పైత్యం పరాకాష్ఠకు చేరిందన్న దానికి నిదర్శనంగా కొందరు రాజకీయ నేతలు వ్యాఖ్యలు చేస్తుంటారు. సందర్భానికి ఏ మాత్రం అతకని రీతిలో చేసే వ్యాఖ్యలు వారి స్థాయిని తగ్గించటమే కాదు.. విమర్శలు వెల్లువెత్తేలా చేస్తాయి. తాజాగా అలాంటి ఉదంతమే మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
ఐశ్వర్యరాయ్ కు ఉన్నట్లు అందమైన కళ్లు సొంతం కావాలంటే రోజు వారీగా తినే ఆహారంలో చేపలు తీసుకోవాలని మహారాష్ట్ర గిరిజన శాఖా మంత్రి విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. తాజాగా జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేయటం.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. నందుర్బార్ జిల్లాలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. రోజూ చేపలు తినే వారి చర్మం నునుపుగా ఉండటంతో పాటు.. కళ్లు మెరుస్తాయన్నారు.
“ఎవరైనా మిమ్మల్ని చూస్తే.. ఆ వ్యక్తి మీ ఆకర్షణకు లోనవుతారు. నేను ఐశ్వర్యారాయ్ గురించి చెప్పనా? ఆమె మంగళూరులోని సముద్ర తీరంలో ఉండేవారు. రోజూ చేపలు తినేవారు. మీరు ఆమె కళ్లు చూశారా? చేపలు తింటే అలాంటి కళ్లు మీ సొంతమవుతాయి” అంటూ మహారాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. చేపలు తింటే.. అందమైన కళ్లు వస్తాయన్న లాజిక్ పై ఇప్పుడు పలు రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.
This post was last modified on August 22, 2023 11:31 am
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో హిందీ ‘గజిని’ ఒకటి. హాలీవుడ్ మూవీ ‘మొమెంటో’ స్ఫూర్తితో తమిళంలో సూర్య…
ఇవాళ ఎవడే సుబ్రహ్మణ్యంని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మొన్నీమధ్యే ఈవెంట్ చేసి అభిమానులను…
అత్యంత వివాదాస్పద జ్యోతిష్కుడిగా పేరు తెచ్చుకున్న వేణు స్వామి వివిధ సందర్భాల్లో ఎంత అతి చేశాడో చూస్తూనే వచ్చాం. నాగచైతన్య,…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళికి శుక్రవారం మరో భారీ ఊరట లభించింది. ఇప్పటిదాకా…
జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రయోగాలు.. జనసేన నాయకులకు ఇబ్బందిగా మారుతున్నాయి. సాధారణంగా పార్టీని…
ఏపీ సీఎం చంద్రబాబుకు మరో కీలకమైన వ్యవహారం కత్తిమీద సాముగా మారనుంది. ఇప్పటి వరకు పాలన వేరు.. ఆమోదించిన బిల్లులు..…