Trends

తెలుగులో నెదర్లాండ్స్ బ్యాటర్ తేజ వీడియో వైరల్

2023 వన్డే ప్రపంచ కప్ నకు మన దేశం ఆతిధ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెగాటోర్నీ తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ ల మధ్య జరగగా… రెండో మ్యాచ్ కోసం నెదర్లాండ్, పాకిస్తాన్ జట్లు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం సిద్ధమైంది. నెదర్లాండ్స్ తో అమీతుమీ తేల్చుకునేందుకు పాకిస్తాన్ రెడీ అయింది. ఉప్పల్ లో రెండు వామప్ మ్యాచ్ లు ఆడిన పాకిస్తాన్ ఇక్కడ పరిస్థితులకు అలవాటు పడింది. మరోవైపు, నెదర్లాండ్ కు భారత్ లో ఇదే తొలి పర్యటన. ఈ నేపథ్యంలోనే నెదర్లాండ్స్ జట్టుకు చెందిన తెలుగు తేజం తేజ నిడమనూరు హైదరాబాదీలకు ఒక సందేశం ఇచ్చాడు.

‘హైదరాబాద్ మీకు ఆరెంజ్ అంటే చాలా ఇష్టం. మేము ఇవాళ పాక్ తో ఉప్పల్ లో మ్యాచ్ ఆడుతున్నాం. మీరు గ్రౌండ్ కు వచ్చి మాకు సపోర్ట్ చేస్తే మేము సంతోష పడతాం’ అంటూ తన మాతృభాష తెలుగులో మాట్లాడి ఔరా అనిపించాడు. విజయవాడకు చెందిన తేజ నిడమనూరు నెదర్లాండ్స్ జట్టులో ఆల్ రౌండర్ గా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక ఉప్పల్ లో జరగబోయే మ్యాచ్ కు తేజ కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ప్రజలు తమ మ్యాచ్ చూడాలని ఆహ్వానించాడు.

సన్ రైజర్స్ జట్టు జెర్సీ కూడా ఆరెంజ్ కలర్ లో ఉండడంతో హైదరాబాద్ ప్రజలకు ఆరెంజ్ అంటే చాలా ఇష్టమని, తమ జెర్సీ రంగు కూడా ఆరెంజ్ అని తేజ చెప్పే ప్రయత్నం చేశాడు. అందుకే పాకిస్తాన్ తో జరగబోయే మ్యాచ్ కు వచ్చి తమ జట్టును ఎంకరేజ్ చేయాలని తేజ పిలుపునిచ్చాడు. ఈ మెగా టోర్నీ క్వాలిఫైయర్ మ్యాచ్ లో జింబాబ్వేపై తేజ అద్భుత శతకం సాధించాడు. 110 పరుగులతో అజేయంగా నిలిచి నెదర్లాండ్స్ కు కీలక విజయాన్ని అందించాడు. ఇక, బలమైన పాకిస్తాన్ పై తెలుగు కుర్రాడు తేజ ఏ విధంగా రాణిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా తన క్యూట్ తెలుగుతో స్వీట్ గా మాట్లాడిన తేజ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

This post was last modified on October 6, 2023 6:09 pm

Share

Recent Posts

రవితేజ పోటీని యష్ తట్టుకోవాలంటే

ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…

21 minutes ago

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

1 hour ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

2 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

3 hours ago

టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి `వ‌ర్గ‌`పోరు…!

పార్టీలు బ‌లంగా ఉండాలంటే.. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల మ‌ద్ద‌తు అవ‌స‌రం. నాయ‌కులు, అధినేత‌లు ఎంత బ‌లంగా ఉన్నా.. స‌మాజంలోని వ‌ర్గాలు…

3 hours ago

ఎన్డీయే క‌న్వీన‌ర్‌గా చంద్ర‌బాబు… ఛాన్స్ ఖాయ‌మేనా?

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మిని బ‌లోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మ‌రింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మ‌క అడుగులు…

8 hours ago