Trends

ల‌వ‌ర్‌ను కెన‌డా నుంచి పిలిచి చంపేశాడు..

ప్రేమ‌ల పేరుతో జ‌రుగుతున్న దారుణాలు ఎక్క‌డా ఆగ‌డం లేదు. దేశంలో ఢిల్లీలో చోటు చేసుకున్న 36 ముక్క‌ల ఉదంతం మ‌రిచిపోక ముందే.. మ‌రో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిని కెనడా నుంచి పిలిచి మరీ హత్య చేశాడో వ్యక్తి. అనంతరం ప్రియురాలి మృతదేహాన్ని తన ఫామ్హౌస్లో పాతిపెట్టాడు. దాదాపు ఏడాది తర్వాత ఈ విష‌యం వెలుగులోకి వచ్చింది.

బాధితురాలు మోనిక(23) రోహ్తక్ ప్రాంతంలోని బాలంద్ గ్రామానికి చెందిన యువతి. ఐఇఎల్‌టీఎస్ కోర్సు చేయడానికి సోనిపత్ ప్రాంతంలోని గుమాడ్ గ్రామంలోని తన అత్త ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో అదే గ్రామంలో ఉండే సునీల్ అనే వ్యక్తితో మోనికకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అయితే.. ఇదివరకే సునీల్కు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయం మోనికకు కూడా తెలుసు.

ఇంతలో పై చదువుల కోసం మోనిక.. కెనడా వెళ్లింది. కొన్ని రోజులు గడిచాక.. సునీల్ మోనికకు ఫోన్ చేసి ఇండియా రావాల్సిందిగా కోరాడు. దీంతో మోనిక ఇండియా వచ్చింది. అనంతరం ఇద్దరూ 2022 మేలో గాజియాబాద్లోని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ వివాహాన్ని రిజిస్టర్ కూడా చేయించారు. అనంతరం ఓ రోజు మోనికను తన ఫామ్హౌస్కు తీసుకెళ్లాడు సునీల్. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన సునీల్.. మోనికను కాల్చి చంపాడు.

అనంతరం మోనిక మృతదేహాన్ని.. ఇదివరకే వాటర్ ట్యాంక్ కోసం అని తవ్వించిన ఓ 10 అడుగుల గోతిలో పాతిపెట్టాడు. అయితే, మోనిక.. 2022 జనవరి నుంచి మే వరకు రెండు సార్లు ఇండియా వచ్చిందని పోలీ సుల విచారణలో వెల్లడైంది. మోనిక కెనడా నుంచి తిరిగి వచ్చిన విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలియదని పేర్కొన్నారు. ఏప్రిల్ 2న నిందితుడు సునీల్ను అరెస్టు చేశారు.

కార‌ణ‌మేంటి?

సునీల్కు తన భార్యతో ఉండటం ఇష్టం లేదు. ఎప్పుడూ విదేశాల్లో సెటిల్ కావాలని కలలు కనేవాడు. ఈ క్రమంలో మోనిక కెనడాలో పీఆర్(పర్మనెంట్ రెసిడెన్సీ) పొందితే శాశ్వతంగా అక్కడే ఉండచ్చని ఆశపడ్డా డు. అయితే, త‌న‌కు భార‌త్ అంటే నే ఇష్ట‌మ‌ని.. ఇక్క‌డే కాపురం పెడ‌దామ‌ని మోనిక ఘ‌ర్ష‌ణ‌కు దిగింది. దీంతో అతడి ప్లాన్ వర్కవుట్ కాదని గ్రహించి మోనికను మర్డర్ చేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడి ఫామ్హౌస్ నుంచి మృతదేహం అవశేషాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నాచారు.

This post was last modified on April 6, 2023 11:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అతడు స్టామినాని వృథా చేస్తున్నారు

ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…

2 hours ago

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

5 hours ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

5 hours ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

7 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

7 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

7 hours ago