భారత క్రికెట్ జట్టులో పడిలేచిన కిరణం.. టీమ్ఇండియా మాజీ ఓపెనర్ సుధీర్ నాయక్. ఏమీ లేని స్థాయి నుంచి క్రికెట్ బ్యాట్ కూడా కొనలేని పరిస్థితి నుంచి టీమ్ ఇండి ఓపెనర్గా ఎదిగిన నాయక్.. భారత క్రికెట్ కీర్తి కిరీటంలో ఒక కలికితురాయి. అయితే.. ఆయనకు రావాల్సిన గుర్తింపు.. దక్కాల్సిన మర్యాదులు దక్కలేదు. దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే.. 78 ఏళ్ల వయసులో నాయక్ తుదిశ్వాస విడిచారు.
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని ఆస్పత్రిలో కన్నుమూశారు. తన కుమార్తె దగ్గరే ఉంటున్న నాయక్ ఇటీవల బాత్రూంలో జారిపడ్డారు. తలకు గాయం కావడం వల్ల కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. కోమాలోకి వెళ్లిన నాయక్ మళ్లీ కోలుకోలేదు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్న ఆయన తాజాగా కన్ను మూశారు.
కెరీర్లో.. మలుపులు!
నాయక్.. 1970-71 రంజీ ట్రోఫీ సీజన్లో బ్లూరీ బ్యాండ్ గ్లోరీ టీమ్కు నాయకత్వం వహించాడు. అప్పుడు జట్టును గెలిపించి.. ట్రోఫీని ముద్దాడాడు.. సునీల్ గావస్కర్, అజిత్ వాడేకర్, దిలీప్ సార్దేశాయ్, అశోక్ మన్కడ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు జట్టులో లేకుండానే ఆయన తన టీమ్ను గెలిపించారు.
1974లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లారు. బర్మింగ్ హమ్ వేదికగా జరిగిన టెస్టుతో అరంగేట్రం చేశారు. రెండో ఇన్నింగ్స్లో 77 పరుగులు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నారు. 1974లో భారత్ తరఫున మూడు టెస్టు మ్యాచ్లు ఆడారు. 85 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడారు. దాదాపు 4376 పరుగులు చేశారు.
బ్యాటింగ్లో దూకుడుగా ఉండే నాయక్.. ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో ఏడు సెంచరీలు బాదారు. ఓ ద్విశతకం కూడా కొట్టారు. అలా తన ఆటతో క్రికెట్ అభిమానులతో పాటు సహ ఆటగాళ్లను ఆకట్టుకున్నారు. వారి ప్రశంసలను పొందారు.
రెండో ఇన్నింగ్స్లో మంచి కోచ్గానూ గుర్తింపు సాధించారు. క్రికెటర్ జహీర్ ఖాన్ ఎదుగుదలలో ఆయన పాత్ర కూడా ఉంది. ఇంకా ఆయన తన కెరీర్లో ముంబయి సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా, వాంఖడే స్టేడియం క్యురేటర్గా కూడా పని చేశారు.
దొంగతనం ఆరోపణలు
కెరీర్లో ఎంత పేరు సంపాదించారో అలానే సుధీర్ నాయక్ కష్టాలను కూడా చూశారు. 1970లలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆయపై దొంగతనం ఆరోపణలు కూడా వచ్చాయి. లండన్ డిపార్ట్మెంటల్ స్టోర్లో రెండు జతల సాక్స్ను దొంగిలించారని ఆయనపై ఫిర్యాదు నమోదైంది. అయితే, ఆ సమయంలో సునీల్ గావస్కర్ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ కేసును ఎదుర్కొనక తప్పలేదు.
This post was last modified on April 6, 2023 11:49 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…