పైత్యం పరాకాష్ఠకు చేరిందన్న దానికి నిదర్శనంగా కొందరు రాజకీయ నేతలు వ్యాఖ్యలు చేస్తుంటారు. సందర్భానికి ఏ మాత్రం అతకని రీతిలో చేసే వ్యాఖ్యలు వారి స్థాయిని తగ్గించటమే కాదు.. విమర్శలు వెల్లువెత్తేలా చేస్తాయి. తాజాగా అలాంటి ఉదంతమే మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
ఐశ్వర్యరాయ్ కు ఉన్నట్లు అందమైన కళ్లు సొంతం కావాలంటే రోజు వారీగా తినే ఆహారంలో చేపలు తీసుకోవాలని మహారాష్ట్ర గిరిజన శాఖా మంత్రి విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. తాజాగా జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేయటం.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. నందుర్బార్ జిల్లాలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. రోజూ చేపలు తినే వారి చర్మం నునుపుగా ఉండటంతో పాటు.. కళ్లు మెరుస్తాయన్నారు.
“ఎవరైనా మిమ్మల్ని చూస్తే.. ఆ వ్యక్తి మీ ఆకర్షణకు లోనవుతారు. నేను ఐశ్వర్యారాయ్ గురించి చెప్పనా? ఆమె మంగళూరులోని సముద్ర తీరంలో ఉండేవారు. రోజూ చేపలు తినేవారు. మీరు ఆమె కళ్లు చూశారా? చేపలు తింటే అలాంటి కళ్లు మీ సొంతమవుతాయి” అంటూ మహారాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. చేపలు తింటే.. అందమైన కళ్లు వస్తాయన్న లాజిక్ పై ఇప్పుడు పలు రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.
This post was last modified on August 22, 2023 11:31 am
జవాన్ తో బాలీవుడ్ లో పెద్ద జెండా పాతేసిన దర్శకుడు అట్లీ నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే సస్పెన్స్ ఇప్పటిదాకా కొనసాగుతూనే…
సెన్సార్ బోర్డు ఏదైనా సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చిందంటే అది కేవలం పెద్దలకు ఉద్దేశించినది మాత్రమేనని అందరికీ తెలిసిన విషయమే.…
నిన్న జరిగిన తండేల్ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగార్జున అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ విజయాలకు…
ఎంత టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో ఒక్కోసారి అవకాశాలు అంత వేగంగా రావు. హిట్టు పడినా సరే కొన్నిసార్లు దురదృష్టం పలకరించి…
సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…