తొందరలోనే కైలాస పర్వతాన్ని దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్న భక్తులకు గుడ్ న్యూస్. అదేమిటంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం నుండి డైరెక్టుగా కైలాస పర్వతానికి కేంద్రప్రభుత్వమే ఒక రోడ్డును నిర్మిస్తోంది. పరిస్ధితులన్నీ అనుకూలిస్తే సెప్టెంబర్-అక్టోబర్ నాటికి రోడ్డు నిర్మాణం పనులు పూర్తయిపోవచ్చని కేంద్రప్రభుత్వం అంచనా వేస్తోంది. ఒకసారి ఈ రోడ్డు నిర్మాణం పూర్తయి రాకపోకలు మొదలుపెడితే భక్తులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అసలింతకీ ఈ రోడ్డుకు ఎందుకింత ప్రాధాన్యత దక్కుతోంది ? భక్తులందరు ఎందుకని ఈ రోడ్డుకోసం ఎదురు చూస్తున్నట్లు ?
ఎందుకంటే కైలాసపర్వతంపైన పరమశివుడు కొలువయ్యుంటారని కోట్లాదిమంది భక్తులు నమ్ముతున్నారు. మానససరోవరం కూడా కైలాసపర్వతంలోనే ఉంది. ఈ కైలాస పర్వతం భారత్-చైనా సరిహద్దుల్లో ఉంది. సాంకేతికంగా ఈ కైలాసపర్వతంలో కొంత భూభాగం చైనా పరిధిలోకి వస్తుంది. అందుకనే కైలాసపర్వతాన్ని సందర్శించుకోవాలని అనుకునే భక్తులకు చైనా ప్రభుత్వం అనుమతి కూడా అవసరం. భక్తులు కైలాసపర్వతాన్ని దర్శించుకోవటం అన్నది చైనా ప్రభుత్వం దయమీద ఆధారపడుంది. పైగా చైనా భూభాగం మీద నుండి ప్రయాణించటం అత్యంత ప్రమాధకరం.
అందుకనే కైలాసపర్వతాన్ని సందర్శించాలని భక్తులు కుతూహలపడుతున్నా చాలామందికి అనుమతులు దొరకటంలేదు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్రప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. అదేమిటంటే చైనాతో సంబంధంలేకుండా పూర్తిగా మనదేశంలో నుండి కైలాసానికి వెళ్ళేందుకు ఏర్పాటు చేయాలని. ఏర్పాటు చేయాలంటే సుమారు 160 కిలోమీటర్ల రోడ్డు నిర్మించాలి. హిమాలయ పర్వాత ప్రాంతాల్లో ఇంతపెద్ద రోడ్డు నిర్మించాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. అయినా సరే రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉండే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్(బీఆర్వో) ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం మొదలుపెట్టింది.
ఉత్తరాఖండ్ రాష్ట్రం ఫితోర్ గఢ్ జిల్లా నాబిధాంగ్ దగ్గర కేఎస్ వీఎం హాట్స్ నుండి లిపులేఖ్ పాస్ వరకు రోడ్డు పనులు జరుగుతున్నాయి. లిపులేఖ్ పాస్ నుండి 100 కిలోమీటర్లు ప్రయాణిస్తే కైలాసపర్వతం వస్తుంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తియపోతే వెంటనే భక్తులను అనుమతించాలని కేంద్రం సిద్ధంగా ఉంది. ఇక ఈ రోడ్డు పూర్తయితే చైనా భూభాగాన్ని టచ్ చేయాల్సిన అవసరం ఉండదు.
This post was last modified on July 23, 2023 10:33 am
గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…
సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…