Trends

ధోని చెప్పకనే చెప్పేశాడు

క్రికెటర్లకు 40 ఏళ్లు వచ్చాయంటే ఆటలో కొనసాగడం చాలా కష్టం. ఆ వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన వాళ్లు చాలా తక్కువ మంది. టీ20 లీగ్‌ల్లో సైతం 40 మార్కు దాటాక కొనసాగడం కష్టమే అవుతుంది. ఎంతటి మహామహులైన ఆటగాళ్లయినా సరే.. ఆ వయసు వచ్చేసరికి ఫిట్‌నెస్, ఫామ్ సమస్యలు ఎదుర్కొంటారు. కొందరు తమ పని అయిపోయిందని గుర్తించి స్వచ్ఛందంగా తప్పుకుంటే.. ఇంకొందరు అవకాశాలు ఆగిపోవడంతో ఇక తప్పక రిటైర్మెంట్ తీసుకుంటారు.

ఐతే మహేంద్ర సింగ్ ధోని మాత్రం 42వ పడికి చేరువ అవుతూ కూడా ఇంకా ఇంకా ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. నాలుగేళ్ల ముందే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ధోని.. ఐపీఎల్‌లో కూడా ఒకట్రెండు సీజన్లకు మించి కొనసాగడని అనుకున్నారు. కానీ ఇంకా అతను ఐపీఎల్‌లో ఉన్నాడు. అతడి ఆట మీద ఎవరికీ ఫిర్యాదుల్లేవు. ఇక క్రేజ్ సంగతైతే చెప్పాల్సిన పనే లేదు. ధోని కనిపిస్తే చాలు స్టేడియాలు హోరెత్తిపోతున్నాయి.

చెన్నై యాజమాన్యం అయితే.. ధోని బ్యాటింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు, కీపింగ్ చేస్తూ తన కెప్టెన్సీతో జట్టును నడిపిస్తే చాలు ఎన్నేళ్లయినా అతణ్ని కొనసాగిస్తాం అన్నట్లు ఉంది. కానీ ధోని మాత్రం ఈ సీజన్ తర్వాత ఆటకు గుడ్ బై చెప్పేయబోతున్నట్లే కనిపిస్తోంది. ఈ సీజన్లో ధోని బ్యాటింగ్ చేసింది తక్కువ సందర్భాల్లో, అది కూడా తక్కువ బంతులే ఎదుర్కొన్నాడు. కానీ ఉన్నంతలో బాగానే ఆడాడు. ఇక వికెట్ కీపింగ్ అయితే చెప్పాల్సిన పని లేదు. కుర్రాళ్లు కూడా అసూయ చెందే చురుకుదనం చూపిస్తున్నాడు.

చెన్నై మ్యాచ్ ఎక్కడ జరిగినా అభిమానులు ధోనీని చూడటానికే స్టేడియాలకు పోటెత్తుతున్నారు. ఆదివారం కోల్‌కతాతో చెన్నై మ్యాచ్‌కు కూడా స్టేడియం నిండిపోయింది. ధోనీ నామస్మరణతో ఈడెన్ గార్డెన్స్ హోరెత్తిపోయింది. ఐతే మ్యాచ్ ప్రెజెంటేషన్ సందర్భంగా ధోని మాట్లాడుతూ.. అభిమానుల స్పందన గురించి మాట్లాడుతూ.. వాళ్లు తనకు వీడ్కోలు పలకడానికి వచ్చారు అనడం చర్చనీయాంశం అయింది. ఇది అభిమానులకు పెద్ద షాకే. తాను ఈ సీజన్ తర్వాత రిటైర్ కాబోతున్నట్లు ధోని చెప్పకనే చెప్పేశాడని భావిస్తున్నారు.

This post was last modified on April 24, 2023 5:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేమలు బ్యూటీకి సీనియర్ స్టార్ల ఛాన్సులు

గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…

2 hours ago

సునీతా విలియమ్స్ భారత పర్యటన.. ఎప్పుడంటే?

అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్‌కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…

3 hours ago

IPL 2025: 13 ఏళ్ల కుర్రాడి ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు?

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో అడుగుపెడుతున్న…

3 hours ago

DSP విలువ తెలిసినట్టు ఉందే

సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…

4 hours ago

ఆదివారం రిలీజ్ ఎందుకు భాయ్

సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…

5 hours ago

క్షేమంగా తిరిగొచ్చిన సునీత… అమెరికా, భారత్ లో సంబరాలు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…

5 hours ago