విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్న భారతీయ విద్యార్ధులు మొదటి ఆప్షన్ గా అమెరికానే ఎంచుకుంటున్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్, గ్రాడ్యేయేషన్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ చేయటం కోసం ఏమాత్రం అవకాశం ఉన్న వాళ్ళయినా అమెరికా వెళ్ళటానికే మొగ్గు చూపుతున్నారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖే ప్రకటించింది. అమెరికాలో చదువుకునే విదేశీయ విద్యార్ధుల అవకాశాలపై ఓపెన్ డోర్స్ రిపోర్టు (ఓడీఆర్) తాజా గణాంకాలను విదేశాంగ శాఖ ప్రస్తావించింది.
2022-23 విద్యా సంవత్సరంలో అమెరికాలో చదువుకోవటానికి వచ్చిన భారతీయ విద్యార్ధులు 35 శాతం పెరిగిందట. ఆల్ టైం రికార్డుగా 2,68,923 మంది భారతీయ విద్యార్ధులు అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. వీరిలో కూడా 41 శాతం మంది లెక్కలు, కంప్యూటర్ సైన్స్ చదువుకోవటానికే ఇష్టపడినట్లు చెప్పింది. వివిధ దేశాల నుండి అమెరికాలో చదువుకోవటానికి వచ్చిన విద్యార్ధుల శాతం గతంతో పోల్చితే 12 శాతం పెరిగింది.
2019-21 మధ్య కరోనా వైరస్ కారణంగా అమెరికాకు రావటం ప్రపంచవ్యాప్తంగా మందగించింది. ఇందులో భాగంగానే ఇండియన్ విద్యార్ధుల సంఖ్య కూడా బాగా తగ్గింది. అమెరికాకు వెళ్ళటానికి భారతీయులు భయపడటం లేదా అమెరికా వీసాలు జారీచేయకపోవటంతో అక్కడకు వెళ్ళే విద్యార్ధుల సంఖ్య తగ్గిపోయింది. దాని ప్రభావమో ఏమో కరోనా ప్రభావం తగ్గగానే ఒక్కసారిగా విద్యార్ధుల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఓపెన్ సోర్స్ పద్దతిలో చదువులు, ఉద్యోగాలు, చదువుకుంటూనే పార్ట్ టైమ్ గా ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి అమెరికా విశ్వవిద్యాలయాలు. డాలర్ల మోజులు భారతీయ యువత కూడా అమెరికాపై మోజు పెంచుకుంటున్నది.
మనదేశంలో చదువుకోవాలన్నా, ఉద్యోగాలు తెచ్చుకోవాలన్నా రిజర్వేషన్లు, అనేక రకాల ఒత్తిళ్ళు, ప్రయత్నాలుంటాయని అందరికీ తెలిసిందే. అదే అమెరికాలో అయితే ఇలాంటి గొడవలేమీ ఉండవు. చదువులో మార్కులు, గ్రేడులు మాత్రమే విద్యార్ధి ప్రతిభను నిర్ణయిస్తాయి. దాన్నిబట్టే ఉన్నత చదువులు, పార్ట్ టైమ్ ఉద్యోగాలు, పూర్తిస్ధాయి ఉద్యోగాల్లో ఎంపికవుతారు. ఇక్కడ వయసు, అనుభవం అన్నపదాలకు పెద్దగా విలువలేదు. వ్యక్తిని నిర్ణయించేది కేవలం విద్యార్ధి ప్రతిభ మాత్రమే. అందుకనే చిన్నవయసులోనే ప్రొఫెసర్లు కూడా అయిపోతుంటారు. ఇలాంటి అనేక కారణాలతోనే భారతీయ విద్యార్ధులు అమెరికాకు వెళ్ళిపోవటానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…