రాక రాక ఒక సెలవు దొరికింది. దీంతో కుటుంబంతో సహా ఎంజాయ్ చేయాలని భావించిన ఆ ఇంటి పెద్ద.. తన పిల్లలు, సతీమణితో కలిసి బీచ్ వెళ్లాడు. అయితే.. ఈ విహారమే.. ఆ ఇంట విషాదాన్ని నింపింది. బీచ్లో గెంతులు వేస్తున్న తన బిడ్డలు.. కళ్లముందు.. నీట మునిగిపోతున్న తీరును చూసి తట్టుకోలేక పోయింది ఆ తండ్రి హృదయం. ఈ క్రమంలో వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నంలో ఆయన కూడా నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది.
ఏం జరిగింది?
ఏపీలోని బాపట్ల జిల్లా అద్దంకి మండలానికి చెందిన పొట్టి వెంకట రాజేష్ కుమార్(42) అనే వ్యక్తి అమెరికాలోని ఓ స్టార్టప్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫ్లోరిడాలోని బ్రిడ్జ్ 7 వాటర్ కమ్యూనిటీలో నివసిస్తున్నారు. అమెరికా ఇండిపెండెన్స్ డేను పురస్కరించుకుని(జూలై 4) సుదీర్ఘ సెలవులు ప్రకటించారు. దీంతో రాజేష్ కుటుంబంతో కలిసి సెలవుల్లో ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకుని బయటకు వెళ్లాడు.
ఈ క్రమంలో రాజేష్ కుమార్ తన కుటుంబంతో కలిసి ఫ్లోరిడాలోని జాక్సన్విల్లే బీచ్కి వెళ్లారు. అక్కడ ఎంచక్కా ఆడి పాడి.. మధ్యలో లంచ్ చేసి.. ఇంటికి రావాలని అనుకున్నారు. అయితే.. బీచ్లోకి దిగిన పిల్లలు సముద్రంలోకి వెళ్లడాన్ని రాజేష్ గమనించాడు. దీంతో అతను వారి వెనుకే పరిగెత్తి తన కొడుకును రక్షించాడు. అయితే, ఇంతలోనే పెద్ద కెరటం వచ్చి రాజేష్ని లోపలికి లాగింది. దీంతో రాజేష్ సముద్రంలో మునిగిపోయాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు జరిగింది.
ఘటన విషయం తెలిసి వెంటనే హెలికాప్టర్లో ఆసుపత్రికి తీసుకెళ్లినా.. ఫలితం దక్కలేదు. ఊపిరితి త్తుల్లో నీరు చేరడంతో రాజేష్ మృతి చెందాడు. అయితే.. ఆయన కుమారుడు షాక్ ట్రీట్మెంట్కు స్పందించాడు. ప్రస్తుతం ఐసియులో కోలుకుంటున్నాడు. ఈ మేరకు రాజేష్ సోదరుడు విజయ్ మీడియాకు వివరాలు వెల్లడించాడు.
విదేశాంగ శాఖకు చంద్రబాబు లేఖ
రాజేష్ ఘటన తెలిసిన వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రాజేష్ కుమార్ మృత దేహాన్ని భారత్కు తిరిగి తీసుకురావడానికి సహాయం చేయాలని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్కు లేఖ రాశారు. రాజేష్ కుటుంబ సభ్యులకు కూడా సహాయం అందించారు. అదేవిధంగా మృత దేహాన్ని స్వదే శానికి రప్పించడానికి బాధితుడి పాస్పోర్ట్ నంబర్, సంప్రదింపుల వివరాలను విదేశాంగ శాఖకు అప్పగించారు.
This post was last modified on July 4, 2023 9:55 am
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 151 సీట్ల నుంచి ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోయింది. ఈ తరహా ఫలితాలు ఆ…
భారత క్రికెట్ జట్టుకు ప్రధాన ఆయుధం జస్ప్రీత్ బుమ్రా. అతను ఉంటే సగం మ్యాచ్ గెలిచినట్లే అని చాలాసార్లు రుజువైంది.…
ఏపీలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీకి సర్వం సిద్ధం అయిపోయింది. మెగా డీఎస్సీఫై ఇప్పటికే టీడీపీ జాతీయ…
జవాన్ తో బాలీవుడ్ లో పెద్ద జెండా పాతేసిన దర్శకుడు అట్లీ నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే సస్పెన్స్ ఇప్పటిదాకా కొనసాగుతూనే…
అసలే అక్కడ విపక్ష పార్టీకి చెందిన బడా నేతలు సందు దొరికితే చాలు.. దూరేద్దామని చూస్తున్నారు. అలాంటి చోట అధికార…
సెన్సార్ బోర్డు ఏదైనా సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చిందంటే అది కేవలం పెద్దలకు ఉద్దేశించినది మాత్రమేనని అందరికీ తెలిసిన విషయమే.…