వారంతా ఒలింపిక్స్ పతకంతో పాటు అంతర్జాతీయంగా మెడళ్లు.. టైటిళ్లు సాధించిన భారత మహిళా రెజ్లర్లు. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న వారు.. గడిచిన కొన్ని వారాలుగా రోడ్ల మీదకు వచ్చి.. తమపట్ల దారుణంగా వ్యవహరించే పెద్ద మనిషి మీద నిరసన చేపట్టటం తెలిసిందే. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా నేటి వరకు కేంద్రంలోని మోడీ సర్కారు కిమ్మనకుండా ఉండటం షాకింగ్ గా మారింది. తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ జాతీయ రెజ్లర్ల సమాఖ్యకు చీఫ్ గా వ్యవహరిస్తున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా వారు గొంతు చించుకుంటున్నా.. ఇప్పటివరకు వారి మొరను పట్టించుకున్న పాపాన పోలేదు.
మరింత షాకింగ్ నిజం ఏమంటే.. అంతర్జాతీయ స్టార్ రెజ్లర్లు పలువురు తమకు ఎదురైన లైంగిక వేధింపులపై పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు. చివరకు సుప్రీం వరకు విషయం వెల్లటంతో వారు ఎఫ్ఐఆర్ చేయక తప్పలేదు. ఇక.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత క్రీడాకారులు చేసిన ఫిర్యాదులను పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. అందులో పేర్కొన్న అంశాలు తాజాగా మీడియాలోకి వచ్చాయి. క్రీడాకారిణులు చేసిన ఫిర్యాదుల్లోని అంశాల్ని చూస్తే.. షాకింగ్ గా మారక మానదు. అందులో ఉన్న కీలక అంశాల్ని చూస్తే.. ఇంత దారుణాలకు పాల్పడినా ఆయనపై చర్యలు తీసుకోవటానికి కేంద్రంలోని మోడీ సర్కారు సైతం ఎందుకు సిద్ధంగా లేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఢిల్లీలోని కన్షాట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన రెండు ఎఫ్ఐఆర్ లోని అంశాల్ని చూస్తే..
This post was last modified on June 2, 2023 7:05 pm
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…