లక్.. అదృష్టం.. ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. రాత్రికి రాత్రి భిక్షగాణ్ని.. ధనవంతుడిని చేస్తుంది.. అంటారే.. అచ్చం ఇప్పుడు అలానే జరిగింది. రాత్రికి రాత్రి.. ఒక యువకుడిని కోటీశ్వరుణ్ని చేసింది. కేవలం 49 రూపాయల పెట్టుబడితో.. ఏకంగా కోటిన్నర రూపాయల సంపదకు అధిపతిని చేసింది. దీంతో ఈ సంగతి తెలిసిన వాళ్లు.. ఇది కదా లక్కంటే! అని మెటికలు విరుస్తున్నారు.. బుగ్గలు నొక్కుకుంటున్నారు. మరి ఈ సంగతేంటో చూద్దామా..!
మధ్య ప్రదేశ్లోని బార్వానీ జిల్లాకు చెందిన షహబుద్దీన్ మన్సూరి.. పేద కుటుంబానికి చెందిన యువకుడు. తన పేదరికాన్ని తలుచుకుని తరచుగా బాధపడేవాడు. ఈ క్రమంలో లక్కును పరిశీలించుకోవాలని.. ప్రయత్నం చేయగా.. చేయగా.. ఎప్పటికైనా అదృష్టం వరించకపోతుందా? అని భావించాడు. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ గేమింగ్ యాప్లో క్రికెట్ గేమ్ ఆడడం ప్రారంభించాడు. ఇలా.. ఒకటి కాదు.. గత రెండేళ్లుగా బెట్టింగులు కడుతూనే ఉన్నాడు. అయితే..ఎప్పుడూ.. కూడా రూ.49 కి మించి కట్టింది లేదు.
ఇక, ఈ యాప్లో స్వయంగా షహబుద్దీన్ ఒక టీం ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా.. తన అదృష్టాన్ని పరిశీలించుకుంటున్న షహబుద్దీన్కు తాజాగా లక్ చిక్కింది. కోల్కతా, పంజాబ్ టీంల మధ్య ఆదివారం.. నిర్వహించిన ఆన్లైన్ గేమింగ్లో రూ.49 కేటగిరిలో ఫస్ట్ ప్లేస్ సాధించాడు. దీంతో ఏకంగా రూ.1.5 కోట్ల రూపాయల జాక్ పాట్ కొట్టాడు. ఇంకేముంది.. షహబుద్దీన్ స్నేహితులు, కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. లక్ అంటే.. ఇది కదా! అని సంబరాలు చేసుకుంటున్నారు.
This post was last modified on April 4, 2023 9:16 pm
స్థానిక ఎన్నికలపై జనసేన త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…