Trends

ఇవేం హత్యలు? ప్రియుడితో కలిసి మరో ప్రియుడ్ని లేపేసింది

మారుతున్న కాలానికి తగ్గట్లు చోటు చేసుకుంటున్న దారుణ హత్యల వివరాలు తెలిస్తే నోట వెంట మాట రాని పరిస్థితి. బంధాలు.. అనుబంధాల మీద కొత్త సందేహాలు పుట్టుకొచ్చేలా ఉంటున్న ఈ దారుణాల వివరాలు తెలిసినంతనే నోట మాట రాలేని పరిస్థితి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం పాతబస్తీలోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో డెడ్ బాడీని గుర్తించిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడీకి సంబంధించిన మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ క్రమంలో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.

పెళ్లైన మహిళ ఇద్దరితో వివాహేతర సంబంధాన్ని నెరుపుతూ.. ఒక ప్రియుడి సాయంతో మరో ప్రియుడ్నిచంపేసిన దారుణం వెలుగు చూసింది. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ కు చెందిన పూరణ్ సింగ్ పాతబస్తీ బండ్లగూడ.. పటేల్ నగర్ లో పానీపూరీ బండి నడుపుతుంటాడు. అతను ఉత్తరప్రదేశ్ లో ఉన్నప్పుడు జయాదేవితో లవ్ ఎఫైర్ ఉండేది. ఆ తర్వాత యూపీ నుంచి హైదరాబాద్ కు వచ్చేశాడు. ఇక్కడే సెటిల్ అయ్యాడు.

కొన్నేళ్ల క్రితం అతడికి హైదరాబాద్ కు చెందిన మమతతో పెళ్లైంది. అదే సమయంలో జయాదేవికి మరొకరితో పెళ్లైంది. వారి కుటుంబం కూడా హైదరాబాద్ కు ఉపాధి కోసం వచ్చేసింది. అక్రమంలో పాత పరిచయం మళ్లీ మొదలైంది. దీంతో.. పూరణ్ సింగ్ – జయాదేవి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. ఇదిలా ఉంటే.. జయాదేవికి చంద్రాయణగుట్టకు చెందిన నజీమ్ తో పరిచయమైంది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. వారి మధ్య రిలేషన్ బలపడటం.. గతంలో తనను ప్రేమించిన పూరణ్ సింగ్ తనను పెళ్లి చేసుకోలేదన్న కోపంతో ఉన్న ఆమె.. అతడ్ని అడ్డు తొలగించుకోవాలని భావించింది.

అందుకు నజీమ్ అతని స్నేహితులందరితో కలిసి పూరణ్ సింగ్ ను చంపాలని ప్లాన్ చేశారు. జయాదేవికి పూరణ్ సింగ్ కు పరిచయస్తుడైన సుగుణారాం ఫోన్ చేశాడు. పూరణ్ సింగ్ ను తుక్కుగూడకు రావాలని కోరాడు. దీంతో అక్కడకు వచ్చిన అతన్ని.. పథకంలో భాగంగా ఐదుగురు కలిసి దారుణంగా హత్య చేశారు. అనంతరం నజీమ్.. పూరణ్ సింగ్ ను డ్రమ్ములో వేసుకొని సూరం చెరువులో పడేసి పారిపోయాడు. భర్త పూరణ్ సింగ్ కనిపించకపోవటంతో అతని భార్య మమత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో హత్య జరిగిన ప్రాంతంలో పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో గదిలో ఉన్న సామాగ్రిని తీసుకెళ్లేందుకు వచ్చిన నజీం.. సుగుణారాం రావటం.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించటంతో షాకింగ్ నిజాలన్నీ బయటకు వచ్చాయి. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.

This post was last modified on June 7, 2023 12:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

19 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago