ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా…బుల్లెట్టు దిగిందా లేదా….బ్లాక్ బస్టర్ మూవీ ‘పోకిరి’లో మహేష్ బాబు చెప్పిన ఈ డైలాగ్ చాలా పాపులర్. కానీ, పోకిరి సినిమాలో ఈ డైలాగ్ నుంచి స్ఫూర్తి పొందిన కొందరు పోకిరి యువత…ఏం చేశామని కాదన్నయ్యా…పాపులర్ అయ్యామా లేదా అన్నట్లు తయారయ్యారు. ఓవర్ నైట్ గుర్తింపు పొందడం కోసం…సోషల్ మీడియాలో తమ పేరు..ఊరు వైరల్ కావం కోసం వింత పోకడలకు పోతున్నారు.
తాజాగా జనాల దృష్టిని ఆకర్షించేందుకు ఓ యువతి ఢిల్లీ మెట్రోలో రచ్చ చేసింది. మినీ బికినీ, బ్రాతో ధరించి కలకలం రేపింది. బీచ్ లో ధరించే టూ పీస్ బికినీ వేసుకొని పట్టపగలు మెట్రోలో వందలాది మంది ప్రయాణికుల మధ్య ప్రయాణించింది. ఇక, కాసేపటికి బికినీలో అసౌకర్యంగా కనిపించిన ఈ అమ్మడు స్కిన్ షో నుంచి తప్పించుకునేందుకు తన బ్యాగ్ ను అడ్డుపెట్టుకుంది. దీంతో, ఇదేం ఖర్మ అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.
అంత పొట్టి డ్రెస్ వేసుకోవడమెందుకు..అలా ఇబ్బంది పడటమెందుకు అని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది మహిళా సాధికారతకు ఉదాహరణా అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. మెట్రో స్టేషన్ సెక్యూరిటీని దాటి లోపలికి ఎలా వచ్చింది? చూడటానికి దరిద్రంగా ఉంది అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఎట్రాక్షన్ కోరుకుంటోన్న ఇలాంటి యువతులు ఇలా చేస్తున్నారని మరో యూజర్ స్పందించారు. ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని… బీచ్ కాదని…. ఫ్రీడమ్ పేరుతో ప్రతి ఒక్కరూ తమ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఎలా? అని ఇంకో యూజర్ మండిపడ్డారు.
ఇక, కొద్ది రోజుల క్రితం ఒక పురుషుడు బనియన్ పై, అండర్ వేర్ పై మెట్రోలో ప్రయాణిస్తే కేసు పెట్టారని, కానీ, ఈమెపై ఎటువంటి చర్య తీసుకోలేదని కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇదేనా లింగ సమానత్వం అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారిపై ఎలాంటి వివక్షా లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
This post was last modified on April 2, 2023 8:37 pm
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…