ఎండాకాలంలో అనూహ్యంగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ తడిసి ముద్దయింది. శుక్రవారంరాత్రి కురిసిన భారీ వర్షాలకు.. లోతట్టు ప్రాంతాలు మోకాల్లోతు నీటిలో మునిగిపోయాయి. ఈ క్రమంలో సికింద్రాబాద్ కళాసిగూడలో మ్యాన్హోల్ మూత తెరిచి ఉండడంతో మౌనిక అనే ఓ చిన్నారి డ్రైనేజీలో పడి మృతి చెందింది. ఈ రోజు ఉదయం చిన్నారి పాల ప్యాకెట్ కోసం బయటికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన డీఆర్ఎఫ్ సిబ్బంది చిన్నారి కోసం గాలించగా… పార్క్ లైన్ వద్ద పాప మృతదేహాన్ని గుర్తించారు.
మృతిచెందిన చిన్నారి స్థానిక స్కూల్లో 4వ తరగతి చదువుతోంది. చిన్నారి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. చిన్నారి మౌనిక నాలాలో పడి మృతి చెందిన స్థలంలో బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. జీహెచ్ఎం సీ అధికారుల నిర్లక్ష్యంపై బీజేపీ నేతలు మండిపడగా, బీజేపీ కార్పొరేటర్పై బీఆర్ఎస్ కార్యకర్తలు ఎదురుదాడి చేశారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. సంఘటనా స్థలానికి చేరుకున్న బీజేపీ కార్పొరేటర్ సుచిత్రను స్థానికులు నిలదీశారు. మ్యాన్హోల్స్ తెరిచి ఉన్నా పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు.
గద్వాల్ విజయలక్ష్మీ రియాక్షన్ ఇదే..
చిన్నారిమౌనిక మృతి చెందిన ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సందర్శించారు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. నాలా హోల్పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో కాషన్ బోర్డులు ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ అందరిముందు మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పనులు జరుగుతున్న సందర్భంలో అధికారులు ఇచ్చే ఆదేశాలను ఎవరు అతిక్రమించవద్దని అన్నారు.
జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన భారీ కేడింగ్ తొలగిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మృతి చెందిన మౌనిక కుటుంబాన్ని పరామర్శించారు. పాప కుటుంబాన్ని జీహెచ్ఎంసీ వైపు నుంచి ఆదుకుంటామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హామీ ఇచ్చారు. అయితే.. మీడియాతో మాట్లాడిన విజయలక్ష్మి.. రాత్రివేళల్లో రోడ్లపై నీరు నిలబడకుండా ఉండేందుకు స్థానికులే.. మ్యాన్ హోల్స్పై మూతలు తీసేస్తున్నారని…. గతంలోనూ తాము ఈ విషయంపై హెచ్చరించామని.. అయినా.. ఎవరూ పట్టించుకోలేదని.. అందుకే ఇలాంటి ఘటన చోటు చేసుకుందని స్థానికులపై నెపం నెట్టేసే ప్రయత్నం చేయడం గమనార్హం.
This post was last modified on April 29, 2023 4:38 pm
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…