Trends

69 కేజీల బంగారం.. 336 కిలోల వెండి గణపతి

యావత్ దేశం చేసుకునే కొన్ని పండుగల్లో వినాయక చవితి ఒకటి. వినాయక చవితికి గడిచిన కొంతకాలంగా విపరీతమైన క్రేజ్ పెరుగుతోంది. ఈ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే పందిళ్లు.. చివర్లో చేపట్టే నిమజ్జనానికి భారీ ప్రాధాన్యతను ఇస్తున్న సంగతి తెలిసిందే. వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసే పందిళ్లలో.. తమ శక్తి కొలదీ గణేషుడి విగ్రహాల్ని ఏర్పాటు చేస్తుంటారు అయితే.. దేశంలోనే అత్యంత సంపన్న గణనాధుడి విగ్రహంగా ముంబయిలో ఏర్పాటు చేసిన ఒక వినాయకుడి విగ్రహాన్ని చెబుతున్నారు.

కోట్లాది రూపాయిల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ గణేషుడి మండపాన్ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఏర్పాటు చేసిన ఈ గణపతి మండపాన్ని గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ మండలి ఏర్పాటు చేసింది. ఈ సంస్థను ఏర్పాటు చేసి 69 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో 69 కేజీల బంగారం.. 336 కేజీల వెండి ఆభరణాలతో గణేశ్ విగ్రహాన్ని అత్యంత ఆకర్షనీయంగా ఏర్పాటు చేశారు.

అంతేకాదు.. ఈ ఉత్సవాల సందర్భంగా రూ.360కోట్లకు భారీ బీమా పాలసీని తీసుకోవటం గమనార్హం. గత ఏడాది రూ.316 కోట్లకు పాలసీ తీసుకోగా.. ఈసారి మరింత ఎక్కువ మొత్తానికి పాలసీని తీసుకోవటం విశేషం. బీమాలో భాగంగా బంగారం.. వెండి.. ఇతర విలువైన వస్తువులకు రూ.31.97 కోట్ల కవరేజీ ఉంది. మిగిలిన మొత్తం మండపం.. నిర్వాహకులు.. భక్తుల భద్రతకు కేటాయించినట్లుగా చెబుతున్నారు.

Satya

Recent Posts

బోరింగ్ అన్నారు… కోట్లు ఇచ్చేస్తున్నారు

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…

31 minutes ago

అడ్రస్ లేని సినిమా గురించి మెగా హీరో ఏమన్నాడు?

సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…

52 minutes ago

బంగారం లాంటి ఓపెనింగ్స్ తీసుకొచ్చింది

పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…

1 hour ago

మరి సురేందర్ రెడ్డి సంగతేంటి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…

3 hours ago

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి!

తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…

4 hours ago

వైసీపీ కాపుల సభలో ఏం జరిగింది?

వైసీపీ ఆధ్వ‌ర్యంలో ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని కోన‌సీమ‌లో ఆదివారం నిర్వ‌హించిన కాపుల స‌భ‌లో మాజీ మంత్రి, ఉత్త‌రాంధ్ర‌కు చెందిన బొత్స…

6 hours ago