రతిభ మాత్రమే. అందుకనే చిన్నవయసులోనే ప్రొఫెసర్లు కూడా అయిపోతుంటారు. ఇలాంటి అనేక కారణాలతోనే భారతీయ విద్యార్ధులు అమెరికాకు వెళ్ళిపోవటానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…