కలియుగం దైవం వెంకటేశ్వరుడంటే కోరిన కోర్కెలు తీర్చే దేవంగా ప్రశస్తి. అందుకే తిరుపతి వెంకన్నను దర్శించుకోవడానికి దేశదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. అలాగే వెంకటేశ్వరస్వామి ఆలయాలు పలు ఇతర చోట్ల కూడా వాటివాటి మహాత్మ్యం కొద్దీ పేరుపొందాయి.
ఒకప్పుడు హైదరాబాద్ శివార్లలోని వీసా బాలాజీ ఆలయం కూడా అంతే. అలాగే.. కోనసీమ జిల్లా వాడపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా భక్తుల నుంచి అలాంటి గుర్తింపే వస్తోంది. వాడపల్లి వెంకన్న ఆలయంలో ఏడు శనివారాలు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని అంటారు. అందుకే బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారి గత ఆరు వారాలుగా వాడపల్లి ఆలయానికి వస్తున్నారు.
అయితే… మామూలుగా ఎందరో వచ్చి వెళ్తుంటారు కానీ ఈ భక్తుడు మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఈయన బెంగళూరు నుంచి రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయానికి సొంత విమానంలో వచ్చి అక్కడి నుంచి కారులో వాడపల్లి వెళ్లి దర్శించుకుంటున్నారు. ఇప్పటికి ఆరువారాలుగా వస్తున్న ఆయన ఆలయానికి రూ. కోటి విరాళం కూడా ఇచ్చారట.
వాడపల్లి ఆలయం విశాలమైన ప్రాంగణంలో ఉంది. ఏడు శనివారాలు ఈ ఆలయంలో వెంకన్నను దర్శించుకుని 11 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయన్న నమ్మకం ఉండడంతో శనివారాలు ఈ ఆలయానిక భక్తులు పోటెత్తుతుంటారు. ఈ ఆలయంలో గోదాదేవి కల్యాణం జరిపిస్తే అవివాహితులకు పెళ్లవుతుందన్న నమ్మకం కూడా ఉంది. రావులపాలెం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో వాడపల్లి ఉంటుంది. రావులపాలేనికి రాజమండ్రి సహా అనేక ఇతర ప్రాంతాల నుంచి బస్సు సదుపాయం ఉంటుంది.
This post was last modified on July 23, 2023 1:13 pm
తెలుగు సినిమా స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్ కి చేరుకుందని ఒకవైపు మురిసిపోతూనే, ఇంకోవైపు చాలా విషయాల్లో ఆందోళన కలిగిస్తున్న పరిణామాలు…
చాన్నాళ్ల నుంచి భారతీయ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ప్రోమో రానే వచ్చింది. ఇండియాస్ బిగ్గెస్ట్ ఎపిక్స్లో ఒకటైన రామాయణం ఆధారంగా…
శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జైల్లో పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్.. అప్పలరాజును…
రాష్ట్రంలో ఎవరి దయాదాక్షిణ్యాలపైనా తాను ముఖ్యమంత్రిని కాలేదని.. 4 కోట్ల మంది ఓటర్లు ఓటేసి తనను గెలిపించుకున్నారని.. వారి ఆశీర్వాదం,…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి... పాలిటిక్స్ తో పాటు ఇతరత్రా అంశాలపైనా ఓ రేంజి అవగాహన కలిగిన నేతగా…
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ యాక్సిడెంట్ చేయడంతో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందిన సంగతి…