వివాహేతర సంబంధం, శారీరక వాంఛ కోసమే.. కట్టుకున్న భర్తను చంపించేసిన ఘటన విశాఖతోపాటు రాష్ట్రంలోనూ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. నేరాలను కట్టడిచేసే పోలీసు కుటుంబంలోనే ఈ దారుణం చోటు చేసుకున్ననేపథ్యంలో సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. విశాఖపట్నం వన్ టౌన్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేసే రమేష్ దారుణ హత్యకు గురయ్యాడు. తొలుత దీనిని సాధారణ మరణమే అనుకున్నా.. తర్వాత ఎందుకో అనుమానం వచ్చి.. విచారణ చేపట్టగా గగుర్పొడిచే వాస్తవాలు వెలుగు చూశాయి.
ఏం జరిగిందంటే..
కానిస్టేబుల్ రమేష్ భార్య శివజ్యోతి అలియాస్ శివాని. ఈమెకు ట్యాక్సీ డ్రైవర్తో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేతర సెక్స్ సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య భర్త రమేష్ అడ్డుగా ఉన్నాడని భావించిన శివాని.. ఏకంగా తన భర్త హత్యకు తానే స్కెచ్ సిద్ధం చేసింది. దీని ప్రకారం..
ప్రియుడు, అతని స్నేహితుడు సహయంతో భర్త ను కడతేరేలా చేసింది శివానీ.
ఇంట్లోనే పథకం ప్రకారం తలగడ(దిండు)తో రమేష్పై ఒత్తిపట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. అయితే.. అనుమానం రాకుండా.. రమేష్కు గుండెనొప్పి గా చిత్రకరించింది భార్య శివ జ్యోతి. ఈ క్రమంలో ఎవరికీ తెలియకుండా.. గుట్టుచప్పుడు కాకుండా.. అంతక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేయించింది. అయితే.. ఈ విషయం స్టేషన్ కానిస్టేబుళ్లకు తెలిసి.. నివాళులర్పించేందుకు వచ్చారు. అయితే.. మొహంపై కమిలిన గుర్తులు ఉండడంతో అనుమానించి.. ఉన్నతాదికారులకు సమాచారం ఇచ్చారు.
దీంతో ఎంవీపీ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో శివానీ చేసిన పాపాన్ని ఒప్పుకోక తప్పలేదు. కాగా, 2009లో కానిస్టేబుల్ గా విధుల్లోకి వచ్చిన బర్రి రమేష్. వన్ టౌన్ లో పనిచేస్తున్నాడు. ఈయనకు రెండేళ్ల కిందటే వివాహం జరిగినట్టు సమాచారం.
This post was last modified on August 4, 2023 2:48 pm
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్న కేటీఆర్ ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. సభలు,…
గత ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా రికార్డులు సృష్టించిన బేబీ సంచలనం ఏకంగా దాన్ని హిందీలో…
మహానటిలో సావిత్రిగా తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే ఇంకో పాత్ర చేయలేదంటేనే ఆ…
'ఎక్కడున్నా భారత్కు తిరిగొచ్చి విచారణకు హాజరవ్వు. తప్పించుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఏ తప్పూ చేయకపోతే.. ఎందుకు భయపడుతున్నావ్? ఎన్ని రోజులు…
ఏపీలో ఎన్నికలు ముగిసి.. వారం రోజులు అయిపోయింది. ఈ నెల 13న నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భాగంగా…
కాంగ్రెస్ హైకమాండ్ ఎంత చెప్పినా తెలంగాణలోని ఆ పార్టీకి చెందిన కొంతమంది మంత్రుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని తెలిసింది.…