Trends

కైలాసానికి డైరెక్ట్ రోడ్డు

తొందరలోనే కైలాస పర్వతాన్ని దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్న భక్తులకు గుడ్ న్యూస్. అదేమిటంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం నుండి డైరెక్టుగా కైలాస పర్వతానికి కేంద్రప్రభుత్వమే ఒక రోడ్డును నిర్మిస్తోంది. పరిస్ధితులన్నీ అనుకూలిస్తే సెప్టెంబర్-అక్టోబర్ నాటికి రోడ్డు నిర్మాణం పనులు పూర్తయిపోవచ్చని కేంద్రప్రభుత్వం అంచనా వేస్తోంది. ఒకసారి ఈ రోడ్డు నిర్మాణం పూర్తయి రాకపోకలు మొదలుపెడితే భక్తులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అసలింతకీ ఈ రోడ్డుకు ఎందుకింత ప్రాధాన్యత దక్కుతోంది ? భక్తులందరు ఎందుకని ఈ రోడ్డుకోసం ఎదురు చూస్తున్నట్లు ?

ఎందుకంటే కైలాసపర్వతంపైన పరమశివుడు కొలువయ్యుంటారని కోట్లాదిమంది భక్తులు నమ్ముతున్నారు. మానససరోవరం కూడా కైలాసపర్వతంలోనే ఉంది. ఈ కైలాస పర్వతం భారత్-చైనా సరిహద్దుల్లో ఉంది. సాంకేతికంగా ఈ కైలాసపర్వతంలో కొంత భూభాగం చైనా పరిధిలోకి వస్తుంది. అందుకనే కైలాసపర్వతాన్ని సందర్శించుకోవాలని అనుకునే భక్తులకు చైనా ప్రభుత్వం అనుమతి కూడా అవసరం. భక్తులు కైలాసపర్వతాన్ని దర్శించుకోవటం అన్నది చైనా ప్రభుత్వం దయమీద ఆధారపడుంది. పైగా చైనా భూభాగం మీద నుండి ప్రయాణించటం అత్యంత ప్రమాధకరం.

అందుకనే కైలాసపర్వతాన్ని సందర్శించాలని భక్తులు కుతూహలపడుతున్నా చాలామందికి అనుమతులు దొరకటంలేదు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్రప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. అదేమిటంటే చైనాతో సంబంధంలేకుండా పూర్తిగా మనదేశంలో నుండి కైలాసానికి వెళ్ళేందుకు ఏర్పాటు చేయాలని. ఏర్పాటు చేయాలంటే సుమారు 160 కిలోమీటర్ల రోడ్డు నిర్మించాలి. హిమాలయ పర్వాత ప్రాంతాల్లో ఇంతపెద్ద రోడ్డు నిర్మించాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. అయినా సరే రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉండే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్(బీఆర్వో) ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం మొదలుపెట్టింది.

ఉత్తరాఖండ్ రాష్ట్రం ఫితోర్ గఢ్ జిల్లా నాబిధాంగ్ దగ్గర కేఎస్ వీఎం హాట్స్ నుండి లిపులేఖ్ పాస్ వరకు రోడ్డు పనులు జరుగుతున్నాయి. లిపులేఖ్ పాస్ నుండి 100 కిలోమీటర్లు ప్రయాణిస్తే కైలాసపర్వతం వస్తుంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తియపోతే వెంటనే భక్తులను అనుమతించాలని కేంద్రం సిద్ధంగా ఉంది. ఇక ఈ రోడ్డు పూర్తయితే చైనా భూభాగాన్ని టచ్ చేయాల్సిన అవసరం ఉండదు.

This post was last modified on July 23, 2023 10:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

31 minutes ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

52 minutes ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

2 hours ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

2 hours ago

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

6 hours ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

6 hours ago