పాటలకు అనుగుణంగా డ్యాన్స్లు చేస్తూ వీడియోలు.. రీల్స్ చేయడం.. డైలాగ్లు చెప్పడం.. వీటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం.. ఇప్పుడు పిల్లల నుంచి ముసలి వాళ్ల దాకా ఇదే ట్రెండు నడుస్తోంది. కానీ ఇలా వీడియోలు తీసి.. యూట్యూట్ సహా సామాజిక మాధ్యమాల్లో పెట్టడమే ఆ యువతి పాలిట శాపమైంది. ఎన్నిసార్లు చెప్పినా వీడియోలు పెట్టడం మానట్లేదని ఆగ్రహంతో రగిలిపోయిన ఆ అన్న.. తన సొంత సోదరిని హత్య చేశాడు.
ఈ ఘటన కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రాజీవ్నగర్ తండాలో జరిగింది. 20 ఏళ్ల అజ్మీరా సింధు అలియాస్ సంఘవి మహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఏఎన్ఎం అప్రెంటిస్గా పనిచేసేది. ఆమె తండ్రి అజ్మీరా శంకర్ రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. తల్లి అజ్మీరా దేవి కూలి పని చేస్తోంది. ఆమెకు అన్న హరిలాల్ ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే సింధు వీడియోలు చేస్తూ పోస్టు చేసేది. ఏఎన్ఎం నర్సుగా పని చేస్తూ.. యూట్యూబ్ వీడియోలు కూడా చేసేది. కానీ ఇది ఆమె అన్నకు నచ్చలేదు.
వీడియోలు పెడుతుండడంతో ఇంటి పరువు పోతుందని సింధుతో హరిలాల్ కొంత కాలంగా గొడవ పెట్టుకుంటూనే ఉన్నాడు. కానీ ఆమె మాత్రం వినలేదు. దీనిపై సోమవారం (24న) రాత్రి మరోసారి ఈ అన్నాచెల్లి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఆగ్రహంతో ఉగిపోయిన హరిలాల్ ఇంట్లో ఉన్న రోకలి బండతో చెల్లి తలపై కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను.. మొదట ఇల్లెందు, ఆ తర్వాత ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు చెప్పడంతో వరంగల్ ఏంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె చనిపోయింది. రాయి తగిలి చనిపోయిందని కుటుంబ సభ్యులు, గ్రామస్థులను నమ్మించి మంగళవారం ఉదయం హడావుడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కానీ అనుమానంతో గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. హరిలాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
This post was last modified on July 26, 2023 5:08 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…