2023 వన్డే ప్రపంచ కప్ నకు మన దేశం ఆతిధ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెగాటోర్నీ తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ ల మధ్య జరగగా… రెండో మ్యాచ్ కోసం నెదర్లాండ్, పాకిస్తాన్ జట్లు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం సిద్ధమైంది. నెదర్లాండ్స్ తో అమీతుమీ తేల్చుకునేందుకు పాకిస్తాన్ రెడీ అయింది. ఉప్పల్ లో రెండు వామప్ మ్యాచ్ లు ఆడిన పాకిస్తాన్ ఇక్కడ పరిస్థితులకు అలవాటు పడింది. మరోవైపు, నెదర్లాండ్ కు భారత్ లో ఇదే తొలి పర్యటన. ఈ నేపథ్యంలోనే నెదర్లాండ్స్ జట్టుకు చెందిన తెలుగు తేజం తేజ నిడమనూరు హైదరాబాదీలకు ఒక సందేశం ఇచ్చాడు.
‘హైదరాబాద్ మీకు ఆరెంజ్ అంటే చాలా ఇష్టం. మేము ఇవాళ పాక్ తో ఉప్పల్ లో మ్యాచ్ ఆడుతున్నాం. మీరు గ్రౌండ్ కు వచ్చి మాకు సపోర్ట్ చేస్తే మేము సంతోష పడతాం’ అంటూ తన మాతృభాష తెలుగులో మాట్లాడి ఔరా అనిపించాడు. విజయవాడకు చెందిన తేజ నిడమనూరు నెదర్లాండ్స్ జట్టులో ఆల్ రౌండర్ గా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక ఉప్పల్ లో జరగబోయే మ్యాచ్ కు తేజ కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ప్రజలు తమ మ్యాచ్ చూడాలని ఆహ్వానించాడు.
సన్ రైజర్స్ జట్టు జెర్సీ కూడా ఆరెంజ్ కలర్ లో ఉండడంతో హైదరాబాద్ ప్రజలకు ఆరెంజ్ అంటే చాలా ఇష్టమని, తమ జెర్సీ రంగు కూడా ఆరెంజ్ అని తేజ చెప్పే ప్రయత్నం చేశాడు. అందుకే పాకిస్తాన్ తో జరగబోయే మ్యాచ్ కు వచ్చి తమ జట్టును ఎంకరేజ్ చేయాలని తేజ పిలుపునిచ్చాడు. ఈ మెగా టోర్నీ క్వాలిఫైయర్ మ్యాచ్ లో జింబాబ్వేపై తేజ అద్భుత శతకం సాధించాడు. 110 పరుగులతో అజేయంగా నిలిచి నెదర్లాండ్స్ కు కీలక విజయాన్ని అందించాడు. ఇక, బలమైన పాకిస్తాన్ పై తెలుగు కుర్రాడు తేజ ఏ విధంగా రాణిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా తన క్యూట్ తెలుగుతో స్వీట్ గా మాట్లాడిన తేజ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This post was last modified on October 6, 2023 6:09 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…