ఎట్టకేలకు ఇండియన్ ప్రిమియర్ లీగ్ 2020 సీజన్పై పూర్తి స్పష్టత వచ్చేసింది. దేశంలో కొన్ని నెలలుగా కరోనా విలయ తాండవం చేస్తుండటం.. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగు పడేలా లేకపోవడంతో ఈ ఏడాదికి ఐపీఎల్ను నిర్వహించే అవకాశం లేదని తేలిపోగా.. యూఏఈ వేదికగా లీగ్ను నిర్వహించడానికి బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
అయితే ఇందుకు భారత ప్రభుత్వం అనుమతి కోసం బోర్డు ఎదురు చూస్తూ ఉంది. వారి ఎదురు చూపులు ఫలించాయి. ఆదివారం లీగ్ నిర్వహణపై ఐపీఎల్ పాలకమండలి సమావేశం అయిన రోజే ప్రభుత్వం యూఏఈలో లీగ్ నిర్వహణకు పచ్చజెండా ఊపడం విశేషం. ఈ తీపి కబురు అందుకున్న ఐపీఎల్ పాలకమండలి ఉత్సాహంగా ఐపీఎల్ ఆరంభ, ముగింపు డేట్లు, ఇతర విశేషాలు వెల్లడించింది.
సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వ తేదీ వరకూ ఐపీఎల్ నిర్వహించనున్నారు. దుబాయ్, అబుదాబి, షార్జా… ఈ మూడు వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించారు. ఎప్పుడూ ఐపీఎల్ మ్యాచ్లు సాయంత్రం పూట అయితే 4 గంటలకు రాత్రి పూట అయితే 8 గంటలకు ఆరంభమవుతాయి కానీ.. ఈసారి యూఏఈలో మాత్రం ప్రతి మ్యాచ్ రాత్రి ఏడున్నరకే ఆరంభమవుతుంది.
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ను సోమవారం వెల్లడించనున్నారు. ఐపీఎల్ విదేశీ గడ్డపై జరగడం ఇదే తొలిసారి కాదు. దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా రెండుసార్లు.. 2009లో పూర్తిగా దక్షిణాఫ్రికాలో, 2014లో మరోసారి పాక్షికంగా యూఏఈలో ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. కరోనా ముప్పు నేపథ్యంలో యూఏఈలో కూడా ఇంగ్లాండ్-వెస్టిండీస్ టెస్టు సిరీస్ తరహాలోనే బయో సెక్యూర్ వాతావరణంలో ఐపీఎల్ను నిర్వహించబోతున్నారు.
ఇప్పుడు వరల్డ్ నంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అంటే మరో మాట లేకుండా క్రిస్టోఫర్ నోలన్ పేరు చెప్పేస్తారు ఆడియన్స్.…
అనుకున్నట్టే ఫౌజీ విడుదల తేదీ డిసెంబర్ 3 లాకైపోయింది. ఇది రెండు వారాల క్రితమే లీకైన న్యూస్ అయినప్పటికీ ఫైనల్…
ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ కున్న క్రేజ్ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో లేదన్న మాటే కానీ పదిహేను సంవత్సరాల క్రితం ప్రసాద్ మల్టీప్లెక్స్…
భారతదేశానికి గర్వకారణమైన ఇస్రో లో ఇప్పుడు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు వరుసగా తమ ఉద్యోగాలకు…
గత శుక్రవారం ఒక మోస్తరు అంచనాల మధ్య విడుదలైన అక్కినేని అఖిల్ సినిమా ‘లెనిన్’ తొలి వీకెండ్లో ఆ అంచనాలను…
క్రికెట్ ప్రపంచంలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఐసీసీ 2027…