Trends

ఇవేం హత్యలు? ప్రియుడితో కలిసి మరో ప్రియుడ్ని లేపేసింది

మారుతున్న కాలానికి తగ్గట్లు చోటు చేసుకుంటున్న దారుణ హత్యల వివరాలు తెలిస్తే నోట వెంట మాట రాని పరిస్థితి. బంధాలు.. అనుబంధాల మీద కొత్త సందేహాలు పుట్టుకొచ్చేలా ఉంటున్న ఈ దారుణాల వివరాలు తెలిసినంతనే నోట మాట రాలేని పరిస్థితి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం పాతబస్తీలోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో డెడ్ బాడీని గుర్తించిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడీకి సంబంధించిన మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ క్రమంలో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.

పెళ్లైన మహిళ ఇద్దరితో వివాహేతర సంబంధాన్ని నెరుపుతూ.. ఒక ప్రియుడి సాయంతో మరో ప్రియుడ్నిచంపేసిన దారుణం వెలుగు చూసింది. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ కు చెందిన పూరణ్ సింగ్ పాతబస్తీ బండ్లగూడ.. పటేల్ నగర్ లో పానీపూరీ బండి నడుపుతుంటాడు. అతను ఉత్తరప్రదేశ్ లో ఉన్నప్పుడు జయాదేవితో లవ్ ఎఫైర్ ఉండేది. ఆ తర్వాత యూపీ నుంచి హైదరాబాద్ కు వచ్చేశాడు. ఇక్కడే సెటిల్ అయ్యాడు.

కొన్నేళ్ల క్రితం అతడికి హైదరాబాద్ కు చెందిన మమతతో పెళ్లైంది. అదే సమయంలో జయాదేవికి మరొకరితో పెళ్లైంది. వారి కుటుంబం కూడా హైదరాబాద్ కు ఉపాధి కోసం వచ్చేసింది. అక్రమంలో పాత పరిచయం మళ్లీ మొదలైంది. దీంతో.. పూరణ్ సింగ్ – జయాదేవి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. ఇదిలా ఉంటే.. జయాదేవికి చంద్రాయణగుట్టకు చెందిన నజీమ్ తో పరిచయమైంది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. వారి మధ్య రిలేషన్ బలపడటం.. గతంలో తనను ప్రేమించిన పూరణ్ సింగ్ తనను పెళ్లి చేసుకోలేదన్న కోపంతో ఉన్న ఆమె.. అతడ్ని అడ్డు తొలగించుకోవాలని భావించింది.

అందుకు నజీమ్ అతని స్నేహితులందరితో కలిసి పూరణ్ సింగ్ ను చంపాలని ప్లాన్ చేశారు. జయాదేవికి పూరణ్ సింగ్ కు పరిచయస్తుడైన సుగుణారాం ఫోన్ చేశాడు. పూరణ్ సింగ్ ను తుక్కుగూడకు రావాలని కోరాడు. దీంతో అక్కడకు వచ్చిన అతన్ని.. పథకంలో భాగంగా ఐదుగురు కలిసి దారుణంగా హత్య చేశారు. అనంతరం నజీమ్.. పూరణ్ సింగ్ ను డ్రమ్ములో వేసుకొని సూరం చెరువులో పడేసి పారిపోయాడు. భర్త పూరణ్ సింగ్ కనిపించకపోవటంతో అతని భార్య మమత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో హత్య జరిగిన ప్రాంతంలో పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో గదిలో ఉన్న సామాగ్రిని తీసుకెళ్లేందుకు వచ్చిన నజీం.. సుగుణారాం రావటం.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించటంతో షాకింగ్ నిజాలన్నీ బయటకు వచ్చాయి. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.

Satya

Recent Posts

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

29 minutes ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

3 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

4 hours ago

పవన్ చెప్పిందేమిటి?… వీరు చేస్తున్నదేమిటీ?

రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…

4 hours ago

దీవానా సమస్య సెన్సార్ మాత్రమేనా

మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…

5 hours ago

రీ-నీట్… ఇంత చేసినా మళ్లీ సందేహాలు, ప్రశ్నలు!?

రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…

5 hours ago