Trends

ఐపీఎల్‌కు కేంద్రం రైట్ రైట్‌.. డేట్లు వ‌చ్చేశాయ్

ఎట్ట‌కేల‌కు ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ 2020 సీజ‌న్‌పై పూర్తి స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. దేశంలో కొన్ని నెల‌లుగా క‌రోనా విల‌య తాండవం చేస్తుండ‌టం.. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు మెరుగు ప‌డేలా లేక‌పోవ‌డంతో ఈ ఏడాదికి ఐపీఎల్‌ను నిర్వ‌హించే అవ‌కాశం లేద‌ని తేలిపోగా.. యూఏఈ వేదిక‌గా లీగ్‌ను నిర్వ‌హించ‌డానికి బీసీసీఐ నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఇందుకు భార‌త ప్ర‌భుత్వం అనుమ‌తి కోసం బోర్డు ఎదురు చూస్తూ ఉంది. వారి ఎదురు చూపులు ఫలించాయి. ఆదివారం లీగ్ నిర్వ‌హ‌ణ‌పై ఐపీఎల్ పాల‌క‌మండ‌లి స‌మావేశం అయిన రోజే ప్ర‌భుత్వం యూఏఈలో లీగ్ నిర్వ‌హ‌ణ‌కు ప‌చ్చజెండా ఊప‌డం విశేషం. ఈ తీపి క‌బురు అందుకున్న ఐపీఎల్ పాల‌క‌మండ‌లి ఉత్సాహంగా ఐపీఎల్ ఆరంభ‌, ముగింపు డేట్లు, ఇత‌ర విశేషాలు వెల్ల‌డించింది.

సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10వ తేదీ వరకూ ఐపీఎల్‌ నిర్వహించ‌నున్నారు. దుబాయ్‌, అబుదాబి, షార్జా… ఈ మూడు వేదిక‌ల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వ‌హించారు. ఎప్పుడూ ఐపీఎల్ మ్యాచ్‌లు సాయంత్రం పూట అయితే 4 గంట‌ల‌కు రాత్రి పూట అయితే 8 గంట‌ల‌కు ఆరంభ‌మ‌వుతాయి కానీ.. ఈసారి యూఏఈలో మాత్రం ప్ర‌తి మ్యాచ్ రాత్రి ఏడున్న‌ర‌కే ఆరంభ‌మ‌వుతుంది.

ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను సోమ‌‌వారం వెల్ల‌డించ‌నున్నారు. ఐపీఎల్‌ విదేశీ గడ్డపై జరగడం ఇదే తొలిసారి కాదు. దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా రెండుసార్లు.. 2009లో పూర్తిగా దక్షిణాఫ్రికాలో, 2014లో మరోసారి పాక్షికంగా యూఏఈలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జ‌రిగాయి. క‌రోనా ముప్పు నేప‌థ్యంలో యూఏఈలో కూడా ఇంగ్లాండ్-వెస్టిండీస్ టెస్టు సిరీస్ త‌ర‌హాలోనే బ‌యో సెక్యూర్ వాతావ‌ర‌ణంలో ఐపీఎల్‌ను నిర్వ‌హించ‌బోతున్నారు.

This post was last modified on August 3, 2020 8:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వర్మ శారీ…..ఆడియన్స్ సారీ

ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే తెలుగులోనే కాదు హిందీలోనూ పెద్ద బ్రాండ్. శివ నుంచి సర్కార్ దాకా ఎన్నో…

4 hours ago

ట్రోలింగ్‌పై స్పందించిన మోహన్ బాబు

టాలీవుడ్లో విపరీతంగా సోషల్ మీడియా ట్రోలింగ్ ఎదుర్కొనే ఫ్యామిలీ ఏదంటే.. మంచు వారి వైపే చూపిస్తారు ఎవరైనా. తమ మీద…

7 hours ago

విమర్శల సుడిలో మీనాక్షి… ఏం జరిగింది?

మీనాక్షి నటరాజన్… .పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా. నిజమే… ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీగా బాధ్యతలు…

8 hours ago

పీ-4కు స్పంద‌న‌.. 10 కోట్లు విరాళం

సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మం పీ-4(ప‌బ్లిక్‌-ప్రైవేటు-పీపుల్స్‌-పార్ట‌న‌ర్‌షిప్‌)కు ఉన్న‌త స్థాయి వ‌ర్గాల నుంచి స్పంద‌న వ‌స్తోంది. స‌మాజంలోని పేద‌ల‌ను ఆదుకుని..…

8 hours ago

పిఠాప‌రంలో రాజకీయాల కోసం రాలేదట

జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ నాగ‌బాబు రెండో రోజు శ‌నివారం కూడా.. పిఠాపురంలో ప‌ర్య‌టించారు. శుక్ర‌వారం పిఠాపురానికి వెళ్లిన ఆయ‌న‌..…

8 hours ago

ఏపీ vs తెలంగాణ‌.. ముదురుతున్న నీటి యుద్ధం!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య నీటి యుద్ధం ముదురుతోంది. వేస‌వి కాలం ప్రారంభం అయిన నేప‌థ్యంలో సాగు, తాగు నీటి…

9 hours ago