Trends

వారం వారం సొంత విమానంలో వాడపల్లి వస్తున్న బెంగుళూరు భక్తుడు

కలియుగం దైవం వెంకటేశ్వరుడంటే కోరిన కోర్కెలు తీర్చే దేవంగా ప్రశస్తి. అందుకే తిరుపతి వెంకన్నను దర్శించుకోవడానికి దేశదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. అలాగే వెంకటేశ్వరస్వామి ఆలయాలు పలు ఇతర చోట్ల కూడా వాటివాటి మహాత్మ్యం కొద్దీ పేరుపొందాయి.

ఒకప్పుడు హైదరాబాద్ శివార్లలోని వీసా బాలాజీ ఆలయం కూడా అంతే. అలాగే.. కోనసీమ జిల్లా వాడపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా భక్తుల నుంచి అలాంటి గుర్తింపే వస్తోంది. వాడపల్లి వెంకన్న ఆలయంలో ఏడు శనివారాలు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని అంటారు. అందుకే బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారి గత ఆరు వారాలుగా వాడపల్లి ఆలయానికి వస్తున్నారు.

అయితే… మామూలుగా ఎందరో వచ్చి వెళ్తుంటారు కానీ ఈ భక్తుడు మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఈయన బెంగళూరు నుంచి రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయానికి సొంత విమానంలో వచ్చి అక్కడి నుంచి కారులో వాడపల్లి వెళ్లి దర్శించుకుంటున్నారు. ఇప్పటికి ఆరువారాలుగా వస్తున్న ఆయన ఆలయానికి రూ. కోటి విరాళం కూడా ఇచ్చారట.

వాడపల్లి ఆలయం విశాలమైన ప్రాంగణంలో ఉంది. ఏడు శనివారాలు ఈ ఆలయంలో వెంకన్నను దర్శించుకుని 11 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయన్న నమ్మకం ఉండడంతో శనివారాలు ఈ ఆలయానిక భక్తులు పోటెత్తుతుంటారు. ఈ ఆలయంలో గోదాదేవి కల్యాణం జరిపిస్తే అవివాహితులకు పెళ్లవుతుందన్న నమ్మకం కూడా ఉంది. రావులపాలెం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో వాడపల్లి ఉంటుంది. రావులపాలేనికి రాజమండ్రి సహా అనేక ఇతర ప్రాంతాల నుంచి బస్సు సదుపాయం ఉంటుంది.

This post was last modified on July 23, 2023 1:13 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

క‌డ‌ప‌లో రికార్డు స్థాయి పోలింగ్‌.. అక్క చెల్లెళ్ల ఎఫెక్టేనా?

ఏపీలో జ‌రుగుతున్న పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక‌టి రెండు జిల్లాలు మిన‌హా.. మిగిలిన జిల్లాల్లో పోలింగ్ ప్ర‌క్రియ ఆశాజ‌న‌కంగానే సాగుతోంది.…

21 seconds ago

చంద్ర‌బాబు పేరిట త‌ప్పుడు ప్ర‌చారం.. స్ట్రాంగ్ వార్నింగ్‌

ఏపీలో పోలింగ్ ప్ర‌క్రియ‌కు మ‌రికొన్ని గంట‌ల ముందు.. సంచ‌ల‌నం చోటు చేసుకుంది. కూట‌మి పార్టీల ముఖ్య నేత‌, టీడీపీ అధినేత…

16 hours ago

జ‌గ‌న్ చేయాల్సిన ప‌ని.. బాబు చేస్తున్నారు..

ఏపీలో చిత్ర‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. శ‌నివారం సాయంత్రంతో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిపోవ‌డంతో నాయ‌కులు, పార్టీల అధినే త‌లు ఎక్క‌డిక‌క్క‌డ సేద…

17 hours ago

బెట్టింగ్ లో రూ.2 కోట్లు .. కొట్టిచంపిన తండ్రి

బెట్టింగ్‌లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్‌ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లిలో చోటు చేసుకుంది.…

17 hours ago

పవన్‌కు ప్రాణం, జగన్‌కు ఓటు.. మారుతుందా?

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్‌లో పవన్‌కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల…

18 hours ago

జగన్‌ సీట్లపై పీకే లేటెస్ట్ అంచనా

ఆంధ్రప్రదేశ్‌లో గత పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్…

19 hours ago