కారణం ఏదైనా కావొచ్చు.. స్మోక్ చేసే అలవాటు ఉందా? అయితే.. కరోనా ముప్పు ఉన్నట్లేనని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ప్రపంచాన్ని గజగజ వణికేలా చేస్తున్న కరోనాకు స్మోక్ చేసే వారంటే చాలా ఇష్టమని చెబుతున్నారు.
మామూలు వారితో పోలిస్తే.. స్మోక్ చేసే అలవాటు ఉన్న వారికి కరోనా ముప్పు 14 రెట్లు అదనమని లెక్కలు చెబుతున్నారు. చైనాలో కరోనా సోకిన వేలాది మందికి పరిశోధనలు చేసిన నేపథ్యంలో.. దానికి సంబంధించిన అధ్యయన రిపోర్టులను తాజాగా హెల్త్ జనరల్స్ లో ప్రచురిస్తున్నారు.
స్మోక్ చేసే వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో కరోనా వ్యాప్తి చాలా త్వరగా ఉంటుందని చెబుతున్నారు. కరోనా సోకితే ఛాతీ.. ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ వస్తుందని చెబుతున్నారు. దీంతో.. శ్వాస తీసుకోవటంలో కష్టం కావటమే కాదు.. కరోనా ముప్పు ఎక్కువే అంటున్నారు. అందుకే.. ఇప్పడున్న పరిస్థితుల్లో స్మోక్ చేసే అలవాటు నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉందంటున్నారు.
స్మోక్ చేసే అలవాటుతో పాటు.. ఒకే సిగిరెట్ ను ఇద్దరు.. ముగ్గురు పంచుకునే అలవాటును తక్షణమే వదిలేయాలని చెబుతున్నారు. పొగాకు ఉత్పత్తులైన గుట్కా.. జర్దాలు తిని రోడ్ల మీద ఉమ్మివేసే ఘటనలు ఉత్తరాదిన ఎక్కువని.. కరోనా వేళ.. అలాంటి అలవాట్లను వెంటనే మానుకోవాలని చెబుతున్నారు. ఈ కారణం వల్లే అక్కడ కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. సో.. సిగిరెట్.. తాగే అలవాటు ఉంటే కేర్ ఫుల్ గా ఉండాల్సిందే.
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
సాధారణంగా ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లో మనుషులు కనిపించకుండా పోవడం గురించి మనం తరచుగా వింటూనే ఉంటాం. అయితే ఇటీవల…
పదుల సంఖ్యలో కార్లు, వందల సంఖ్యలో బైక్లు.. కాన్వాయ్ నడుస్తుండగా చుట్టూ జనాలు.. పార్టీ జెండాలు.. పూల వర్షాలు.. సందర్భం…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆ లడ్డూలో…
'ఏపీలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లాగా జగన్ "కల్తీ రిక్రూట్మెంట్ బోర్డు" అనే వ్యవస్థను స్థాపించారు. దానికి ఆయనే అధ్యక్షుడిగా…