Trends

69 కేజీల బంగారం.. 336 కిలోల వెండి గణపతి

యావత్ దేశం చేసుకునే కొన్ని పండుగల్లో వినాయక చవితి ఒకటి. వినాయక చవితికి గడిచిన కొంతకాలంగా విపరీతమైన క్రేజ్ పెరుగుతోంది. ఈ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే పందిళ్లు.. చివర్లో చేపట్టే నిమజ్జనానికి భారీ ప్రాధాన్యతను ఇస్తున్న సంగతి తెలిసిందే. వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసే పందిళ్లలో.. తమ శక్తి కొలదీ గణేషుడి విగ్రహాల్ని ఏర్పాటు చేస్తుంటారు అయితే.. దేశంలోనే అత్యంత సంపన్న గణనాధుడి విగ్రహంగా ముంబయిలో ఏర్పాటు చేసిన ఒక వినాయకుడి విగ్రహాన్ని చెబుతున్నారు.

కోట్లాది రూపాయిల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ గణేషుడి మండపాన్ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఏర్పాటు చేసిన ఈ గణపతి మండపాన్ని గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ మండలి ఏర్పాటు చేసింది. ఈ సంస్థను ఏర్పాటు చేసి 69 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో 69 కేజీల బంగారం.. 336 కేజీల వెండి ఆభరణాలతో గణేశ్ విగ్రహాన్ని అత్యంత ఆకర్షనీయంగా ఏర్పాటు చేశారు.

అంతేకాదు.. ఈ ఉత్సవాల సందర్భంగా రూ.360కోట్లకు భారీ బీమా పాలసీని తీసుకోవటం గమనార్హం. గత ఏడాది రూ.316 కోట్లకు పాలసీ తీసుకోగా.. ఈసారి మరింత ఎక్కువ మొత్తానికి పాలసీని తీసుకోవటం విశేషం. బీమాలో భాగంగా బంగారం.. వెండి.. ఇతర విలువైన వస్తువులకు రూ.31.97 కోట్ల కవరేజీ ఉంది. మిగిలిన మొత్తం మండపం.. నిర్వాహకులు.. భక్తుల భద్రతకు కేటాయించినట్లుగా చెబుతున్నారు.

This post was last modified on September 19, 2023 11:32 am

Share
Show comments
Published by
satya

Recent Posts

కాస్త సౌండ్ పెంచు పురుషోత్తమా

యూత్ హీరో రాజ్ తరుణ్ కు మంచి హిట్టు దక్కి ఎంత కాలమయ్యిందో చెప్పడం కష్టం. సీనియర్ హీరోలతో సపోర్టింగ్…

5 mins ago

బాలయ్య బ్యాక్ టు డ్యూటీ

ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…

1 hour ago

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

3 hours ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

3 hours ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

4 hours ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

4 hours ago