అలనాటి అందాల తార.. ఒకప్పటి హీరోయిన్ శోభన గుర్తున్నారా? ఎన్నో అద్భుతమైన సినిమాల్లో హీరోయిన్గా మెప్పించారు. విక్రమ్, రౌడీ అల్లుడు, మువ్వగోపాలుడు, అల్లుడు గారు, త్రిమూర్తులు, రుద్రవీణ, నారీ నారీ నడుమ మురారి, అప్పుల అప్పారావు తదితర చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను మైమరిపించారు. ఆ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మెదలెట్టారు. కొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా చెన్నైలోని ఆమె ఇంట్లో దొంగతనం జరిగింది. తేనాంపేట్లోని శ్రీమాన్ శ్రీనివాస కాలనీలో తల్లితో కలిసి ఉంటున్నారు శోభన.
తన తల్లికి సపర్యలు చేసేందుకు శోభన ఒక మహిళను పనిలో పెట్టుకున్నారు. కానీ కొన్ని రోజులుగా ఆమె తల్లి దగ్గర ఉన్న డబ్బులు పోతున్నాయి. ఆ ఇంట్లో శోభన, ఆమె తల్లి, పనిమనిషి తప్ప ఇతరులు ఉండే అవకాశం లేదు. అందుకే పనిమనిషిని ఆమె అడగ్గా.. తీయలేదని చెప్పింది. దీంతో పోలీసులను శోభన ఆశ్రయించారు.
పనిమనిషిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. తానే డబ్బులు దొంగతనం చేసినట్లు ఆ పనిమనిషి ఒప్పుకుంది. గత నెల రోజుల నుంచి మొత్తం రూ.41 వేల వరకు చోరీ చేసినట్లు చెప్పింది. పేదరికం కారణంగానే డబ్బు మీద ఆశలో ఇలా చేయాల్సి వచ్చిందని ఆ పనిమనిషి తెలిపింది. తనను పనిలో నుంచి తీసేయొద్దని కూడా శోభనను బతిమిలాడింది. దీంతో తిరిగి ఆమెను పనిలో పెట్టుకున్న శోభన.. ఆ కొట్టేసిన డబ్బులను మాత్రం ఆమె జీవితంలో నుంచి కట్ చేశారు. ప్రముఖ భరత నాట్య కళాకారిణి కూడా అయిన శోభన మంచి మనసుకు అభిమానులు ఫిదా అయ్యారు. దొంగతనం చేశాక కూడా పనిమనిషి మీద దయతో పనిలో కొనసాగించడంతో శోభనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
This post was last modified on July 29, 2023 4:22 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…