సిరితా వచ్చిన వచ్చును… అని మన తెలుగు పద్యం చెప్పినట్టుగానే.. ఒక వ్యక్తికి.. ఏకంగా 44 కోట్ల రూపాయల లాటరీ దక్కింది. అయితే.. ఇది వస్తుందని కానీ, తాను రాత్రికి రాత్రి కోటీశ్వరుడిని అవుతానని కానీ, సదరు వ్యక్తి భావించలేదు. దీంతో ఆ.. ఏముంది.. ఇదంతా ప్రాంక్ అనుకున్నాడు. కానీ, వచ్చింది సాక్షాత్తూ సిరి మహాలక్ష్మి!! అదృష్టం బాగుంది కాబట్టి.. సదరు వ్యక్తిని వరించింది. లేకుంటే.. కొంచెంలో తప్పిపోయేది. మరి ఈ ఆసక్తికర ఘటన ఎక్కడ జరిగిందంటే..
కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన అరుణ్ కుమార్ వటక్కే అనే వ్యక్తి ఉద్యోగి. అయితే.. ఈయనకు కొంత లాటరీల పిచ్చి ఉంది. దీంతో అప్పుడప్పుడు ఆన్లైన్లో విదేశీ లాటరీ టికెట్లను కొనుగోలు చేస్తుంటాడు. ఇలానే.. గత నెలలో రూ.250 పెట్టి దుబాయ్కు చెందిన ఒక లాటరీ టికెట్ కొన్నాడు. `ఆ.. ఏముంది.. ఎప్పుడూ కొనేదేగా“ అనుకున్నాడు. కానీ, అనూహ్యంగా అతనికి లాటరీ తగిలింది. ఏకంగా.. 44 కోట్ల రూపాయలు(20 మిలియన్ ధిరామ్) గెలుచుకున్నాడు. ఏప్రిల్ 3వ తేదీన లైవ్ షోలో లక్కీ డ్రా ద్వారా లాటరీ విజేతను ప్రకటించారు.
తర్వాత ఏం జరిగింది..
అరుణ్కుమార్కు.. లాటరీ గెలుచుకున్నారని కాల్ వచ్చింది. దాన్ని ప్రాంక్గా భావించిన ఆయన.. ఆ నంబర్ను బ్లాక్ చేశారు. అయితే హోస్ట్లు మరో నంబర్ ద్వారా కాల్ చేసి చెప్పిన తర్వాతే ఆ విషయాన్ని నమ్మారు అరుణ్. “బిగ్ టికెట్ నుంచి కాల్ వచ్చినప్పుడు మొదట నేను అది ఫేక్ కాల్ అనుకున్నా. ఎవరైనా ప్రాంక్ కాల్ చేసి ఉండొచ్చని భావించా. నేను ఆ కాల్ డిస్కనెక్ట్ చేసి.. ఆ నంబర్ను బ్లాక్ చేశాను. వెంటనే వేరే నంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది” అని అరుణ్ కుమార్ తెలిపారు.
రెండోసారి ఫోన్ కాల్ వచ్చిన తర్వాతనే అరుణ్ తనకు లాటరీలో మొదటి ప్రైజ్ వచ్చిందన్న విషయాన్ని నమ్మారు. తాను లాటరీ టికెట్ కొనుగోలు చేయడం రెండవసారి అని అరుణ్ వెల్లడించారు. అయితే.. లాటరీ మొత్తంలో 50 శాతం పన్నులు కట్టాల్సి ఉంటుందని.. తనకు 22 కోట్లు అందుతాయని.. తన జీవితంలో ఇంత సొమ్ము లభించడం.. ఇదే తొలిసారి అని వెల్లడించాడు.
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…