Trends

శంషాబాద్ ఎయిర్ పోర్టు ఘనత: 20 లక్షల మార్క్

హైదరాబాద్ శివారులోని (ఇప్పుడైతే నగరంలో భాగంగా మారిందనుకోండి) శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు దూసుకెళుతోంది. కరోనా తర్వాత మిగిలిన విమానాశ్రాయలతో పోలిస్తే.. ఈ ఎయిర్ పోర్టు ద్వారా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులతో పాటు.. దేశీయంగా కూడా ప్రయాణికుల సంఖ్య పెరిగిపోతోంది.

జులై ఒక్క నెలలోనే అంతర్జాతీయ.. దేశీయ ప్రయాణికుల సంఖ్య ఏకంగా 20 లక్షల మార్కును దాటటం విశేషం. జులైలో విదేశీ ప్రయాణికులు 3.68 లక్షలు కాగా.. 16.4 లక్షల మంది దేశీయ ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్ పోర్టు ద్వారా ప్రయాణించినట్లుగా అధికారులు చెబుతున్నారు. దేశంలోనే అత్యధిక విమాన ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరుస్తున్న అంతర్జాతీయ ఎయిర్ పోర్టుల్లో శంషాబాద్ నాలుగో స్థానంలో ఉంది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు మాత్రమే కాదు కర్ణాటక.. మహారాష్ట్రలకు చెందిన వారు సైతం దుబాయ్.. అమెరికా.. ఐరోపా దేశాలకు వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టును ఎంచుకోవటం గమనార్హం. శంషాబాద్ ఎయిర్ పోర్టును ఏర్పాటు చేసిన ఐదున్నరేళ్లకే రద్దీ పెరిగింది. కరోనా పుణ్యమా అని తగ్గిన విమాన ప్రయాణాల సంఖ్య అతి తక్కువ వ్యవధిలోనే పుంజుకోవటం విశేషం. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 80కు పైగా దేశీయ.. అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన సర్వీసులు ఉన్నట్లుగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరింత ఎక్కువ మంది ప్రయాణికుల్ని ఆకర్షించే సత్తా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఉందని చెప్పక తప్పదు.  

This post was last modified on September 2, 2023 2:24 pm

Share

Recent Posts

పైరసీ రూపంలో కొత్త తలనెప్పి

ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…

1 hour ago

పోలీస్ దుస్తుల్లో సూర్య షాకింగ్ ట్విస్టు

కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…

2 hours ago

రవితేజ విజయాలకు ‘గట్టిముడి’ పడాలి

ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…

2 hours ago

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

4 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

5 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

12 hours ago