టమాటా.. ఇది లేనిదే ఏ కూర కూడా పూర్తి కాదనడంలో అతిశయోక్తి కాదు. కానీ ప్రస్తుతం దేశంలో టమాట ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ధరల నియంత్రణకు ప్రభుత్వాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు టమాటలకు మునుపెన్నడూ లేనంత విలువ రావడంతో వీటిని సైతం దొంగిలించడం చూస్తున్నాం. అంతే కాకుంటా టమాట పండించిన కొంతమంది రైతులు రూ.కోట్లలో సంపాదిస్తున్నారనే మాటలూ వింటున్నాం. మరోవైపు మునుపెన్నడూ లేని రీతిలో దీని ధర అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. కానీ ఇలా ధరలు పెరిగాయని మొత్తుకోవడం ఎందుకు? టమాట తినడం మానేస్తే సరిపోతుంది కదా అని ఓ ఉత్తరప్రదేశ్ మహిళా మంత్రి ఉచిత సలహానిచ్చారు.
టమాల ధరలు పెరిగాయని బాధ పడడం ఎందుకు? వీటిని తినయడం మానేయొచ్చు కదా అని ఉత్తరప్రదేశ్ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి ప్రతిభా శుక్లా వ్యాఖ్యానించడం గమనార్హం. ఓ మహిళా అయి ఉండి.. అందులోనూ ఓ మంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటనే విమర్శలు వస్తున్నాయి. ధరల నియంత్రణకు ప్రభుత్వం కృషి చేయడం మాని ఇలాంటి ఉచిత సలహాలు బాగానే ఇస్తున్నారని జనం అంటున్నారు. దీంతో తన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతాయని ఊహించిన ఆ మంత్రి వెంటనే మాట మార్చారు.
టమాటాల ధర పెరిగిపోతుందని బాధ పడడం మానేసి.. వీటిని ఇంటి దగ్గరే పెంచుకుంటే సరిపోతుంది కదా అని మంత్రి ప్రతిభా శుక్లా మరో ప్రకటనలో తెలిపారు. యూపీ ప్రభుత్వ సహకారంతో అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని, టమాటాలు తినడం మానేస్తే రేట్లు దిగివస్తాయని కూడా ఆమె చెప్పారు. అంతే కాకుండా అసలు టమాటాలకు బదులు నిమ్మకాలు తింటే సరిపోతుందని కూడా సదరు మంత్రి సెలవిచ్చారు. దేశంలో ఎవరూ టమాటాలు తినకపోతే రేట్లు ఎందుకు దిగిరావో చూద్దామంటూ పేర్కొన్నారు. మంత్రి ఇలా చెప్పడంపై ప్రజలు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టమాట బదులు నిమ్మకాయాలు ఎలా తింటారో? చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on July 24, 2023 7:08 pm
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…