భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప క్రికెటర్లలో ఒకడు ధోని. దేశంలో సచిన్ తర్వాత అత్యంత ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ కూడా అతనే. ధోని ఎలా ఆడతాడన్నది పక్కన పెట్టి కేవలం అతను మైదానంలో ఉంటే చాలు అనుకునే అభిమానులు కోట్లల్లో ఉంటారు. కేవలం అతడి ఉనికినే ఎంజాయ్ చేస్తారు తన అభిమానులు. ఐపీఎల్లో చెన్నై మ్యాచ్లు అనగానే స్టేడియాలు జనాలతో పోటెత్తుతాయి. ధోని రిటైరైతే క్రికెట్ చూడ్డం మానేస్తాం అనే వాళ్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. మరి ధోని ఎప్పుడు ఆట నుంచి పూర్తిగా తప్పుకుంటాడు అనే విషయంలో సస్పెన్స్ నడుస్తోంది.
నాలుగేళ్ల కిందటే అంతర్జాతీయ క్రికెట్కు దూరం అయిన ఈ లెజెండరీ క్రికెటర్.. ఐపీఎల్లో మాత్రం కొనసాగుతున్నాడు. ఫామ్ దెబ్బతిని, ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కోవడంతో రెండేళ్ల ముందే ఐపీఎల్కు టాటా చెప్పేస్తాడనుకున్నారు. కానీ మళ్లీ ఫిట్గా తయారై, ఆటను మెరుగుపరుచుకుని ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. పైగా చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్ ఆడుతూ రిటైరవ్వాలన్నది ధోని కోరిక. గత మూడేళ్లు కరోనా వల్ల చెన్నైలో ఐపీఎల్ జరగలేదు. ఈ ఏడాది జరిగింది కాబట్టి ఇదే ధోనికి చివరి ఐపీఎలేమో అనుకున్నారు.
కోల్కతాలో మ్యాచ్ సందర్భంగా పెద్ద ఎత్తున ధోని అభిమానులు హాజరవడంతో వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. తనకు వీడ్కోలు ఇవ్వడానికే వచ్చారేమో అని ధోని అనడంతో ఇదే అతడి చివరి ఐపీఎల్ అని అంతా ఒక అభిప్రాయానికి వచ్చేశారు. కానీ బుధవారం లక్నోతో చెన్నై మ్యాచ్లో మళ్లీ ట్విస్ట్ ఇచ్చాడు ధోని.
చివరి సీజన్ను ఎంజాయ్ చేస్తున్నారా అని వ్యాఖ్యాత డానీ మోరిసన్ అడిగితే.. ఇదే చివరిదని మీరు డిసైడ్ చేసేశారా అంటూ నవ్వేశాడు ధోని. దీనికి బదులుగా మోరిసన్.. ఐతే అలా ఏమీ కాదు, మళ్లీ వచ్చే ఏడాది వస్తున్నావన్నమాట.. అతను వచ్చే ఏడాది కూడా ఐపీఎల్కు వస్తున్నాడు అంటూ అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించాడు. ఐతే ధోని మనసులో ఏముందన్నది చెప్పలేం. ఇలా అన్నాడు కాబట్టి వచ్చే ఏడాది కూడా ఐపీఎల్కు వస్తాడా.. లేక సీజన్ చివర్లో సడెన్కు ఆటకు టాటా చెప్పేస్తాడా అన్నది చూడాలి.
This post was last modified on May 4, 2023 12:02 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…