ఉత్తరకొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన వేసే శిక్షలు.. తీసుకునే నిర్ణయాలు నిభిడాశ్చర్యాన్ని కలిగిస్తాయి. మనుషులను స్థాణువులను(బిగదీసుకు పోవడం) చేస్తాయి. ఆయన పాలన తీరే అంత. తాజాగా మరోసారి ఆయన వార్తల్లోకి వచ్చారు. మరి ఈ సారి ఆయన చేసిన నిర్వాకం.. ఏంటంటే.. బైబిల్ పట్టుకుందని పసిమొగ్గకు జీవిత ఖైదు విధించడమే! దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహం రగులుతోంది. కిమ్ కనిపిస్తే.. కంటి చూపుతో మసి చేయాలన్నంత కోపంతో క్రైస్తవులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తర కొరియాలో క్రైస్తవులు అత్యంత తీవ్రమైన శిక్షలకు గురవుతున్నారని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ నివేదిక తాజాగా వెల్లడించిం ది. బైబిల్తో పట్టుబడినవారికి మరణ శిక్ష, వారి కుటుంబ సభ్యులకు జీవిత ఖైదు విధిస్తున్నారని తెలిపింది. పసిబిడ్డలకు కూడా జీవిత ఖైదు విధిస్తున్నట్లు పేర్కొంది. క్రైస్తవులతోపాటు ఇతర మతస్థులు కూడా ఇటువంటి దారుణ శిక్షలకు గురవుతున్నట్లు తెలిపింది. ఉత్తర కొరియాలో క్రైస్తవులు, ఇతర మతాలవారు దాదాపు 70 వేల మంది జైలు శిక్షను అనుభవిస్తున్నారని పేర్కొంది.
పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, రెండేళ్ల చిన్నారి తల్లిదండ్రుల వద్ద బైబిల్ ఉండటంతో, ఆ బాలుడితోపాటు మొత్తం కుటుంబ సభ్యులకు జీవిత ఖైదు విధించారు. వీరిని రాజకీయ కారాగార శిబిరంలో ఉంచినట్లు తెలుస్తోంది. మతాచారాలను పాటించేవారిని ఉత్తర కొరియా తీవ్రంగా శిక్షిస్తోంది. బైబిల్ కలిగియున్నవారిపై విరుచుకుపడుతోంది. రాజకీయ కారాగార శిబిరాల్లో శిక్షను అనుభవిస్తున్నవారు చెప్తున్నదాని ప్రకారం ఈ కేంద్రాల్లో శారీరకంగా హింసిస్తున్నట్లు తెలుస్తోంది.
షమనిక్ అడహరెంట్స్, క్రైస్తవులపై మానవ హక్కుల ఉల్లంఘనలకు కారణం 90 శాతం వరకు ఉత్తర కొరియా స్టేట్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖేనని ఈ నివేదిక తెలిపింది. ఉత్తర కొరియాలో న్యాయం, జవాబుదారీతనం కోసం పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థ కొరియా ఫ్యూచర్ ప్రచురించిన నివేదికను అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రస్తావించింది. మతాచారాలను పాటించేవారిపైనా, మతపరమైన వస్తువులను కలిగియున్నవారిపైనా ఉత్తర కొరియా ప్రభుత్వం తీవ్రంగా దాడి చేస్తోందని తెలిపింది.
మతానికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడినా, మతపరమైన నమ్మకాలను ఒకరితో మరొకరు పంచుకున్నా అణచివేస్తోందని తెలిపింది. మతపరమైన విశ్వాసాలుగలవారిని అరెస్ట్ చేయడం, నిర్బంధించడం, బలవంతంగా పని చేయించడం, హింసించడం, న్యాయమైన విచారణ జరగకుండా నిరోధించడం, దేశం నుంచి వెళ్లగొట్టడం, జీవించే హక్కును నిరాకరించడం, లైంగిక హింసకు గురిచేయడం జరుగుతున్నట్లు తెలిపింది.
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…