Trends

ప్రపంచకప్ ఆరంభం.. పరువు తీశారుగా

వన్డే ప్రపంచకప్ అంటే మామూలు టోర్నీ కాదు. క్రికెట్లో అంతకుమించిన ప్రతిష్టాత్మక టోర్నీ ఇంకోటి లేదు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ టోర్నీకి ఈసారి భారతే ఆతిథ్యమిచ్చింది. మన దేశంలో ప్రపంచకప్ జరగడం ఇది నాలుగోసారి. కానీ గతంలో వేరే ఆసియా జట్లతో కలిసి ఆతిథ్యాన్ని పంచుకున్న భారత్.. ఈసారి సోలోగా ఆతిథ్యమిచ్చింది. ఇలాంటి ప్రత్యేక సందర్భంలో ప్రపంచకప్ తొలి రోజు స్టేడియంలో కనిపించిన దృశ్యాలు చూసి అందరూ నివ్వెరపోయారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత నగరమైన అహ్మదాబాద్‌లో ఆయన పేరిటే కొనసాగుతున్న స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఇదే. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్.. ఆ జట్టు చేతిలోనే ఫైనల్ ఓడిన న్యూజిలాండ్ తలపడ్డాయి. రెండూ పెద్ద జట్లే కావడంతో స్టేడియం జనంతో నిండుగా కళకళాడుతుందని అనుకున్నారంతా.

కానీ స్టేడియంలో మ్యాచ్ మొదలయ్యే సమయానికి పట్టుమని పది వేల మంది కూడా లేరు. స్టేడియం సామర్థ్యం లక్షా 20 వేల పైమాటే. అందులో పదో వంతు కూడా స్టేడియంలో లేక ప్రపంచకప్ కళే కనిపించలేదు. సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజ ఆటగాడు ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా స్టేడియంలో అడుగు పెట్టినా సందడే లేదు. ఇందుకు అందరూ బీసీసీఐ కార్యదర్శి జై షానే నిందిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడైన జై షానే ఇప్పుడు బీసీసీఐలో అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. అర్హత లేకున్నా, కేవలం అమిత్ షా కొడుకు కావడం వల్ల బీసీసీఐలో చక్రం తిప్పుతున్నాడని అతడిపై ఎన్నో విమర్శలున్నాయి.

ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్, భారత్-పాకిస్థాన్ మ్యాచ్, ఇంకా ఫైనల్ ఇలా కీలక మ్యాచ్‌లు అన్నింటికీ మోడీ స్టేడియమే ఆతిథ్యమిచ్చేలా అతనే కీలక పాత్ర పోషించాడు. తీరా చూస్తే తొలి మ్యాచ్‌కు జనం రప్పించలేకపోయాడు. బీజేపీ కార్యకర్తలకు ఉచితంగా టికెట్లు ఇవ్వడమే కాక.. భోజనం టోకెన్లు ఇస్తామన్నా జనం అనుకున్న స్థాయిలో రాలేదు. ఒక ఇన్నింగ్స్ అయ్యాక సాయంత్రానికి ఒక మోస్తరుగా జనం వచ్చారు. వాళ్లు కూడా ఇలా పార్టీ తరఫున వచ్చిన వాళ్లే అని.. మిస్ మేనేజ్మెంట్ వల్ల, ముందు నుంచి టికెట్ల అమ్మకాలు చేపట్టకపోవడం, అభిమానులను ఎంకరేజ్ చేయకపోవడం వల్లే ఇలా జరిగిందని.. క్రికెట్ మైకంతో ఊగిపోయే దేశంలో ప్రపంచకప్ జరుగుతుంటే తొలి మ్యాచ్‌కు స్టేడియం ఖాళీగా కనిపించిందంటే క్రికెట్ ప్రపంచం ముందు భారత్ పరువు పోయినట్లయిందని జై షా మీద నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

Satya

Recent Posts

గ్లామర్ డోస్ పెంచుతున్న త్రిష

సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది అనే ఒక టాక్ ఎప్పటినుంచో ఉంది. మాగ్జిమం ఐదు…

29 minutes ago

790 కోట్ల మోసం… 3 కోట్లు రాబ‌ట్టిన ఈడీ!

దేశాన్ని కుదిపేసిన పోంజీ కుంభ‌కోణం కేసును విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్‌.. చేసిన ప‌ని విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఈ కేసులో ప్ర‌ధాన…

56 minutes ago

ఏజెంట్ నిర్మాతతో ఏకీభ‌వించిన అఖిల్

అక్కినేని అఖిల్‌ను పెద్ద‌ స్టార్‌ను చేసేస్తుంద‌ని అభిమానులు ఆశించిన సినిమా.. ఏజెంట్. నిర్మాత అనిల్ సుంక‌ర సైతం రిలీజ్‌కు ముందు…

3 hours ago

తమన్ సంగీతానికి తమనే పోటీ

తమన్ మ్యూజిక్కుకి తమనే కాంపిటీషన్ కావడం ఏమిటనుకుంటున్నారా. ఇది గతంలో జరిగిందే అయినా ఈసారి మాత్రం కొంచెం స్పెషల్ గా…

4 hours ago

బాబాయ్ సెంటిమెంట్ అబ్బాయికి కలిసి వస్తుందా

ముందు లీకైనట్టే ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం వాయిదా పడింది. జూలై 30 విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు…

6 hours ago

టాలెంట్ వేట ఇలా కూడా చేయొచ్చు

టాలెంట్ ఉండి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలంటే ఎవరో ఒకరి దగ్గర శిష్యుడిగా చేరాలి. లేదా ఎవరైనా రిఫరెన్స్ తీసుకుని ప్రముఖ…

7 hours ago