లక్.. అదృష్టం.. ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. రాత్రికి రాత్రి భిక్షగాణ్ని.. ధనవంతుడిని చేస్తుంది.. అంటారే.. అచ్చం ఇప్పుడు అలానే జరిగింది. రాత్రికి రాత్రి.. ఒక యువకుడిని కోటీశ్వరుణ్ని చేసింది. కేవలం 49 రూపాయల పెట్టుబడితో.. ఏకంగా కోటిన్నర రూపాయల సంపదకు అధిపతిని చేసింది. దీంతో ఈ సంగతి తెలిసిన వాళ్లు.. ఇది కదా లక్కంటే! అని మెటికలు విరుస్తున్నారు.. బుగ్గలు నొక్కుకుంటున్నారు. మరి ఈ సంగతేంటో చూద్దామా..!
మధ్య ప్రదేశ్లోని బార్వానీ జిల్లాకు చెందిన షహబుద్దీన్ మన్సూరి.. పేద కుటుంబానికి చెందిన యువకుడు. తన పేదరికాన్ని తలుచుకుని తరచుగా బాధపడేవాడు. ఈ క్రమంలో లక్కును పరిశీలించుకోవాలని.. ప్రయత్నం చేయగా.. చేయగా.. ఎప్పటికైనా అదృష్టం వరించకపోతుందా? అని భావించాడు. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ గేమింగ్ యాప్లో క్రికెట్ గేమ్ ఆడడం ప్రారంభించాడు. ఇలా.. ఒకటి కాదు.. గత రెండేళ్లుగా బెట్టింగులు కడుతూనే ఉన్నాడు. అయితే..ఎప్పుడూ.. కూడా రూ.49 కి మించి కట్టింది లేదు.
ఇక, ఈ యాప్లో స్వయంగా షహబుద్దీన్ ఒక టీం ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా.. తన అదృష్టాన్ని పరిశీలించుకుంటున్న షహబుద్దీన్కు తాజాగా లక్ చిక్కింది. కోల్కతా, పంజాబ్ టీంల మధ్య ఆదివారం.. నిర్వహించిన ఆన్లైన్ గేమింగ్లో రూ.49 కేటగిరిలో ఫస్ట్ ప్లేస్ సాధించాడు. దీంతో ఏకంగా రూ.1.5 కోట్ల రూపాయల జాక్ పాట్ కొట్టాడు. ఇంకేముంది.. షహబుద్దీన్ స్నేహితులు, కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. లక్ అంటే.. ఇది కదా! అని సంబరాలు చేసుకుంటున్నారు.
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర…