Trends

హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీద నుంచి కిందకు పడి యువతి దుర్మరణం

హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీద ఘోర ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ తో దూసుకెళ్లే స్నేహితుడి బైక్ మీద ప్రయాణించటమే ఆమె తప్పైంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో కోల్ కతాకు చెందిన 22 ఏళ్ల స్విటీ పాండే మరణించింది. ఆమె తన స్నేహితుడు రాయన్ ల్యుకేతో కలిసి జేఎన్ టీయూ నుంచి ఐకియా వైపు టూ వీలర్ మీద వెళుతున్నారు.

మితిమీరిన వేగంతో దూసుకెళుతున్న ఈ వాహనం.. హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీద అదుపు తప్పింది. వేగం వల్ల దాన్ని కంట్రోల్ చేసే క్రమంలో యువకుడు ఫెయిలై బైక్ ను ఫ్లైఓవర్ గోడను ఢీ కొట్టాడు. అతి వేగం వల్ల వెనుక కూర్చున్న స్వీటీ ఒక్కసారిగా గాల్లో ఎగిరి.. ఫ్లైఓవర్ పై నుంచి కిందకు పడిపోయింది. రెప్పపాటులో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో సదరు యువతి తీవ్రంగా గాయపడింది.

మరోవైపు బైక్ ను ఫ్లైఓవర్ గోడను ఢీ కొట్టిన రాయన్ ల్యుకేకు గాయాలయ్యాయి. వీరిద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ స్విటీ పాండే కన్నుమూసింది. ఈ ఉదంతంపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుడి బాధ్యతారాహిత్యానికి యువతి బలైంది. మహానగరంలో ఇటీవల కాలంలో టూ వీలర్లను వాయు వేగంతో నడటం ఫ్యాషన్ గా మారుతూ తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీనిపై తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉంటూ.. ప్రమాదాల్ని హెచ్చరించాల్సిన అవసరం ఉంది.

This post was last modified on August 18, 2023 11:16 am

Share

Recent Posts

పవన్ భార్యను అలా పిలవకండి

త‌ను స్వ‌త‌హాగా ర‌ష్య‌న్ అయినా.. పుట్టి పెరిగింది ర‌ష్యాలోనే అయినా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…

3 hours ago

ఆర్ఆర్ఆర్ హీరోలకు ప్రమాదాల పర్వం

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…

3 hours ago

త్రివిక్ర‌మ్ మీద అంత అనుమాన‌మా?

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది క‌థ‌లు, స‌న్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…

3 hours ago

సుమంత్ ఈసారి బలంగా వస్తున్నాడు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుమంత్‌ను చూస్తే పెద్ద స్టార్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లే క‌నిపిస్తాడు. ఆర‌డుగుల ఆజానుబాహుడు,…

4 hours ago

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు…

4 hours ago

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు…

6 hours ago