Trends

క్రికెట్ దిగ్గజం.. నాయ‌క్ క‌న్నుమూత‌

భారత క్రికెట్ జ‌ట్టులో ప‌డిలేచిన కిర‌ణం.. టీమ్ఇండియా మాజీ ఓపెనర్‌ సుధీర్‌ నాయక్‌. ఏమీ లేని స్థాయి నుంచి క్రికెట్ బ్యాట్ కూడా కొన‌లేని ప‌రిస్థితి నుంచి టీమ్ ఇండి ఓపెన‌ర్‌గా ఎదిగిన నాయ‌క్‌.. భార‌త క్రికెట్ కీర్తి కిరీటంలో ఒక క‌లికితురాయి. అయితే.. ఆయ‌న‌కు రావాల్సిన గుర్తింపు.. ద‌క్కాల్సిన మ‌ర్యాదులు ద‌క్క‌లేదు. దీనికి కూడా కొన్ని కార‌ణాలు ఉన్నాయి. అయితే.. 78 ఏళ్ల వ‌య‌సులో నాయ‌క్‌ తుదిశ్వాస విడిచారు.

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని ఆస్పత్రిలో కన్నుమూశారు. త‌న  కుమార్తె  దగ్గరే ఉంటున్న నాయక్ ఇటీవల బాత్రూంలో జారిపడ్డారు. తలకు గాయం కావడం వల్ల కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. కోమాలోకి వెళ్లిన నాయక్‌ మళ్లీ కోలుకోలేదు. అప్ప‌టి నుంచి చికిత్స తీసుకుంటున్న ఆయ‌న తాజాగా క‌న్ను మూశారు.  

కెరీర్‌లో.. మ‌లుపులు!

నాయక్.. 1970-71 రంజీ ట్రోఫీ సీజన్లో బ్లూరీ బ్యాండ్ గ్లోరీ టీమ్కు నాయకత్వం వహించాడు. అప్పుడు జట్టును గెలిపించి.. ట్రోఫీని ముద్దాడాడు.. సునీల్ గావస్కర్, అజిత్ వాడేకర్, దిలీప్ సార్దేశాయ్, అశోక్ మన్కడ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు జట్టులో లేకుండానే ఆయన తన టీమ్ను గెలిపించారు.

1974లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లారు. బర్మింగ్ హమ్ వేదికగా జరిగిన టెస్టుతో అరంగేట్రం చేశారు. రెండో ఇన్నింగ్స్లో 77 పరుగులు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నారు. 1974లో భారత్‌ తరఫున మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడారు. 85 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడారు.  దాదాపు 4376 పరుగులు చేశారు.

బ్యాటింగ్లో దూకుడుగా ఉండే నాయ‌క్‌.. ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో ఏడు సెంచరీలు బాదారు. ఓ ద్విశతకం కూడా కొట్టారు. అలా తన ఆటతో క్రికెట్ అభిమానులతో పాటు సహ ఆటగాళ్లను ఆకట్టుకున్నారు. వారి ప్రశంసలను పొందారు.

రెండో ఇన్నింగ్స్లో మంచి కోచ్‌గానూ గుర్తింపు సాధించారు. క్రికెటర్ జహీర్‌ ఖాన్‌ ఎదుగుదలలో ఆయన పాత్ర కూడా ఉంది. ఇంకా ఆయన తన కెరీర్లో ముంబయి సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా, వాంఖడే స్టేడియం క్యురేటర్‌గా కూడా పని చేశారు.

దొంగ‌త‌నం ఆరోప‌ణ‌లు

కెరీర్లో ఎంత పేరు సంపాదించారో అలానే సుధీర్ నాయ‌క్‌ కష్టాలను కూడా చూశారు.  1970లలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆయపై దొంగతనం ఆరోపణలు కూడా వచ్చాయి. లండన్ డిపార్ట్మెంటల్ స్టోర్లో రెండు జతల సాక్స్ను దొంగిలించారని ఆయనపై ఫిర్యాదు నమోదైంది. అయితే, ఆ సమయంలో సునీల్ గావస్కర్ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ కేసును ఎదుర్కొన‌క త‌ప్ప‌లేదు.

This post was last modified on April 6, 2023 11:49 am

Share

Recent Posts

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

55 minutes ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

1 hour ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

1 hour ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

2 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

4 hours ago

చంద్రబాబు విజనరీ గ్రేట్… దక్షిణాది సీఎంల ప్రశంసలు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…

5 hours ago