అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. క్రికెట్ దేవుడిగా కీర్తించే భారతరత్న సచిన్ టెండూల్కర్ నివాసం ఎదుట ఒక రాజకీయ నాయకుడు భారీ ఎత్తున నిరసన చేపట్టటం షాకింగ్ గా మారింది. ముంబయిలోని ఆయన ఇంటి ఎదుట ప్రహార్ జనశక్తి పక్ష ఎమ్మెల్యే బడ్చూ కాడూ నిరసన చేపట్టారు. తన అనుచరులతో కలిసి భారీ నిరసన చేపడుతూ.. సచిన్ టెండూల్కర్ తీరును తీవ్రంగా తప్పు పట్టారు.
యూత్ జీవితాల్ని నాశనం చేసే ఆన్ లైన్ గేమ్స్ కు ప్రచారం చేయాల్సిన అవసరం సచిన్ కు ఏముందని ప్రశ్నించిన ఆయన.. ఆన్ లైన్ గేమ్స్ కు ప్రచారకర్తగా ఉండటాన్ని ప్రశ్నించారు. టెండూల్కర్ కు ఇచ్చిన భారతరత్నను వెనక్కి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఫస్ట్ గేమ్స్ పేరున ఒక ఉత్పత్తికి సచిన్ ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు. బ్యాటింగ్ టు బెట్టింగ్ అన్న క్యాప్షన్ కు పక్కనే సచిన్ ఫోటో ఉండటాన్ని తప్పు పడుతున్నారు.
బెట్టింగ్ సంస్థలకు సచిన్ ప్రచార కర్తగా ఎలా ఉంటారన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. ఇప్పటికైనా సరే.. ఆన్ లైన్ గేమ్స్ కు సచిన్ ప్రచారకర్తగా వైదొలగాలన్నారు. ఒకవేళ తాము చెప్పినట్లుగా ప్రచారకర్తగా సచిన్ వైదొలగని పక్షంలో ప్రతి గణేశ్ మండపం వద్ద ధర్నా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. సచిన్ నివాసం ముందు ఎమ్మెల్యే.. అతడి అనుచరులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టటంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బచ్చూతో పాటు మరో 22 మందికి పైగా ఉన్న అతడి మద్దతుదారుల్ని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.
అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…
మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…
పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…