Trends

శంషాబాద్ ఎయిర్ పోర్టు ఘనత: 20 లక్షల మార్క్

హైదరాబాద్ శివారులోని (ఇప్పుడైతే నగరంలో భాగంగా మారిందనుకోండి) శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు దూసుకెళుతోంది. కరోనా తర్వాత మిగిలిన విమానాశ్రాయలతో పోలిస్తే.. ఈ ఎయిర్ పోర్టు ద్వారా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులతో పాటు.. దేశీయంగా కూడా ప్రయాణికుల సంఖ్య పెరిగిపోతోంది.

జులై ఒక్క నెలలోనే అంతర్జాతీయ.. దేశీయ ప్రయాణికుల సంఖ్య ఏకంగా 20 లక్షల మార్కును దాటటం విశేషం. జులైలో విదేశీ ప్రయాణికులు 3.68 లక్షలు కాగా.. 16.4 లక్షల మంది దేశీయ ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్ పోర్టు ద్వారా ప్రయాణించినట్లుగా అధికారులు చెబుతున్నారు. దేశంలోనే అత్యధిక విమాన ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరుస్తున్న అంతర్జాతీయ ఎయిర్ పోర్టుల్లో శంషాబాద్ నాలుగో స్థానంలో ఉంది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు మాత్రమే కాదు కర్ణాటక.. మహారాష్ట్రలకు చెందిన వారు సైతం దుబాయ్.. అమెరికా.. ఐరోపా దేశాలకు వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టును ఎంచుకోవటం గమనార్హం. శంషాబాద్ ఎయిర్ పోర్టును ఏర్పాటు చేసిన ఐదున్నరేళ్లకే రద్దీ పెరిగింది. కరోనా పుణ్యమా అని తగ్గిన విమాన ప్రయాణాల సంఖ్య అతి తక్కువ వ్యవధిలోనే పుంజుకోవటం విశేషం. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 80కు పైగా దేశీయ.. అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన సర్వీసులు ఉన్నట్లుగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరింత ఎక్కువ మంది ప్రయాణికుల్ని ఆకర్షించే సత్తా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఉందని చెప్పక తప్పదు.  

This post was last modified on September 2, 2023 2:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రభుత్వ ఉద్యోగాల్లో తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే మ‌రో 40 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు.…

9 minutes ago

మళ్ళీ పాద‌యాత్ర చేసి సాధించేది ఏమన్నా ఉందా జగన్?

అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న ప‌రిస్థితిలో చెప్పడం కష్టంగా…

1 hour ago

వారికి కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం: చంద్రబాబు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…

1 hour ago

బాలయ్య హిందీ, తమిళంలోనూ ఇరగదీస్తున్నాడుగా

నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ‌-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…

2 hours ago

భాగ్యశ్రీని అలా అనడం కరెక్టేనా?

సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్…

2 hours ago

అఖండ ప్లానింగ్… అక్క‌డ సూప‌ర్… కానీ ఇక్క‌డ‌?

పెద్ద సినిమాల‌కు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆల‌స్యం కావ‌డం ఇటీవ‌ల పెద్ద స‌మ‌స్య‌గా మారుతోంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు…

3 hours ago