తినే తండికి రేషన్ అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ.. భగవంతుడ్ని భక్తితో ఆరాధించేందుకు సైతం రేషన్ పెట్టడం దారుణం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలో తీసుకొచ్చిన కొత్త నిబంధన గురించి తెలిసినంతనే ఒళ్లు మండిపోతుంది. వసతులు ఏర్పాటు చేయటం కష్టంగా మారితే… కొత్త పరిష్కారాలు వెతకాలి. అంతే కానీ.. భక్తితో వచ్చే వారికి కండీషన్లు పెట్టేసి.. రేషన్ విధించేయటం ఏమిటన్న సందేహం కలుగక మానదు.
అన్నవరం దేవస్థానంలో వసతిగదిని ఒకసారి తీసుకుంటే మళ్లీ మూడు నెలల వరకు రూం తీసుకునే అవకాశం లేకుండా అధికారులు పెట్టిన కండీషన్ చూస్తే.. ఇదేం రూల్ అన్న భావన కలుగక మానదు.
కొండ మీద రూం తీసుకునే వేళ.. భక్తుడి ఆధార్ నంబరును తీసుకొని సిస్టంలో నమోదు చేస్తారు. అలా ఒక ఆధార్ నంబరు మీద రూం తీసుకున్న తర్వాత, మళ్లీ 90 రోజుల వరకు రూం కేటాయించే అవకాశం లేకుండా చూసేలా సాఫ్ట్ వేర్ ను సిద్ధం చేశారు. దీంతో.. భక్తులు ఒకసారి అన్నవరం వచ్చి రూం తీసుకుంటే.. మళ్లీ మూడు నెలల వరకు గదిని తీసుకునే అవకాశాన్ని కోల్పోతారు.
అంతేకాదు.. భక్తులు గదిని తీసుకునే సమయంలోనూ.. ఖాళీ చేసే సమయంలోనూ వేలిముద్ర ఇవ్వాల్సి ఉంటుంది. వేలిముద్ర నిర్ణయాన్ని వాడారాంటే అర్థం చేసుకోవచ్చు. తప్పుడు మార్గాల్లో రూంలు పొందే వారికి.. బ్లాక్ మార్కెట్ ను కంట్రోల్ చేయటానికి వీలు కలుగుతుంది. దళారి వ్యవస్థకు బ్రేకులు వేయటానికి నిర్ణయాలు తీసుకోవటం బాగానే ఉన్నా.. ఇలా గదుల కేటాయింపునకు కోటా పెట్టటాన్ని భక్తులు జీర్ణించుకోలేని పరిస్థితి. భక్తుల భక్తికి కోటా నిబంధనను పునరాలోచించుకోవాలన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
This post was last modified on August 7, 2023 11:08 am
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…