రాత్రి అన్నం పెట్టలేదని కట్టుకున్న భార్యను చంపాడో ప్రబుద్ధుడు. ప్రస్తుత కాలంలో కోపాన్ని నియంత్రించుకోలేకపోతున్న మనుషులు చేస్తున్న అమానవీయ ఘటనకు ఇదో నిదర్శనం. జీవితాంతం తోడుగా ఉంటాడని నమ్మి వచ్చిన భార్యను.. ఓ భర్త బండరాయితో మోదీ చంపాడు. అందుకు కారణం కూడా పెద్దదేమీ కాదు. అన్నం పెట్టలేదని గొడవ పెట్టుకుని.. ఆగ్రహంతో ఈ దురాగతానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్ జోధ్పూర్లోని మాతా కా థాన్ ఏరియాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రమేశ్ బెనివాల్ (35), సుమన్కు 15 ఏళ్ల క్రిత పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఉంటున్న చిరునామాకు ఏడాది క్రితం మారారు. వీళ్ల సంతానం ప్రస్తుతం హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ దంపతులు మధ్య గొడవ జరిగింది. ఇంటికి ఆలస్యంగా వచ్చాననే కారణంతో అన్నం పెట్టలేదనే ఆగ్రహంతో రమేశ్.. బండ రాయితో భార్య సుమన్ తలపై కొట్టి చంపాడు. అనంతరం రాత్రి 2 గంటల సమయంలో తన బావకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పాడు. అతనేమో జోధ్పూర్లోని తమ బంధువులకు ఈ విషయాన్ని చేరవేశాడు. ఇది తెలుసుకుని రమేశ్ ఇంటికి వచ్చిన బంధువులు తలుపు తీయాలని ఎంత అడిగినా రమేశ్ తీయలేదు. అలాగే రాత్రంతా ఆ శవం పక్కనే కూర్చున్నాడు. చివరకు ఇంటి యజమాని సమాచారంతో అక్కడికి పోలీసులు చేరుకున్నాక.. రమేష్ తలుపులు తీశాడు.
రమేశ్ను పోలీసులు అరెస్టు చేసి.. భార్యను చంపేందుకు ఉపయోగించిన రాయిని స్వాధీనం చేసుకున్నారు. కలప వ్యాపారం చేసే రమేశ్ రెండు మూడు నెలలకోసారి జోధ్పూర్లోని ఇంటికి వస్తుంటాడు. మృతి చెందిన సుమన్ రాష్ట్రీయ లోక్తంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలిగా పని చేశారు. అంతకుముందు పెట్రోల్ బంకులోనూ ఆమె పనిచేశారు.
This post was last modified on July 24, 2023 2:59 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…