ఒక దిగ్గజ క్రికెటర్ రిటైరవుతున్నాడంటే.. అతడికి ఫేర్వెల్ మ్యాచ్ ఉండాలని.. మైదానంలో అభిమానుల మధ్య చివరి మ్యాచ్ ఆడి ఘనంగా, గౌరవంగా తప్పుకునే అవకాశం ఉండాలని అభిమానులు ఆశించడం సహజం. క్రికెట్ను కేవలం ఒక ఆటలాగే చూసే విదేశాల్లోనూ క్రికెటర్లకు ఇలాగే వీడ్కోలు ఇస్తుంటారు.
అలాంటిది క్రికెట్ను ఒక మతంలా భావించి, క్రికెటర్లను పిచ్చిగా ఆరాధించే మన దేశంలో తమ ఆరాధ్య క్రికెటర్లకు అలాంటి వీడ్కోలు ఉండాలని కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. అది తప్పు కూడా కాదు. కానీ మన దగ్గర మాత్రం దిగ్గజ క్రికెటర్లు చాలామందికి అలాంటి అవకాశం దక్కట్లేదు. గత రెండు దశాబ్దాల్లో చాలామంది దిగ్గజ క్రికెటర్లు ఫేర్వెల్ మ్యాచ్ లేకుండానే మామూలుగా నిష్క్రమించాల్సిన పరిస్థితి తలెత్తింది.
అనిల్ కుంబ్లే మైదానంలోనే ఉండగానే రిటైర్మెంట్ ప్రకటించాడు కానీ.. మ్యాచ్ అయ్యాకే ఆ ప్రకటన చేశాడు. ముందుగా ఇది తన చివరి మ్యాచ్ అనలేదు. గంగూలీ విషయానికి వస్తే అతడిని జట్టు నుంచి తప్పించారు. మళ్లీ దేశవాళీల్లో రాణించి జట్టులోకి వచ్చాడు. అప్పుడు కూడా అతడికి ప్రాధాన్యం అంతంతమాత్రంగా కనిపించింది. సెలక్టర్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. దీంతో అతను అసంతృప్తితోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. కాకపోతే చివరి మ్యాచ్ ఆడి సహచరుల గౌరవాన్నందుకుని, అభిమానుల మధ్య వీడ్కోలు తీసుకున్నాడు. అంతటితో సరి.. ఇంకే దిగ్గజ ఆటగాడికీ ఈ మాత్రం గౌరవం కూడా దక్కలేదు.
ద్రవిడ్, లక్ష్మణ్, సెహ్వాగ్, జహీర్ ఖాన్, యువరాజ్, గంభీర్.. భారత జట్టుకు ఎన్నో గొప్ప విజయాలందించి, దిగ్గజ స్థాయి అందుకున్న ఆటగాళ్లందరూ మైదానం బయటే, ఎంతో కొంత అసంతృప్తితోనే రిటైర్మెంట్ ప్రకటించారు. వీళ్ల మనసేంటో తెలుసుకుని.. వీడ్కోలు మ్యాచ్ ఆడి గౌరవంగా నిష్క్రమించే అవకాశాన్ని బీసీసీఐ కల్పించలేదు. ఇప్పుడు ధోనీ విషయంలోనూ అదే జరిగింది. అతను అలా ఆశించే ఆటగాడు కాదు కానీ.. బీసీసీఐ అయినా ఆ ఏర్పాటు చేయాల్సింది. ఈ విషయంలో ధోనీ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఐతే గత రెండు దశాబ్దాల్లో పరిశీలిస్తే.. తాను కోరుకున్నపుడు రిటైర్మెంట్ ప్రకటించి.. ఇదే తన చివరి సిరీస్ అని చెప్పి.. ఆ రెండు మ్యాచ్లూ ఆడి.. సహచరులు, అభిమానుల మధ్య సంతోషంగా, సంతృప్తిగా, ఘనంగా వీడ్కోలు తీసుకున్న ఏకైక ఆటగాడు సచిన్ టెండుల్కర్ ఒక్కడే.
This post was last modified on August 18, 2020 11:46 am
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…