దేవుళ్ల విగ్రహాలు పాలు, నీళ్లు తాగుతున్నాయన్న వీడియోలు, వార్తలు చూస్తునే ఉన్నాం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హైదారాబాద్లోని రాజేంద్రనగర్ అత్తాపూర్లో జరిగింది. చిన్న అనంతగిరిగా పేరు పొందిన శివాలయంలోని నందీశ్వరుడి విగ్రహం పాలు, నీళ్లు తాగుతుందనే విషయం వైరల్గా మారింది.
ఉదయం పూజలు చేసిన తర్వాత పూజారి ఆ విగ్రహానికి నీళ్లు తాగించారు. విగ్రహం మూతి దగ్గర స్పూన్ పెట్టగానే అందులోని నీళ్లు ఖాళీ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో పోటెత్తారు. నంది విగ్రహానికి నీళ్లు తాగించేందుకు పోటీ పడుతున్నారు. అయితే దీని వెనుక దేవుడి మహిమ ఉందని కొంతమంది అంటుండగా.. అలాంటిదేమీ లేదని సైన్సే కారణమని మరికొంత మంది వాదిస్తున్నారు.
ఇలాంటి పురాతన రాతి విగ్రహాల దగ్గర నీళ్లు పెడితే అవి పీల్చుకోవడం మామూలేనని మరికొంత మంది చెబుతున్నారు. కొన్ని విగ్రహాలకు నీళ్లను పీల్చుకునే శక్తి ఉంటుందని అంటున్నారు. మరి దీని వెనుక కారణమేదైనా భక్తులు మాత్రం ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇటీవల నిజామాబాద్లోని కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామంలో ఉన్న పురాతన మహాదేవి ఆలయంలోని నంది కూడా కొబ్బరి నీళ్లు, పాలు, మామూలు నీళ్లు తాగిందనే వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
This post was last modified on July 27, 2023 4:43 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…