వెస్టిండీస్….ఒకప్పుడు దిగ్గజ ఆటగాళ్లతో ప్రపంచ క్రికెట్ ను శాసించిన జట్టు… నాలుగు దశాబ్దాల కింద కరీబియన్ బౌలర్లను ఎదుర్కొనేందుకు కరుడుగట్టిన బ్యాట్స్ మెన్లకు సైతం వెన్నులో వణుకు పుట్టేది. బాహుబలిలో కాలకేయుల మాదిరి ఉండే విండీస్ బౌలర్లు విసిరే బౌన్సర్లను తట్టుకోవడానికి ప్రపంచ మేటి బ్యాట్స్ మెన్లు బాహుబలి మాదిరి త్రిశూల వ్యూహం వేసి ఆడినా ఫలితం ఉండేది కాదు. అయితే, ఇదంతా గతం. కొద్ది సంవత్సరాలుగా కరీబియన్ క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్లలో పేలవంగా ఆడుతూ ఘోరంగా విఫలమవుతుంది.
జట్టులో స్టార్ ఆటగాళ్లకు, మ్యాచ్ విన్నర్లకు కొదవ లేనప్పటికీ ఘోర పరాజయాలను మూటగట్టుకొని ప్రపంచ క్రికెట్లో తన ప్రతిష్టను మసకబార్చుకుంటోంది. ఆర్థిక సంక్షోభం నుంచి కొంత గట్టెక్కినా ఆటలో సంక్షోభం నుంచి మాత్రం ఇంకా గట్టెక్కినట్లు కనపడటం లేదు. త్వరలో జరగబోయే ప్రపంచ కప్ టోర్నీకి వెస్టిండీస్ అర్హత సాధించకపోవడం ఇందుకు నిదర్శనం. పసికూన స్కాట్లాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైందంటే విండీస్ ఆటతీరు ఏ స్థాయికి పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
సూపర్ సిక్స్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఓడిపోయిన విండీస్ ఇంటి ముఖం పట్టింది. 50 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో వెస్టిండీస్ జట్టు క్వాలిఫై కాకపోవడం ఇదే తొలిసారి. మరోపక్క, ఆటగాళ్లకు చెల్లించే మొత్తాన్ని పెంచాలని గేల్ వంటి క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా విండీస్ క్రికెట్ బోర్డు తమలోని లోపాలను సరిదిద్దుకొని…ఆటగాళ్లపై, ఆర్థిక స్థితిగతులపై ఫోకస్ చేయకుంటే విండీస్ క్రికెట్ భారీ మూల్యం చెల్లించక తప్పదు.
This post was last modified on July 3, 2023 8:00 am
ఒక్కోసారి అమీర్ ఖాన్ ఏదేదో స్టేట్ మెంట్లు ఇచ్చేసి గందరగోళంలో పడేస్తారు. కొన్ని పనులు కూడా అలాగే అనిపించినా వాటి…
రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక పెద్ద సినిమాలకు టికెట్ల ధరల పెంపు, అదనపు షోల కోసం అనుమతులు…
ఏపీలో కల్తీ నెయ్యి వ్యవహారం రేపిన రాజకీయ దుమారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ తమకు…
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ…
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే…