వెస్టిండీస్….ఒకప్పుడు దిగ్గజ ఆటగాళ్లతో ప్రపంచ క్రికెట్ ను శాసించిన జట్టు… నాలుగు దశాబ్దాల కింద కరీబియన్ బౌలర్లను ఎదుర్కొనేందుకు కరుడుగట్టిన బ్యాట్స్ మెన్లకు సైతం వెన్నులో వణుకు పుట్టేది. బాహుబలిలో కాలకేయుల మాదిరి ఉండే విండీస్ బౌలర్లు విసిరే బౌన్సర్లను తట్టుకోవడానికి ప్రపంచ మేటి బ్యాట్స్ మెన్లు బాహుబలి మాదిరి త్రిశూల వ్యూహం వేసి ఆడినా ఫలితం ఉండేది కాదు. అయితే, ఇదంతా గతం. కొద్ది సంవత్సరాలుగా కరీబియన్ క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్లలో పేలవంగా ఆడుతూ ఘోరంగా విఫలమవుతుంది.
జట్టులో స్టార్ ఆటగాళ్లకు, మ్యాచ్ విన్నర్లకు కొదవ లేనప్పటికీ ఘోర పరాజయాలను మూటగట్టుకొని ప్రపంచ క్రికెట్లో తన ప్రతిష్టను మసకబార్చుకుంటోంది. ఆర్థిక సంక్షోభం నుంచి కొంత గట్టెక్కినా ఆటలో సంక్షోభం నుంచి మాత్రం ఇంకా గట్టెక్కినట్లు కనపడటం లేదు. త్వరలో జరగబోయే ప్రపంచ కప్ టోర్నీకి వెస్టిండీస్ అర్హత సాధించకపోవడం ఇందుకు నిదర్శనం. పసికూన స్కాట్లాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైందంటే విండీస్ ఆటతీరు ఏ స్థాయికి పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
సూపర్ సిక్స్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఓడిపోయిన విండీస్ ఇంటి ముఖం పట్టింది. 50 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో వెస్టిండీస్ జట్టు క్వాలిఫై కాకపోవడం ఇదే తొలిసారి. మరోపక్క, ఆటగాళ్లకు చెల్లించే మొత్తాన్ని పెంచాలని గేల్ వంటి క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా విండీస్ క్రికెట్ బోర్డు తమలోని లోపాలను సరిదిద్దుకొని…ఆటగాళ్లపై, ఆర్థిక స్థితిగతులపై ఫోకస్ చేయకుంటే విండీస్ క్రికెట్ భారీ మూల్యం చెల్లించక తప్పదు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…