Trends

కైలాసానికి డైరెక్ట్ రోడ్డు

తొందరలోనే కైలాస పర్వతాన్ని దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్న భక్తులకు గుడ్ న్యూస్. అదేమిటంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం నుండి డైరెక్టుగా కైలాస పర్వతానికి కేంద్రప్రభుత్వమే ఒక రోడ్డును నిర్మిస్తోంది. పరిస్ధితులన్నీ అనుకూలిస్తే సెప్టెంబర్-అక్టోబర్ నాటికి రోడ్డు నిర్మాణం పనులు పూర్తయిపోవచ్చని కేంద్రప్రభుత్వం అంచనా వేస్తోంది. ఒకసారి ఈ రోడ్డు నిర్మాణం పూర్తయి రాకపోకలు మొదలుపెడితే భక్తులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అసలింతకీ ఈ రోడ్డుకు ఎందుకింత ప్రాధాన్యత దక్కుతోంది ? భక్తులందరు ఎందుకని ఈ రోడ్డుకోసం ఎదురు చూస్తున్నట్లు ?

ఎందుకంటే కైలాసపర్వతంపైన పరమశివుడు కొలువయ్యుంటారని కోట్లాదిమంది భక్తులు నమ్ముతున్నారు. మానససరోవరం కూడా కైలాసపర్వతంలోనే ఉంది. ఈ కైలాస పర్వతం భారత్-చైనా సరిహద్దుల్లో ఉంది. సాంకేతికంగా ఈ కైలాసపర్వతంలో కొంత భూభాగం చైనా పరిధిలోకి వస్తుంది. అందుకనే కైలాసపర్వతాన్ని సందర్శించుకోవాలని అనుకునే భక్తులకు చైనా ప్రభుత్వం అనుమతి కూడా అవసరం. భక్తులు కైలాసపర్వతాన్ని దర్శించుకోవటం అన్నది చైనా ప్రభుత్వం దయమీద ఆధారపడుంది. పైగా చైనా భూభాగం మీద నుండి ప్రయాణించటం అత్యంత ప్రమాధకరం.

అందుకనే కైలాసపర్వతాన్ని సందర్శించాలని భక్తులు కుతూహలపడుతున్నా చాలామందికి అనుమతులు దొరకటంలేదు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్రప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. అదేమిటంటే చైనాతో సంబంధంలేకుండా పూర్తిగా మనదేశంలో నుండి కైలాసానికి వెళ్ళేందుకు ఏర్పాటు చేయాలని. ఏర్పాటు చేయాలంటే సుమారు 160 కిలోమీటర్ల రోడ్డు నిర్మించాలి. హిమాలయ పర్వాత ప్రాంతాల్లో ఇంతపెద్ద రోడ్డు నిర్మించాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. అయినా సరే రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉండే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్(బీఆర్వో) ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం మొదలుపెట్టింది.

ఉత్తరాఖండ్ రాష్ట్రం ఫితోర్ గఢ్ జిల్లా నాబిధాంగ్ దగ్గర కేఎస్ వీఎం హాట్స్ నుండి లిపులేఖ్ పాస్ వరకు రోడ్డు పనులు జరుగుతున్నాయి. లిపులేఖ్ పాస్ నుండి 100 కిలోమీటర్లు ప్రయాణిస్తే కైలాసపర్వతం వస్తుంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తియపోతే వెంటనే భక్తులను అనుమతించాలని కేంద్రం సిద్ధంగా ఉంది. ఇక ఈ రోడ్డు పూర్తయితే చైనా భూభాగాన్ని టచ్ చేయాల్సిన అవసరం ఉండదు.

This post was last modified on July 23, 2023 10:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హీరోలు మారినా ఫలితాలు మారట్లేదు

హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…

22 minutes ago

ఎన్టీఆర్ నీల్ ఏం ఇవ్వబోతున్నారు

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…

1 hour ago

అలా బటన్ నొక్కితే… ఇలా నెంబర్ ప్లేట్ మారిపోద్ది

ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…

2 hours ago

మధుర గాయని ఇక లేరు

భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…

4 hours ago

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

6 hours ago

అఖిల్ అభిమానులు ఈసారి ఒప్పుకోరు

షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…

7 hours ago