దేవుళ్ల విగ్రహాలు పాలు, నీళ్లు తాగుతున్నాయన్న వీడియోలు, వార్తలు చూస్తునే ఉన్నాం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హైదారాబాద్లోని రాజేంద్రనగర్ అత్తాపూర్లో జరిగింది. చిన్న అనంతగిరిగా పేరు పొందిన శివాలయంలోని నందీశ్వరుడి విగ్రహం పాలు, నీళ్లు తాగుతుందనే విషయం వైరల్గా మారింది.
ఉదయం పూజలు చేసిన తర్వాత పూజారి ఆ విగ్రహానికి నీళ్లు తాగించారు. విగ్రహం మూతి దగ్గర స్పూన్ పెట్టగానే అందులోని నీళ్లు ఖాళీ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో పోటెత్తారు. నంది విగ్రహానికి నీళ్లు తాగించేందుకు పోటీ పడుతున్నారు. అయితే దీని వెనుక దేవుడి మహిమ ఉందని కొంతమంది అంటుండగా.. అలాంటిదేమీ లేదని సైన్సే కారణమని మరికొంత మంది వాదిస్తున్నారు.
ఇలాంటి పురాతన రాతి విగ్రహాల దగ్గర నీళ్లు పెడితే అవి పీల్చుకోవడం మామూలేనని మరికొంత మంది చెబుతున్నారు. కొన్ని విగ్రహాలకు నీళ్లను పీల్చుకునే శక్తి ఉంటుందని అంటున్నారు. మరి దీని వెనుక కారణమేదైనా భక్తులు మాత్రం ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇటీవల నిజామాబాద్లోని కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామంలో ఉన్న పురాతన మహాదేవి ఆలయంలోని నంది కూడా కొబ్బరి నీళ్లు, పాలు, మామూలు నీళ్లు తాగిందనే వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
This post was last modified on July 27, 2023 4:43 pm
"తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ.. చిట్టినాయుడు. మేం చంద్రబాబు నాయుడితోనే కొట్టాడినం. ఈయనెం త?" అని బీఆర్ ఎస్…
హీరోయిన్గా రెజీనా కసాండ్రా.. ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, నాజర్, బ్రహ్మానందం, ఆలీ.. ఇంకా చాలామంది ప్రముఖ…
సినిమాల ప్రమోషన్లు రోజు రోజుకూ కొంత పుత్తలు తొక్కుతున్నాయి. ఒక మూసలో సాగిపోతే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కష్టం కాబట్టి..…
ఏపీలో అధికారం కోల్పోవడం వైసీపీ నేతలంతా పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు మోపీదేవి వెంకటరమణ, ఆళ్ల నాని,…
సీక్వెల్స్ అంతగా హిట్ కావనే నెగటివ్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. దానికి తగ్గట్టే మన్మథుడు 2, కిక్…
నిన్న విడుదలైన భలే ఉన్నాడే రాజ్ తరుణ్ కి ఊరట కలిగించలేదు. తక్కువ గ్యాప్ లో మూడో సినిమా రిలీజైనా…