వారంతా ఒలింపిక్స్ పతకంతో పాటు అంతర్జాతీయంగా మెడళ్లు.. టైటిళ్లు సాధించిన భారత మహిళా రెజ్లర్లు. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న వారు.. గడిచిన కొన్ని వారాలుగా రోడ్ల మీదకు వచ్చి.. తమపట్ల దారుణంగా వ్యవహరించే పెద్ద మనిషి మీద నిరసన చేపట్టటం తెలిసిందే. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా నేటి వరకు కేంద్రంలోని మోడీ సర్కారు కిమ్మనకుండా ఉండటం షాకింగ్ గా మారింది. తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ జాతీయ రెజ్లర్ల సమాఖ్యకు చీఫ్ గా వ్యవహరిస్తున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా వారు గొంతు చించుకుంటున్నా.. ఇప్పటివరకు వారి మొరను పట్టించుకున్న పాపాన పోలేదు.
మరింత షాకింగ్ నిజం ఏమంటే.. అంతర్జాతీయ స్టార్ రెజ్లర్లు పలువురు తమకు ఎదురైన లైంగిక వేధింపులపై పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు. చివరకు సుప్రీం వరకు విషయం వెల్లటంతో వారు ఎఫ్ఐఆర్ చేయక తప్పలేదు. ఇక.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత క్రీడాకారులు చేసిన ఫిర్యాదులను పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. అందులో పేర్కొన్న అంశాలు తాజాగా మీడియాలోకి వచ్చాయి. క్రీడాకారిణులు చేసిన ఫిర్యాదుల్లోని అంశాల్ని చూస్తే.. షాకింగ్ గా మారక మానదు. అందులో ఉన్న కీలక అంశాల్ని చూస్తే.. ఇంత దారుణాలకు పాల్పడినా ఆయనపై చర్యలు తీసుకోవటానికి కేంద్రంలోని మోడీ సర్కారు సైతం ఎందుకు సిద్ధంగా లేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఢిల్లీలోని కన్షాట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన రెండు ఎఫ్ఐఆర్ లోని అంశాల్ని చూస్తే..
This post was last modified on June 2, 2023 7:05 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…