Trends

ఇవేం హత్యలు? ప్రియుడితో కలిసి మరో ప్రియుడ్ని లేపేసింది

మారుతున్న కాలానికి తగ్గట్లు చోటు చేసుకుంటున్న దారుణ హత్యల వివరాలు తెలిస్తే నోట వెంట మాట రాని పరిస్థితి. బంధాలు.. అనుబంధాల మీద కొత్త సందేహాలు పుట్టుకొచ్చేలా ఉంటున్న ఈ దారుణాల వివరాలు తెలిసినంతనే నోట మాట రాలేని పరిస్థితి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం పాతబస్తీలోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో డెడ్ బాడీని గుర్తించిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడీకి సంబంధించిన మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ క్రమంలో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.

పెళ్లైన మహిళ ఇద్దరితో వివాహేతర సంబంధాన్ని నెరుపుతూ.. ఒక ప్రియుడి సాయంతో మరో ప్రియుడ్నిచంపేసిన దారుణం వెలుగు చూసింది. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ కు చెందిన పూరణ్ సింగ్ పాతబస్తీ బండ్లగూడ.. పటేల్ నగర్ లో పానీపూరీ బండి నడుపుతుంటాడు. అతను ఉత్తరప్రదేశ్ లో ఉన్నప్పుడు జయాదేవితో లవ్ ఎఫైర్ ఉండేది. ఆ తర్వాత యూపీ నుంచి హైదరాబాద్ కు వచ్చేశాడు. ఇక్కడే సెటిల్ అయ్యాడు.

కొన్నేళ్ల క్రితం అతడికి హైదరాబాద్ కు చెందిన మమతతో పెళ్లైంది. అదే సమయంలో జయాదేవికి మరొకరితో పెళ్లైంది. వారి కుటుంబం కూడా హైదరాబాద్ కు ఉపాధి కోసం వచ్చేసింది. అక్రమంలో పాత పరిచయం మళ్లీ మొదలైంది. దీంతో.. పూరణ్ సింగ్ – జయాదేవి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. ఇదిలా ఉంటే.. జయాదేవికి చంద్రాయణగుట్టకు చెందిన నజీమ్ తో పరిచయమైంది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. వారి మధ్య రిలేషన్ బలపడటం.. గతంలో తనను ప్రేమించిన పూరణ్ సింగ్ తనను పెళ్లి చేసుకోలేదన్న కోపంతో ఉన్న ఆమె.. అతడ్ని అడ్డు తొలగించుకోవాలని భావించింది.

అందుకు నజీమ్ అతని స్నేహితులందరితో కలిసి పూరణ్ సింగ్ ను చంపాలని ప్లాన్ చేశారు. జయాదేవికి పూరణ్ సింగ్ కు పరిచయస్తుడైన సుగుణారాం ఫోన్ చేశాడు. పూరణ్ సింగ్ ను తుక్కుగూడకు రావాలని కోరాడు. దీంతో అక్కడకు వచ్చిన అతన్ని.. పథకంలో భాగంగా ఐదుగురు కలిసి దారుణంగా హత్య చేశారు. అనంతరం నజీమ్.. పూరణ్ సింగ్ ను డ్రమ్ములో వేసుకొని సూరం చెరువులో పడేసి పారిపోయాడు. భర్త పూరణ్ సింగ్ కనిపించకపోవటంతో అతని భార్య మమత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో హత్య జరిగిన ప్రాంతంలో పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో గదిలో ఉన్న సామాగ్రిని తీసుకెళ్లేందుకు వచ్చిన నజీం.. సుగుణారాం రావటం.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించటంతో షాకింగ్ నిజాలన్నీ బయటకు వచ్చాయి. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.

This post was last modified on June 7, 2023 12:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

34 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago