లక్.. అదృష్టం.. ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. రాత్రికి రాత్రి భిక్షగాణ్ని.. ధనవంతుడిని చేస్తుంది.. అంటారే.. అచ్చం ఇప్పుడు అలానే జరిగింది. రాత్రికి రాత్రి.. ఒక యువకుడిని కోటీశ్వరుణ్ని చేసింది. కేవలం 49 రూపాయల పెట్టుబడితో.. ఏకంగా కోటిన్నర రూపాయల సంపదకు అధిపతిని చేసింది. దీంతో ఈ సంగతి తెలిసిన వాళ్లు.. ఇది కదా లక్కంటే! అని మెటికలు విరుస్తున్నారు.. బుగ్గలు నొక్కుకుంటున్నారు. మరి ఈ సంగతేంటో చూద్దామా..!
మధ్య ప్రదేశ్లోని బార్వానీ జిల్లాకు చెందిన షహబుద్దీన్ మన్సూరి.. పేద కుటుంబానికి చెందిన యువకుడు. తన పేదరికాన్ని తలుచుకుని తరచుగా బాధపడేవాడు. ఈ క్రమంలో లక్కును పరిశీలించుకోవాలని.. ప్రయత్నం చేయగా.. చేయగా.. ఎప్పటికైనా అదృష్టం వరించకపోతుందా? అని భావించాడు. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ గేమింగ్ యాప్లో క్రికెట్ గేమ్ ఆడడం ప్రారంభించాడు. ఇలా.. ఒకటి కాదు.. గత రెండేళ్లుగా బెట్టింగులు కడుతూనే ఉన్నాడు. అయితే..ఎప్పుడూ.. కూడా రూ.49 కి మించి కట్టింది లేదు.
ఇక, ఈ యాప్లో స్వయంగా షహబుద్దీన్ ఒక టీం ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా.. తన అదృష్టాన్ని పరిశీలించుకుంటున్న షహబుద్దీన్కు తాజాగా లక్ చిక్కింది. కోల్కతా, పంజాబ్ టీంల మధ్య ఆదివారం.. నిర్వహించిన ఆన్లైన్ గేమింగ్లో రూ.49 కేటగిరిలో ఫస్ట్ ప్లేస్ సాధించాడు. దీంతో ఏకంగా రూ.1.5 కోట్ల రూపాయల జాక్ పాట్ కొట్టాడు. ఇంకేముంది.. షహబుద్దీన్ స్నేహితులు, కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. లక్ అంటే.. ఇది కదా! అని సంబరాలు చేసుకుంటున్నారు.
This post was last modified on April 4, 2023 9:16 pm
టాలీవుడ్ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి నిండా సమస్యల్లో చిక్కుకుపోయి ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా...…
నితిన్ కెరీర్ లోనే అతి పెద్ద బడ్జెట్ సినిమాగా చెప్పుకుంటున్న రాబిన్ హుడ్ విడుదలకు ఇంకో పది రోజులు మాత్రమే…
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సీక్వెల్స్ లో ఒకటి కల్కి 2898 ఏడి. వెయ్యి కోట్ల గ్రాస్ సాధించిన బ్లాక్ బస్టర్…
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినంతనే రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. కేవలం 10 నెలల కాలంలోనే ఏపీకి ఏకంగా రూ.7 లక్షల…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత కొంతకాలంగా తన తల్లి వైఎస్ విజయమ్మతో విభేదాలతో సాగుతున్న సంగతి…
పైన ఫొటోలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో కలిసి కనిపిస్తున్న బుడ్డోడి పేరు నంద్యాల సిద్ధార్థ్. వయసు 14 ఏళ్లే.…