రాత్రి అన్నం పెట్టలేదని కట్టుకున్న భార్యను చంపాడో ప్రబుద్ధుడు. ప్రస్తుత కాలంలో కోపాన్ని నియంత్రించుకోలేకపోతున్న మనుషులు చేస్తున్న అమానవీయ ఘటనకు ఇదో నిదర్శనం. జీవితాంతం తోడుగా ఉంటాడని నమ్మి వచ్చిన భార్యను.. ఓ భర్త బండరాయితో మోదీ చంపాడు. అందుకు కారణం కూడా పెద్దదేమీ కాదు. అన్నం పెట్టలేదని గొడవ పెట్టుకుని.. ఆగ్రహంతో ఈ దురాగతానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్ జోధ్పూర్లోని మాతా కా థాన్ ఏరియాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రమేశ్ బెనివాల్ (35), సుమన్కు 15 ఏళ్ల క్రిత పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఉంటున్న చిరునామాకు ఏడాది క్రితం మారారు. వీళ్ల సంతానం ప్రస్తుతం హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ దంపతులు మధ్య గొడవ జరిగింది. ఇంటికి ఆలస్యంగా వచ్చాననే కారణంతో అన్నం పెట్టలేదనే ఆగ్రహంతో రమేశ్.. బండ రాయితో భార్య సుమన్ తలపై కొట్టి చంపాడు. అనంతరం రాత్రి 2 గంటల సమయంలో తన బావకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పాడు. అతనేమో జోధ్పూర్లోని తమ బంధువులకు ఈ విషయాన్ని చేరవేశాడు. ఇది తెలుసుకుని రమేశ్ ఇంటికి వచ్చిన బంధువులు తలుపు తీయాలని ఎంత అడిగినా రమేశ్ తీయలేదు. అలాగే రాత్రంతా ఆ శవం పక్కనే కూర్చున్నాడు. చివరకు ఇంటి యజమాని సమాచారంతో అక్కడికి పోలీసులు చేరుకున్నాక.. రమేష్ తలుపులు తీశాడు.
రమేశ్ను పోలీసులు అరెస్టు చేసి.. భార్యను చంపేందుకు ఉపయోగించిన రాయిని స్వాధీనం చేసుకున్నారు. కలప వ్యాపారం చేసే రమేశ్ రెండు మూడు నెలలకోసారి జోధ్పూర్లోని ఇంటికి వస్తుంటాడు. మృతి చెందిన సుమన్ రాష్ట్రీయ లోక్తంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలిగా పని చేశారు. అంతకుముందు పెట్రోల్ బంకులోనూ ఆమె పనిచేశారు.
This post was last modified on July 24, 2023 2:59 pm
ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…