దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే ఓ అద్భుతమైన ఆలోచన చేసింది. లాక్ డౌన్ కారణంగా రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దాంతో స్టేషన్లలో నిరూపయోగంగా పడి ఉన్న రైల్వే బోగీలను కరోనా బాధితుల కోసం ఐసోలేషన్ వార్డులుగా మార్చబోతున్నారు.
ఇందుకోసం ఇప్పటికే కావల్సిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య దాదాపు 900 దాకా ఉంది. శని, ఆది వారాల్లో ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని గణాంకాలను చూస్తుంటే అర్థమవుతోంది. దాంతో పెరుగుతున్న కరోనా బాధితుల చికిత్స కోసం బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మారుస్తున్నారు రైల్వే సిబ్బంది.
దీనికోసం ప్రతీ క్యాబిన్లో ఉండే అదనపు బెర్తులను తొలగించి, ఒకే బెర్తు ఉండేలా చేయడమే కాకుండా నిచ్చెనలు, తదితర అదనపు ఫిట్టింగ్లను తొలగిస్తున్నారు. ప్రత్యేక టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఒక్కో బోగీలో దాదాపు 20 మంది దాకా రోగులను పెట్టి, చికిత్స చేసే అవకాశం ఉంటుంది. భారతీయ రైల్వే చేసిన ఈ ఆలోచన బాగున్నప్పటికీ, దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే జాగ్రత్తలు తీసుకుంటే ఇళ్లల్లోనే ఉంటే, భయపడాల్సిన అవసరం లేదంటున్నారు అధికారులు.
పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు…
నిన్న సాయంత్రం అనిల్ రావిపూడి కొత్త సినిమా అనౌన్స్ మెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎవరూ ఊహించని విధంగా వెంకటేష్, కళ్యాణ్…
పదిమందిని మెప్పించగల మాట నేర్పు ఉందా? సామాజిక మాధ్యమాల్లో ప్రజలను ఆకర్షించగల నైపుణ్యం ఉందా? అయితే.. రాజకీయాలన్నీ మీవే!. త్వరలోనే..…
“జస్ట్ అలా పడిపోతేనే రెండు చోట్ల ఎముకలు విరిగాయి. నిజంగా కస్టడీలో ఎవరైనా కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి?…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం నగరిలో ఏం జరుగుతోంది? నాయకులు ఏం చేస్తున్నారు? అంటే.. అంతా ప్రస్తుతం సైలెంట్గానే…
కొందరు నాయకులు తాము ఎదుగుతూ.. తోటి వారిని ఎదిగేలా సహకరిస్తారు. ఇది ఎక్కడైనా ఉంటుంది. అయితే.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో…