లక్.. అదృష్టం.. ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. రాత్రికి రాత్రి భిక్షగాణ్ని.. ధనవంతుడిని చేస్తుంది.. అంటారే.. అచ్చం ఇప్పుడు అలానే జరిగింది. రాత్రికి రాత్రి.. ఒక యువకుడిని కోటీశ్వరుణ్ని చేసింది. కేవలం 49 రూపాయల పెట్టుబడితో.. ఏకంగా కోటిన్నర రూపాయల సంపదకు అధిపతిని చేసింది. దీంతో ఈ సంగతి తెలిసిన వాళ్లు.. ఇది కదా లక్కంటే! అని మెటికలు విరుస్తున్నారు.. బుగ్గలు నొక్కుకుంటున్నారు. మరి ఈ సంగతేంటో చూద్దామా..!
మధ్య ప్రదేశ్లోని బార్వానీ జిల్లాకు చెందిన షహబుద్దీన్ మన్సూరి.. పేద కుటుంబానికి చెందిన యువకుడు. తన పేదరికాన్ని తలుచుకుని తరచుగా బాధపడేవాడు. ఈ క్రమంలో లక్కును పరిశీలించుకోవాలని.. ప్రయత్నం చేయగా.. చేయగా.. ఎప్పటికైనా అదృష్టం వరించకపోతుందా? అని భావించాడు. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ గేమింగ్ యాప్లో క్రికెట్ గేమ్ ఆడడం ప్రారంభించాడు. ఇలా.. ఒకటి కాదు.. గత రెండేళ్లుగా బెట్టింగులు కడుతూనే ఉన్నాడు. అయితే..ఎప్పుడూ.. కూడా రూ.49 కి మించి కట్టింది లేదు.
ఇక, ఈ యాప్లో స్వయంగా షహబుద్దీన్ ఒక టీం ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా.. తన అదృష్టాన్ని పరిశీలించుకుంటున్న షహబుద్దీన్కు తాజాగా లక్ చిక్కింది. కోల్కతా, పంజాబ్ టీంల మధ్య ఆదివారం.. నిర్వహించిన ఆన్లైన్ గేమింగ్లో రూ.49 కేటగిరిలో ఫస్ట్ ప్లేస్ సాధించాడు. దీంతో ఏకంగా రూ.1.5 కోట్ల రూపాయల జాక్ పాట్ కొట్టాడు. ఇంకేముంది.. షహబుద్దీన్ స్నేహితులు, కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. లక్ అంటే.. ఇది కదా! అని సంబరాలు చేసుకుంటున్నారు.
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…