భారత క్రికెట్ జట్టులో పడిలేచిన కిరణం.. టీమ్ఇండియా మాజీ ఓపెనర్ సుధీర్ నాయక్. ఏమీ లేని స్థాయి నుంచి క్రికెట్ బ్యాట్ కూడా కొనలేని పరిస్థితి నుంచి టీమ్ ఇండి ఓపెనర్గా ఎదిగిన నాయక్.. భారత క్రికెట్ కీర్తి కిరీటంలో ఒక కలికితురాయి. అయితే.. ఆయనకు రావాల్సిన గుర్తింపు.. దక్కాల్సిన మర్యాదులు దక్కలేదు. దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే.. 78 ఏళ్ల వయసులో నాయక్ తుదిశ్వాస విడిచారు.
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని ఆస్పత్రిలో కన్నుమూశారు. తన కుమార్తె దగ్గరే ఉంటున్న నాయక్ ఇటీవల బాత్రూంలో జారిపడ్డారు. తలకు గాయం కావడం వల్ల కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. కోమాలోకి వెళ్లిన నాయక్ మళ్లీ కోలుకోలేదు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్న ఆయన తాజాగా కన్ను మూశారు.
కెరీర్లో.. మలుపులు!
నాయక్.. 1970-71 రంజీ ట్రోఫీ సీజన్లో బ్లూరీ బ్యాండ్ గ్లోరీ టీమ్కు నాయకత్వం వహించాడు. అప్పుడు జట్టును గెలిపించి.. ట్రోఫీని ముద్దాడాడు.. సునీల్ గావస్కర్, అజిత్ వాడేకర్, దిలీప్ సార్దేశాయ్, అశోక్ మన్కడ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు జట్టులో లేకుండానే ఆయన తన టీమ్ను గెలిపించారు.
1974లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లారు. బర్మింగ్ హమ్ వేదికగా జరిగిన టెస్టుతో అరంగేట్రం చేశారు. రెండో ఇన్నింగ్స్లో 77 పరుగులు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నారు. 1974లో భారత్ తరఫున మూడు టెస్టు మ్యాచ్లు ఆడారు. 85 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడారు. దాదాపు 4376 పరుగులు చేశారు.
బ్యాటింగ్లో దూకుడుగా ఉండే నాయక్.. ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో ఏడు సెంచరీలు బాదారు. ఓ ద్విశతకం కూడా కొట్టారు. అలా తన ఆటతో క్రికెట్ అభిమానులతో పాటు సహ ఆటగాళ్లను ఆకట్టుకున్నారు. వారి ప్రశంసలను పొందారు.
రెండో ఇన్నింగ్స్లో మంచి కోచ్గానూ గుర్తింపు సాధించారు. క్రికెటర్ జహీర్ ఖాన్ ఎదుగుదలలో ఆయన పాత్ర కూడా ఉంది. ఇంకా ఆయన తన కెరీర్లో ముంబయి సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా, వాంఖడే స్టేడియం క్యురేటర్గా కూడా పని చేశారు.
దొంగతనం ఆరోపణలు
కెరీర్లో ఎంత పేరు సంపాదించారో అలానే సుధీర్ నాయక్ కష్టాలను కూడా చూశారు. 1970లలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆయపై దొంగతనం ఆరోపణలు కూడా వచ్చాయి. లండన్ డిపార్ట్మెంటల్ స్టోర్లో రెండు జతల సాక్స్ను దొంగిలించారని ఆయనపై ఫిర్యాదు నమోదైంది. అయితే, ఆ సమయంలో సునీల్ గావస్కర్ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ కేసును ఎదుర్కొనక తప్పలేదు.
This post was last modified on April 6, 2023 11:49 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…