దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే ఓ అద్భుతమైన ఆలోచన చేసింది. లాక్ డౌన్ కారణంగా రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దాంతో స్టేషన్లలో నిరూపయోగంగా పడి ఉన్న రైల్వే బోగీలను కరోనా బాధితుల కోసం ఐసోలేషన్ వార్డులుగా మార్చబోతున్నారు.
ఇందుకోసం ఇప్పటికే కావల్సిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య దాదాపు 900 దాకా ఉంది. శని, ఆది వారాల్లో ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని గణాంకాలను చూస్తుంటే అర్థమవుతోంది. దాంతో పెరుగుతున్న కరోనా బాధితుల చికిత్స కోసం బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మారుస్తున్నారు రైల్వే సిబ్బంది.
దీనికోసం ప్రతీ క్యాబిన్లో ఉండే అదనపు బెర్తులను తొలగించి, ఒకే బెర్తు ఉండేలా చేయడమే కాకుండా నిచ్చెనలు, తదితర అదనపు ఫిట్టింగ్లను తొలగిస్తున్నారు. ప్రత్యేక టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఒక్కో బోగీలో దాదాపు 20 మంది దాకా రోగులను పెట్టి, చికిత్స చేసే అవకాశం ఉంటుంది. భారతీయ రైల్వే చేసిన ఈ ఆలోచన బాగున్నప్పటికీ, దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే జాగ్రత్తలు తీసుకుంటే ఇళ్లల్లోనే ఉంటే, భయపడాల్సిన అవసరం లేదంటున్నారు అధికారులు.
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…
వాయిదాల మీద వాయిదాలతో అభిమానుల అసహనానికి గురైన వా వాతియర్ (అన్నగారు వస్తారు) ఎట్టకేలకు విడుదలకు రెడీ అయ్యింది. జనవరి…