తొందరలోనే కైలాస పర్వతాన్ని దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్న భక్తులకు గుడ్ న్యూస్. అదేమిటంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం నుండి డైరెక్టుగా కైలాస పర్వతానికి కేంద్రప్రభుత్వమే ఒక రోడ్డును నిర్మిస్తోంది. పరిస్ధితులన్నీ అనుకూలిస్తే సెప్టెంబర్-అక్టోబర్ నాటికి రోడ్డు నిర్మాణం పనులు పూర్తయిపోవచ్చని కేంద్రప్రభుత్వం అంచనా వేస్తోంది. ఒకసారి ఈ రోడ్డు నిర్మాణం పూర్తయి రాకపోకలు మొదలుపెడితే భక్తులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అసలింతకీ ఈ రోడ్డుకు ఎందుకింత ప్రాధాన్యత దక్కుతోంది ? భక్తులందరు ఎందుకని ఈ రోడ్డుకోసం ఎదురు చూస్తున్నట్లు ?
ఎందుకంటే కైలాసపర్వతంపైన పరమశివుడు కొలువయ్యుంటారని కోట్లాదిమంది భక్తులు నమ్ముతున్నారు. మానససరోవరం కూడా కైలాసపర్వతంలోనే ఉంది. ఈ కైలాస పర్వతం భారత్-చైనా సరిహద్దుల్లో ఉంది. సాంకేతికంగా ఈ కైలాసపర్వతంలో కొంత భూభాగం చైనా పరిధిలోకి వస్తుంది. అందుకనే కైలాసపర్వతాన్ని సందర్శించుకోవాలని అనుకునే భక్తులకు చైనా ప్రభుత్వం అనుమతి కూడా అవసరం. భక్తులు కైలాసపర్వతాన్ని దర్శించుకోవటం అన్నది చైనా ప్రభుత్వం దయమీద ఆధారపడుంది. పైగా చైనా భూభాగం మీద నుండి ప్రయాణించటం అత్యంత ప్రమాధకరం.
అందుకనే కైలాసపర్వతాన్ని సందర్శించాలని భక్తులు కుతూహలపడుతున్నా చాలామందికి అనుమతులు దొరకటంలేదు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్రప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. అదేమిటంటే చైనాతో సంబంధంలేకుండా పూర్తిగా మనదేశంలో నుండి కైలాసానికి వెళ్ళేందుకు ఏర్పాటు చేయాలని. ఏర్పాటు చేయాలంటే సుమారు 160 కిలోమీటర్ల రోడ్డు నిర్మించాలి. హిమాలయ పర్వాత ప్రాంతాల్లో ఇంతపెద్ద రోడ్డు నిర్మించాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. అయినా సరే రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉండే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్(బీఆర్వో) ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం మొదలుపెట్టింది.
ఉత్తరాఖండ్ రాష్ట్రం ఫితోర్ గఢ్ జిల్లా నాబిధాంగ్ దగ్గర కేఎస్ వీఎం హాట్స్ నుండి లిపులేఖ్ పాస్ వరకు రోడ్డు పనులు జరుగుతున్నాయి. లిపులేఖ్ పాస్ నుండి 100 కిలోమీటర్లు ప్రయాణిస్తే కైలాసపర్వతం వస్తుంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తియపోతే వెంటనే భక్తులను అనుమతించాలని కేంద్రం సిద్ధంగా ఉంది. ఇక ఈ రోడ్డు పూర్తయితే చైనా భూభాగాన్ని టచ్ చేయాల్సిన అవసరం ఉండదు.
వచ్చే వారం జూలై 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ మీద క్రమంగా పాజిటివ్ బజ్ పెరుగుతోంది. టీమ్…
లెనిన్ సక్సెస్ మీట్ గుంటూరులో ఘనంగా జరిగింది. దశాబ్దంకు పైగా ఎదురు చూసిన విజయం కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున…
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి వ్యవహారం ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మొదట 80వ…
నదుల అనుసంధానం….ఈ మాట టీడీపీ అధినేత నారా చంద్రబాబు నోటి వెంట కొన్ని వందల సార్లు విని ఉంటాం. ప్రాక్టికల్…
ఇటీవలే రాంగోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ AI వల్ల భవిష్యత్తులో సినిమా పరిశ్రమ మీద పడబోయే తీవ్ర ప్రభావం…
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…