Trends

నీళ్లు తాగుతున్న నంది విగ్ర‌హం

దేవుళ్ల విగ్ర‌హాలు పాలు, నీళ్లు తాగుతున్నాయ‌న్న వీడియోలు, వార్త‌లు చూస్తునే ఉన్నాం. తాజాగా అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి హైదారాబాద్‌లోని రాజేంద్ర‌న‌గ‌ర్ అత్తాపూర్‌లో జ‌రిగింది. చిన్న అనంత‌గిరిగా పేరు పొందిన శివాలయంలోని నందీశ్వ‌రుడి విగ్ర‌హం పాలు, నీళ్లు తాగుతుంద‌నే విష‌యం వైర‌ల్‌గా మారింది.

ఉద‌యం పూజ‌లు చేసిన త‌ర్వాత పూజారి ఆ విగ్ర‌హానికి నీళ్లు తాగించారు. విగ్ర‌హం మూతి ద‌గ్గ‌ర స్పూన్ పెట్ట‌గానే అందులోని నీళ్లు ఖాళీ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ విష‌యం తెలుసుకున్న భ‌క్తులు ఆల‌యానికి పెద్ద సంఖ్య‌లో పోటెత్తారు. నంది విగ్ర‌హానికి నీళ్లు తాగించేందుకు పోటీ ప‌డుతున్నారు. అయితే దీని వెనుక దేవుడి మ‌హిమ‌ ఉంద‌ని కొంత‌మంది అంటుండ‌గా.. అలాంటిదేమీ లేద‌ని సైన్సే కార‌ణ‌మ‌ని మ‌రికొంత మంది వాదిస్తున్నారు.

ఇలాంటి పురాత‌న రాతి విగ్ర‌హాల ద‌గ్గ‌ర నీళ్లు పెడితే అవి పీల్చుకోవ‌డం మామూలేన‌ని మ‌రికొంత మంది చెబుతున్నారు. కొన్ని విగ్ర‌హాల‌కు నీళ్ల‌ను పీల్చుకునే శ‌క్తి ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి దీని వెనుక కార‌ణ‌మేదైనా భ‌క్తులు మాత్రం ఆల‌యానికి పెద్ద సంఖ్య‌లో చేరుకుంటున్నారు. ఇటీవ‌ల నిజామాబాద్లోని క‌మ్మ‌ర్‌ప‌ల్లి మండ‌లం బ‌షీరాబాద్ గ్రామంలో ఉన్న పురాత‌న మ‌హాదేవి ఆల‌యంలోని నంది కూడా కొబ్బ‌రి నీళ్లు, పాలు, మామూలు నీళ్లు తాగింద‌నే వీడియో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.

This post was last modified on July 27, 2023 4:43 pm

Share
Show comments
Published by
Satya
Tags: attapurnandi

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

7 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

8 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

8 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

10 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

11 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

12 hours ago