మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు….మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ ప్రజాకవి గోరటి వెంకన్న ఆర్ద్రతతో పాడిన పాట ఈ కలికాలంలో చాలామంది కఠినాత్ములకు సరిగ్గా అతికినట్టు సరిపోతుంది.
ఆస్తి కోసం కన్నతల్లిదండ్రులను కడతేర్చిన కసాయివారిని చూస్తున్నాం అక్రమ సంబంధాలకు అడ్డుగా వస్తున్నారని ఆలుమగలు ఒకరినొకరు చంపించుకున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇక, అక్రమ సంబంధాలకు వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నారన్న కారణంతో ముక్కుపచ్చలారని పసివాడిని కూడా పరలోకాలకు పంపిస్తున్న ఘటనలూ వెలుగులోకి వస్తున్నాయి.
ఈ కోవలోకే తాజాగా కుషాయిగూడలో జరిగిన ఘటన వస్తుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని నాలుగున్నరేళ్ల చిన్నారిని కన్నతల్లి కర్కశంగా హతమార్చిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది.
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 2న నాలుగున్నరేళ్ల చిన్నారి తన్విత మృతి చెందింది. కుషాయిగూడకు చెందిన కళ్యాణి, రమేష్ కుమార్ 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో రెండేళ్లుగా విడిగా ఉంటున్నారు.
పుట్టింట్లో ఉంటున్న కళ్యాణి…నవీన్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే తమ బంధానికి అడ్డుగా వస్తుందన్న కారణంతో కూతురు తన్వితను కళ్యాణి చంపేసింది. ముఖంపై దిండుతో అదిమిపెట్టి ఊపిరాడకుండా పాశవికంగా హత్య చేసింది.
కళ్యాణి తల్లి రేణుక ఇంటికి వచ్చి చూసేసరికి తన్విత కదల్లేదు. అయితే, పాప నిద్రపోతుందని బుకాయించిన కళ్యాణి….ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లి కూడా డ్రామా ఆడింది. తన కూతురిని బతికించాలంటూ డాక్టర్ లను ప్రాదేయపడింది.
అయితే తన్విత మృతికి కళ్యాణి కారణమై ఉండొచ్చు అంటూ ఆమె భర్త రమేష్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. తమదైన శైలిలో విచారణ జరపడంతో చివరికి నవీన్ తో కలిసి తానే కూతురిని హత్య చేసినట్టు కళ్యాణి అంగీకరించింది. ఈ క్రమంలోనే నవీన్, కళ్యాణిలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
This post was last modified on July 12, 2023 1:07 pm
హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…
మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…