ఘోరాతి ఘోరమైన ఉదంతం అగ్రరాజ్యమైన అమెరికాలో చోటు చేసుకుంది. ఒక డెయిరీ లో చోటు చేసుకున్న భారీ పేలుడుకు వేలాది గోవులు మృత్యువాత పడ్డాయి. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డిమ్మిట్ లో ఉన్న సౌత్ ఫోర్క్ డెయిరీ ఫాంలో భారీ పేలుడు చోటు చేసుకుంది.
ఈ ఉదంతంలో 18వేల ఆవులు ఒకేసారి మృత్యువాత పడిన అసాధారణ ఉదంతం చోటు చేసుకుంది. ప్రాణాలు కోల్పోయిన ఆవుల విలువ 36 మిలియన్ డాలర్లు (మన రూపాయిల్లో రూ.294 కోట్లు) ఉంటుందని చెబుతున్నారు.
దాదాపు పదేళ్ల తర్వాత ఇంత భారీ ప్రమాదం ఒక డెయిరీ ఫారంలో చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. 2013లో ఇలాంటిదే ఒకటి చోటు చేసుకుందని.. ఆ తర్వాత ఇదేనని చెబుతున్నారు. ఇంతకీ ఈ భారీ పేలుడు వెనుక కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు అధికారులు బదులిస్తూ.. డెయిరీ ఫారంలోని యంత్రాలు బాగా వేడెక్కిపోవటంతోనే పేలుడు సంభవించినట్లుగా భావిస్తున్నారు. పేలుడు వేళ.. మిథేన్ అధిక మొత్తంలో విడుదలైందని.. దీంతో ఆవులు భారీ ఎత్తున మృత్యువాత పడ్డాయని చెబుతున్నారు.
డెయిరీ ఫారాల్లో మిథేన్ వాయువు అధికంగా వెలువడుతుందని.. పేడ ఎక్కువగా నిల్వ ఉండటం ద్వారా ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అయితే.. ఇంత భారీ పేలుడు వెనుక అసలు కారణం ఏమిటన్న విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉందంటున్నారు. మరి.. ఇంత భారీ పేలుడు జరిగిన వేళలో.. ప్రాణ నష్టం లేదా? అంటే.. లేదనే చెబుతున్నారు. కారణం.. అమెరికా లాంటి దేశాల్లో భారీ ఎత్తున యంత్రాల సాయంతో డెయిరీలను నిర్వహిస్తూ ఉంటారని చెబుతున్నారు.
సాధారణంగా 15వేల కంటే ఎక్కువగా గోవులను పెంచే డెయిరీ ఫాంను బార్ గా వ్యవహరిస్తారని.. ఇలాంటి చోట్ల అన్ని పనులను యంత్రాలతో చేయిస్తారని చెబుతున్నారు. ఏదైనా సమస్య ఏర్పడితే.. వాటిని సరిదిద్దేందుకు నామ మాత్రంగా సిబ్బంది ఉంటారని తెలుస్తోంది. ఈ కారణంగానే ఇంత భారీ పేలుడు చోటు చేసుకున్నా ప్రాణ నష్టం లేకపోవటానికి కారణంగా అభిప్రాయపడుతున్నారు.
పేలుడు ఒక్కసారిగా చోటు చేసుకోవటం.. మంటలు పెద్ద ఎత్తున ఏర్పడటంతో వాటిని అదుపు చేయటం కుదర్లేదని చెబుతున్నారు. మూగజీవాలు వేలాదిగా మరణించటం విషాదమే అయినా.. ఇంత భారీ పేలుడుకు ప్రాణ నష్టం లేకపోవటం ఊరట కలిగించే అంశంగా చెబుతున్నారు. అయితే.. పాలను భద్రపరిచే గదిలో ఒక మహిళ చిక్కుకుపోయిందని.. ఆమె గాయాలతో బయటపడినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ఈ భారీ పేలుడు వెనుక ఏం జరిగిందన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది.
This post was last modified on April 14, 2023 10:36 am
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…