దేవుళ్ల విగ్రహాలు పాలు, నీళ్లు తాగుతున్నాయన్న వీడియోలు, వార్తలు చూస్తునే ఉన్నాం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హైదారాబాద్లోని రాజేంద్రనగర్ అత్తాపూర్లో జరిగింది. చిన్న అనంతగిరిగా పేరు పొందిన శివాలయంలోని నందీశ్వరుడి విగ్రహం పాలు, నీళ్లు తాగుతుందనే విషయం వైరల్గా మారింది.
ఉదయం పూజలు చేసిన తర్వాత పూజారి ఆ విగ్రహానికి నీళ్లు తాగించారు. విగ్రహం మూతి దగ్గర స్పూన్ పెట్టగానే అందులోని నీళ్లు ఖాళీ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో పోటెత్తారు. నంది విగ్రహానికి నీళ్లు తాగించేందుకు పోటీ పడుతున్నారు. అయితే దీని వెనుక దేవుడి మహిమ ఉందని కొంతమంది అంటుండగా.. అలాంటిదేమీ లేదని సైన్సే కారణమని మరికొంత మంది వాదిస్తున్నారు.
ఇలాంటి పురాతన రాతి విగ్రహాల దగ్గర నీళ్లు పెడితే అవి పీల్చుకోవడం మామూలేనని మరికొంత మంది చెబుతున్నారు. కొన్ని విగ్రహాలకు నీళ్లను పీల్చుకునే శక్తి ఉంటుందని అంటున్నారు. మరి దీని వెనుక కారణమేదైనా భక్తులు మాత్రం ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇటీవల నిజామాబాద్లోని కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామంలో ఉన్న పురాతన మహాదేవి ఆలయంలోని నంది కూడా కొబ్బరి నీళ్లు, పాలు, మామూలు నీళ్లు తాగిందనే వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
This post was last modified on July 27, 2023 4:43 pm
ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…