హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీద ఘోర ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ తో దూసుకెళ్లే స్నేహితుడి బైక్ మీద ప్రయాణించటమే ఆమె తప్పైంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో కోల్ కతాకు చెందిన 22 ఏళ్ల స్విటీ పాండే మరణించింది. ఆమె తన స్నేహితుడు రాయన్ ల్యుకేతో కలిసి జేఎన్ టీయూ నుంచి ఐకియా వైపు టూ వీలర్ మీద వెళుతున్నారు.
మితిమీరిన వేగంతో దూసుకెళుతున్న ఈ వాహనం.. హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీద అదుపు తప్పింది. వేగం వల్ల దాన్ని కంట్రోల్ చేసే క్రమంలో యువకుడు ఫెయిలై బైక్ ను ఫ్లైఓవర్ గోడను ఢీ కొట్టాడు. అతి వేగం వల్ల వెనుక కూర్చున్న స్వీటీ ఒక్కసారిగా గాల్లో ఎగిరి.. ఫ్లైఓవర్ పై నుంచి కిందకు పడిపోయింది. రెప్పపాటులో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో సదరు యువతి తీవ్రంగా గాయపడింది.
మరోవైపు బైక్ ను ఫ్లైఓవర్ గోడను ఢీ కొట్టిన రాయన్ ల్యుకేకు గాయాలయ్యాయి. వీరిద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ స్విటీ పాండే కన్నుమూసింది. ఈ ఉదంతంపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుడి బాధ్యతారాహిత్యానికి యువతి బలైంది. మహానగరంలో ఇటీవల కాలంలో టూ వీలర్లను వాయు వేగంతో నడటం ఫ్యాషన్ గా మారుతూ తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీనిపై తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉంటూ.. ప్రమాదాల్ని హెచ్చరించాల్సిన అవసరం ఉంది.
This post was last modified on August 18, 2023 11:16 am
ఇవాళ ఎవడే సుబ్రహ్మణ్యంని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మొన్నీమధ్యే ఈవెంట్ చేసి అభిమానులను…
అత్యంత వివాదాస్పద జ్యోతిష్కుడిగా పేరు తెచ్చుకున్న వేణు స్వామి వివిధ సందర్భాల్లో ఎంత అతి చేశాడో చూస్తూనే వచ్చాం. నాగచైతన్య,…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళికి శుక్రవారం మరో భారీ ఊరట లభించింది. ఇప్పటిదాకా…
జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రయోగాలు.. జనసేన నాయకులకు ఇబ్బందిగా మారుతున్నాయి. సాధారణంగా పార్టీని…
ఏపీ సీఎం చంద్రబాబుకు మరో కీలకమైన వ్యవహారం కత్తిమీద సాముగా మారనుంది. ఇప్పటి వరకు పాలన వేరు.. ఆమోదించిన బిల్లులు..…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత అలిపిరికి అత్యంత సమీపంలో ఓ ప్రైవేట్ హోటల్ వెలిసేందుకు అనుమతులు జారీ…