లక్.. అదృష్టం.. ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. రాత్రికి రాత్రి భిక్షగాణ్ని.. ధనవంతుడిని చేస్తుంది.. అంటారే.. అచ్చం ఇప్పుడు అలానే జరిగింది. రాత్రికి రాత్రి.. ఒక యువకుడిని కోటీశ్వరుణ్ని చేసింది. కేవలం 49 రూపాయల పెట్టుబడితో.. ఏకంగా కోటిన్నర రూపాయల సంపదకు అధిపతిని చేసింది. దీంతో ఈ సంగతి తెలిసిన వాళ్లు.. ఇది కదా లక్కంటే! అని మెటికలు విరుస్తున్నారు.. బుగ్గలు నొక్కుకుంటున్నారు. మరి ఈ సంగతేంటో చూద్దామా..!
మధ్య ప్రదేశ్లోని బార్వానీ జిల్లాకు చెందిన షహబుద్దీన్ మన్సూరి.. పేద కుటుంబానికి చెందిన యువకుడు. తన పేదరికాన్ని తలుచుకుని తరచుగా బాధపడేవాడు. ఈ క్రమంలో లక్కును పరిశీలించుకోవాలని.. ప్రయత్నం చేయగా.. చేయగా.. ఎప్పటికైనా అదృష్టం వరించకపోతుందా? అని భావించాడు. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ గేమింగ్ యాప్లో క్రికెట్ గేమ్ ఆడడం ప్రారంభించాడు. ఇలా.. ఒకటి కాదు.. గత రెండేళ్లుగా బెట్టింగులు కడుతూనే ఉన్నాడు. అయితే..ఎప్పుడూ.. కూడా రూ.49 కి మించి కట్టింది లేదు.
ఇక, ఈ యాప్లో స్వయంగా షహబుద్దీన్ ఒక టీం ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా.. తన అదృష్టాన్ని పరిశీలించుకుంటున్న షహబుద్దీన్కు తాజాగా లక్ చిక్కింది. కోల్కతా, పంజాబ్ టీంల మధ్య ఆదివారం.. నిర్వహించిన ఆన్లైన్ గేమింగ్లో రూ.49 కేటగిరిలో ఫస్ట్ ప్లేస్ సాధించాడు. దీంతో ఏకంగా రూ.1.5 కోట్ల రూపాయల జాక్ పాట్ కొట్టాడు. ఇంకేముంది.. షహబుద్దీన్ స్నేహితులు, కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. లక్ అంటే.. ఇది కదా! అని సంబరాలు చేసుకుంటున్నారు.
This post was last modified on April 4, 2023 9:16 pm
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…
సక్సెస్ మాత్రమే మాట్లాడే ఇండస్ట్రీలో కొందరికి అవకాశాలు ఒక సినిమాతో సృష్టించుకున్న బ్రాండ్ వల్ల వస్తాయి. జాతిరత్నాలు దర్శకుడు కెవి…
తమిళనాడు రాజకీయాల్లో చిత్రమైన వైఖరి కనిపిస్తోంది. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో…