భారత క్రికెట్ జట్టులో పడిలేచిన కిరణం.. టీమ్ఇండియా మాజీ ఓపెనర్ సుధీర్ నాయక్. ఏమీ లేని స్థాయి నుంచి క్రికెట్ బ్యాట్ కూడా కొనలేని పరిస్థితి నుంచి టీమ్ ఇండి ఓపెనర్గా ఎదిగిన నాయక్.. భారత క్రికెట్ కీర్తి కిరీటంలో ఒక కలికితురాయి. అయితే.. ఆయనకు రావాల్సిన గుర్తింపు.. దక్కాల్సిన మర్యాదులు దక్కలేదు. దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే.. 78 ఏళ్ల వయసులో నాయక్ తుదిశ్వాస విడిచారు.
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని ఆస్పత్రిలో కన్నుమూశారు. తన కుమార్తె దగ్గరే ఉంటున్న నాయక్ ఇటీవల బాత్రూంలో జారిపడ్డారు. తలకు గాయం కావడం వల్ల కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. కోమాలోకి వెళ్లిన నాయక్ మళ్లీ కోలుకోలేదు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్న ఆయన తాజాగా కన్ను మూశారు.
కెరీర్లో.. మలుపులు!
నాయక్.. 1970-71 రంజీ ట్రోఫీ సీజన్లో బ్లూరీ బ్యాండ్ గ్లోరీ టీమ్కు నాయకత్వం వహించాడు. అప్పుడు జట్టును గెలిపించి.. ట్రోఫీని ముద్దాడాడు.. సునీల్ గావస్కర్, అజిత్ వాడేకర్, దిలీప్ సార్దేశాయ్, అశోక్ మన్కడ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు జట్టులో లేకుండానే ఆయన తన టీమ్ను గెలిపించారు.
1974లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లారు. బర్మింగ్ హమ్ వేదికగా జరిగిన టెస్టుతో అరంగేట్రం చేశారు. రెండో ఇన్నింగ్స్లో 77 పరుగులు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నారు. 1974లో భారత్ తరఫున మూడు టెస్టు మ్యాచ్లు ఆడారు. 85 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడారు. దాదాపు 4376 పరుగులు చేశారు.
బ్యాటింగ్లో దూకుడుగా ఉండే నాయక్.. ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో ఏడు సెంచరీలు బాదారు. ఓ ద్విశతకం కూడా కొట్టారు. అలా తన ఆటతో క్రికెట్ అభిమానులతో పాటు సహ ఆటగాళ్లను ఆకట్టుకున్నారు. వారి ప్రశంసలను పొందారు.
రెండో ఇన్నింగ్స్లో మంచి కోచ్గానూ గుర్తింపు సాధించారు. క్రికెటర్ జహీర్ ఖాన్ ఎదుగుదలలో ఆయన పాత్ర కూడా ఉంది. ఇంకా ఆయన తన కెరీర్లో ముంబయి సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా, వాంఖడే స్టేడియం క్యురేటర్గా కూడా పని చేశారు.
దొంగతనం ఆరోపణలు
కెరీర్లో ఎంత పేరు సంపాదించారో అలానే సుధీర్ నాయక్ కష్టాలను కూడా చూశారు. 1970లలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆయపై దొంగతనం ఆరోపణలు కూడా వచ్చాయి. లండన్ డిపార్ట్మెంటల్ స్టోర్లో రెండు జతల సాక్స్ను దొంగిలించారని ఆయనపై ఫిర్యాదు నమోదైంది. అయితే, ఆ సమయంలో సునీల్ గావస్కర్ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ కేసును ఎదుర్కొనక తప్పలేదు.
ఈ రోజుల్లో ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయన్న గ్యారెంటీ…
ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ షార్ట్ కట్ లో ఏఐ. అలాంటి ఏఐని వినియోగిస్తూ.. బాబు పేరునే వాడుకుంటూ ఇప్పుడు సైబర్ నేరగాళ్లు…
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కెరీర్లో ‘ఇద్దరు’ పెద్ద డిజాస్టర్ కావచ్చు. కానీ కంటెంట్ పరంగా అదొక కల్ట్ క్లాసిక్. మణిరత్నం…
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, ప్రస్తుత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంతో ప్రముఖ నాయకుడు, దివంగత వంగవీటి రంగా కుమార్తె..…
కొన్నిసార్లు అంతే అనుకోకుండా అదృష్టం తలుపు తట్టేస్తుంది. దాన్ని వాడుకోవడం తెలిసుండాలి అంతే. ప్రస్తుతం శర్వానంద్ తో భోగి తీస్తున్న…
దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంత సెలెక్టివ్ గా ఉంటారో తెలిసిందే. కథలు, క్యాస్టింగ్, టీమ్, కంటెంట్ ఏదైనా సరే రాజీ…