వారంతా ఒలింపిక్స్ పతకంతో పాటు అంతర్జాతీయంగా మెడళ్లు.. టైటిళ్లు సాధించిన భారత మహిళా రెజ్లర్లు. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న వారు.. గడిచిన కొన్ని వారాలుగా రోడ్ల మీదకు వచ్చి.. తమపట్ల దారుణంగా వ్యవహరించే పెద్ద మనిషి మీద నిరసన చేపట్టటం తెలిసిందే. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా నేటి వరకు కేంద్రంలోని మోడీ సర్కారు కిమ్మనకుండా ఉండటం షాకింగ్ గా మారింది. తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ జాతీయ రెజ్లర్ల సమాఖ్యకు చీఫ్ గా వ్యవహరిస్తున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా వారు గొంతు చించుకుంటున్నా.. ఇప్పటివరకు వారి మొరను పట్టించుకున్న పాపాన పోలేదు.
మరింత షాకింగ్ నిజం ఏమంటే.. అంతర్జాతీయ స్టార్ రెజ్లర్లు పలువురు తమకు ఎదురైన లైంగిక వేధింపులపై పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు. చివరకు సుప్రీం వరకు విషయం వెల్లటంతో వారు ఎఫ్ఐఆర్ చేయక తప్పలేదు. ఇక.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత క్రీడాకారులు చేసిన ఫిర్యాదులను పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. అందులో పేర్కొన్న అంశాలు తాజాగా మీడియాలోకి వచ్చాయి. క్రీడాకారిణులు చేసిన ఫిర్యాదుల్లోని అంశాల్ని చూస్తే.. షాకింగ్ గా మారక మానదు. అందులో ఉన్న కీలక అంశాల్ని చూస్తే.. ఇంత దారుణాలకు పాల్పడినా ఆయనపై చర్యలు తీసుకోవటానికి కేంద్రంలోని మోడీ సర్కారు సైతం ఎందుకు సిద్ధంగా లేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఢిల్లీలోని కన్షాట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన రెండు ఎఫ్ఐఆర్ లోని అంశాల్ని చూస్తే..
This post was last modified on June 2, 2023 7:05 pm
ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…