పాటలకు అనుగుణంగా డ్యాన్స్లు చేస్తూ వీడియోలు.. రీల్స్ చేయడం.. డైలాగ్లు చెప్పడం.. వీటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం.. ఇప్పుడు పిల్లల నుంచి ముసలి వాళ్ల దాకా ఇదే ట్రెండు నడుస్తోంది. కానీ ఇలా వీడియోలు తీసి.. యూట్యూట్ సహా సామాజిక మాధ్యమాల్లో పెట్టడమే ఆ యువతి పాలిట శాపమైంది. ఎన్నిసార్లు చెప్పినా వీడియోలు పెట్టడం మానట్లేదని ఆగ్రహంతో రగిలిపోయిన ఆ అన్న.. తన సొంత సోదరిని హత్య చేశాడు.
ఈ ఘటన కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రాజీవ్నగర్ తండాలో జరిగింది. 20 ఏళ్ల అజ్మీరా సింధు అలియాస్ సంఘవి మహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఏఎన్ఎం అప్రెంటిస్గా పనిచేసేది. ఆమె తండ్రి అజ్మీరా శంకర్ రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. తల్లి అజ్మీరా దేవి కూలి పని చేస్తోంది. ఆమెకు అన్న హరిలాల్ ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే సింధు వీడియోలు చేస్తూ పోస్టు చేసేది. ఏఎన్ఎం నర్సుగా పని చేస్తూ.. యూట్యూబ్ వీడియోలు కూడా చేసేది. కానీ ఇది ఆమె అన్నకు నచ్చలేదు.
వీడియోలు పెడుతుండడంతో ఇంటి పరువు పోతుందని సింధుతో హరిలాల్ కొంత కాలంగా గొడవ పెట్టుకుంటూనే ఉన్నాడు. కానీ ఆమె మాత్రం వినలేదు. దీనిపై సోమవారం (24న) రాత్రి మరోసారి ఈ అన్నాచెల్లి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఆగ్రహంతో ఉగిపోయిన హరిలాల్ ఇంట్లో ఉన్న రోకలి బండతో చెల్లి తలపై కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను.. మొదట ఇల్లెందు, ఆ తర్వాత ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు చెప్పడంతో వరంగల్ ఏంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె చనిపోయింది. రాయి తగిలి చనిపోయిందని కుటుంబ సభ్యులు, గ్రామస్థులను నమ్మించి మంగళవారం ఉదయం హడావుడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కానీ అనుమానంతో గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. హరిలాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
This post was last modified on July 26, 2023 5:08 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…