Trends

హైద‌రాబాద్ నాలాలో ప‌డి చిన్నారి మృతి.

ఎండాకాలంలో అనూహ్యంగా కురుస్తున్న వ‌ర్షాల‌తో హైద‌రాబాద్ త‌డిసి ముద్ద‌యింది. శుక్ర‌వారంరాత్రి కురిసిన భారీ వ‌ర్షాల‌కు.. లోత‌ట్టు ప్రాంతాలు మోకాల్లోతు నీటిలో మునిగిపోయాయి. ఈ క్ర‌మంలో సికింద్రాబాద్‌ కళాసిగూడలో మ్యాన్‌హోల్ మూత తెరిచి ఉండడంతో మౌనిక అనే ఓ చిన్నారి డ్రైనేజీలో పడి మృతి చెందింది. ఈ రోజు ఉదయం చిన్నారి పాల ప్యాకెట్ కోసం బయటికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన డీఆర్‌ఎఫ్ సిబ్బంది చిన్నారి కోసం గాలించగా… పార్క్ లైన్ వద్ద పాప మృతదేహాన్ని గుర్తించారు.

మృతిచెందిన చిన్నారి స్థానిక స్కూల్లో 4వ తరగతి చదువుతోంది. చిన్నారి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. చిన్నారి మౌనిక నాలాలో పడి మృతి చెందిన స్థలంలో బీఆర్‌ఎస్, బీజేపీ నాయకుల మ‌ధ్య తీవ్ర వివాదం చెల‌రేగింది. జీహెచ్‌ఎం సీ అధికారుల నిర్లక్ష్యంపై బీజేపీ నేతలు మండిపడగా, బీజేపీ కార్పొరేటర్‌పై బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఎదురుదాడి చేశారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. సంఘటనా స్థలానికి చేరుకున్న బీజేపీ కార్పొరేటర్ సుచిత్రను స్థానికులు నిలదీశారు. మ్యాన్‌హోల్స్ తెరిచి ఉన్నా పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు.

గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మీ రియాక్ష‌న్ ఇదే..

చిన్నారిమౌనిక మృతి చెందిన ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సందర్శించారు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. నాలా హోల్‌పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో కాషన్ బోర్డులు ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ అందరిముందు మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పనులు జరుగుతున్న సందర్భంలో అధికారులు ఇచ్చే ఆదేశాలను ఎవరు అతిక్రమించవద్దని అన్నారు.

జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన భారీ కేడింగ్ తొలగిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మృతి చెందిన మౌనిక కుటుంబాన్ని పరామర్శించారు. పాప కుటుంబాన్ని జీహెచ్ఎంసీ వైపు నుంచి ఆదుకుంటామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హామీ ఇచ్చారు. అయితే.. మీడియాతో మాట్లాడిన విజ‌య‌ల‌క్ష్మి.. రాత్రివేళ‌ల్లో రోడ్ల‌పై నీరు నిల‌బ‌డ‌కుండా ఉండేందుకు స్థానికులే.. మ్యాన్ హోల్స్‌పై మూతలు తీసేస్తున్నార‌ని…. గ‌తంలోనూ తాము ఈ విష‌యంపై హెచ్చ‌రించామ‌ని.. అయినా.. ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని.. అందుకే ఇలాంటి ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని స్థానికుల‌పై నెపం నెట్టేసే ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on April 29, 2023 4:38 pm

Share

Recent Posts

బాలయ్యకు త్వరలోనే పుత్రికోత్సాహం?

స్టార్ హీరోల వారసులు ఇండస్ట్రీలో అడుగు పెట్టడం సర్వసాధారణం. దక్షిణాదిలో అత్యధిక శాతం దీన్ని కొడుకులకే పరిమితం చేస్తూ ఉంటారు.…

9 minutes ago

సాయిపల్లవిని కావాలనే టార్గెట్ చేస్తున్నారా

నిన్న విడుదలైన రామాయణ నాలుగు నిమిషాల ట్రైలర్ సోషల్ మీడియాలో పెద్ద చిచ్చే పెట్టింది. ఒకవైపు ఆదిపురుష్ పోలికలను తీసుకొచ్చి…

3 hours ago

జూలై నెలాఖరు… జోష్ ఎలా ఉంది గురు

జూలై అయిపోయింది. వేసవిలో ఎండల బాలన్స్ ఏదైనా ఉందంటే ఈ నెలతో సమాప్తం అయినట్టే. ఆల్రెడీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను…

3 hours ago

మళ్ళీ పేపర్ లీక్ అయిందా సారూ…

పేపర్ లీకేజి భూతం ఒదిలిపెట్టేలా కనిపించడం లేదు.  కేంద్ర విద్యా శాఖ మంత్రిని పదవిని బలిగొన్నా అక్రమార్కులు వెనకంజ వేయడం…

3 hours ago

ఇకపై వందేమాతరం పాడేటప్పుడు ఇవి చెయ్యకూడదు

నిత్యం పాఠ‌శాలల్లోనూ.. జాతీయ పండుగ‌ల దినాల్లోనూ అంద‌రూ క‌ల‌సి పాడుకునే జాతీయ గేయం వందేమాతరం ఇక‌, చ‌ట్ట‌బ‌ద్ధం కానుంది. దీనికి…

4 hours ago

ప‌రామ‌ర్శ‌ల‌తో `పోయేది` చాలానే ఉంది… జ‌గ‌న్‌.. !

ప‌రామ‌ర్శ‌లు చేయ‌డం త‌ప్పుకాదు. పార్టీని కాపాడుకోవ‌డ‌మూ త‌ప్పుకాదు. కానీ, ఎవ‌రిని పరామ‌ర్శించాలన్న విష‌యంలోనే పార్టీలు విజ్ఞ‌త‌తో ముందుకు సాగాలి. ఈ…

4 hours ago