ఎండాకాలంలో అనూహ్యంగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ తడిసి ముద్దయింది. శుక్రవారంరాత్రి కురిసిన భారీ వర్షాలకు.. లోతట్టు ప్రాంతాలు మోకాల్లోతు నీటిలో మునిగిపోయాయి. ఈ క్రమంలో సికింద్రాబాద్ కళాసిగూడలో మ్యాన్హోల్ మూత తెరిచి ఉండడంతో మౌనిక అనే ఓ చిన్నారి డ్రైనేజీలో పడి మృతి చెందింది. ఈ రోజు ఉదయం చిన్నారి పాల ప్యాకెట్ కోసం బయటికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన డీఆర్ఎఫ్ సిబ్బంది చిన్నారి కోసం గాలించగా… పార్క్ లైన్ వద్ద పాప మృతదేహాన్ని గుర్తించారు.
మృతిచెందిన చిన్నారి స్థానిక స్కూల్లో 4వ తరగతి చదువుతోంది. చిన్నారి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. చిన్నారి మౌనిక నాలాలో పడి మృతి చెందిన స్థలంలో బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. జీహెచ్ఎం సీ అధికారుల నిర్లక్ష్యంపై బీజేపీ నేతలు మండిపడగా, బీజేపీ కార్పొరేటర్పై బీఆర్ఎస్ కార్యకర్తలు ఎదురుదాడి చేశారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. సంఘటనా స్థలానికి చేరుకున్న బీజేపీ కార్పొరేటర్ సుచిత్రను స్థానికులు నిలదీశారు. మ్యాన్హోల్స్ తెరిచి ఉన్నా పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు.
గద్వాల్ విజయలక్ష్మీ రియాక్షన్ ఇదే..
చిన్నారిమౌనిక మృతి చెందిన ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సందర్శించారు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. నాలా హోల్పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో కాషన్ బోర్డులు ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ అందరిముందు మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పనులు జరుగుతున్న సందర్భంలో అధికారులు ఇచ్చే ఆదేశాలను ఎవరు అతిక్రమించవద్దని అన్నారు.
జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన భారీ కేడింగ్ తొలగిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మృతి చెందిన మౌనిక కుటుంబాన్ని పరామర్శించారు. పాప కుటుంబాన్ని జీహెచ్ఎంసీ వైపు నుంచి ఆదుకుంటామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హామీ ఇచ్చారు. అయితే.. మీడియాతో మాట్లాడిన విజయలక్ష్మి.. రాత్రివేళల్లో రోడ్లపై నీరు నిలబడకుండా ఉండేందుకు స్థానికులే.. మ్యాన్ హోల్స్పై మూతలు తీసేస్తున్నారని…. గతంలోనూ తాము ఈ విషయంపై హెచ్చరించామని.. అయినా.. ఎవరూ పట్టించుకోలేదని.. అందుకే ఇలాంటి ఘటన చోటు చేసుకుందని స్థానికులపై నెపం నెట్టేసే ప్రయత్నం చేయడం గమనార్హం.
This post was last modified on April 29, 2023 4:38 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…