పాటలకు అనుగుణంగా డ్యాన్స్లు చేస్తూ వీడియోలు.. రీల్స్ చేయడం.. డైలాగ్లు చెప్పడం.. వీటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం.. ఇప్పుడు పిల్లల నుంచి ముసలి వాళ్ల దాకా ఇదే ట్రెండు నడుస్తోంది. కానీ ఇలా వీడియోలు తీసి.. యూట్యూట్ సహా సామాజిక మాధ్యమాల్లో పెట్టడమే ఆ యువతి పాలిట శాపమైంది. ఎన్నిసార్లు చెప్పినా వీడియోలు పెట్టడం మానట్లేదని ఆగ్రహంతో రగిలిపోయిన ఆ అన్న.. తన సొంత సోదరిని హత్య చేశాడు.
ఈ ఘటన కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రాజీవ్నగర్ తండాలో జరిగింది. 20 ఏళ్ల అజ్మీరా సింధు అలియాస్ సంఘవి మహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఏఎన్ఎం అప్రెంటిస్గా పనిచేసేది. ఆమె తండ్రి అజ్మీరా శంకర్ రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. తల్లి అజ్మీరా దేవి కూలి పని చేస్తోంది. ఆమెకు అన్న హరిలాల్ ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే సింధు వీడియోలు చేస్తూ పోస్టు చేసేది. ఏఎన్ఎం నర్సుగా పని చేస్తూ.. యూట్యూబ్ వీడియోలు కూడా చేసేది. కానీ ఇది ఆమె అన్నకు నచ్చలేదు.
వీడియోలు పెడుతుండడంతో ఇంటి పరువు పోతుందని సింధుతో హరిలాల్ కొంత కాలంగా గొడవ పెట్టుకుంటూనే ఉన్నాడు. కానీ ఆమె మాత్రం వినలేదు. దీనిపై సోమవారం (24న) రాత్రి మరోసారి ఈ అన్నాచెల్లి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఆగ్రహంతో ఉగిపోయిన హరిలాల్ ఇంట్లో ఉన్న రోకలి బండతో చెల్లి తలపై కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను.. మొదట ఇల్లెందు, ఆ తర్వాత ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు చెప్పడంతో వరంగల్ ఏంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె చనిపోయింది. రాయి తగిలి చనిపోయిందని కుటుంబ సభ్యులు, గ్రామస్థులను నమ్మించి మంగళవారం ఉదయం హడావుడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కానీ అనుమానంతో గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. హరిలాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్లో కొనసాగుతున్న…
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…