ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా…బుల్లెట్టు దిగిందా లేదా….బ్లాక్ బస్టర్ మూవీ ‘పోకిరి’లో మహేష్ బాబు చెప్పిన ఈ డైలాగ్ చాలా పాపులర్. కానీ, పోకిరి సినిమాలో ఈ డైలాగ్ నుంచి స్ఫూర్తి పొందిన కొందరు పోకిరి యువత…ఏం చేశామని కాదన్నయ్యా…పాపులర్ అయ్యామా లేదా అన్నట్లు తయారయ్యారు. ఓవర్ నైట్ గుర్తింపు పొందడం కోసం…సోషల్ మీడియాలో తమ పేరు..ఊరు వైరల్ కావం కోసం వింత పోకడలకు పోతున్నారు.
తాజాగా జనాల దృష్టిని ఆకర్షించేందుకు ఓ యువతి ఢిల్లీ మెట్రోలో రచ్చ చేసింది. మినీ బికినీ, బ్రాతో ధరించి కలకలం రేపింది. బీచ్ లో ధరించే టూ పీస్ బికినీ వేసుకొని పట్టపగలు మెట్రోలో వందలాది మంది ప్రయాణికుల మధ్య ప్రయాణించింది. ఇక, కాసేపటికి బికినీలో అసౌకర్యంగా కనిపించిన ఈ అమ్మడు స్కిన్ షో నుంచి తప్పించుకునేందుకు తన బ్యాగ్ ను అడ్డుపెట్టుకుంది. దీంతో, ఇదేం ఖర్మ అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.
అంత పొట్టి డ్రెస్ వేసుకోవడమెందుకు..అలా ఇబ్బంది పడటమెందుకు అని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది మహిళా సాధికారతకు ఉదాహరణా అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. మెట్రో స్టేషన్ సెక్యూరిటీని దాటి లోపలికి ఎలా వచ్చింది? చూడటానికి దరిద్రంగా ఉంది అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఎట్రాక్షన్ కోరుకుంటోన్న ఇలాంటి యువతులు ఇలా చేస్తున్నారని మరో యూజర్ స్పందించారు. ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని… బీచ్ కాదని…. ఫ్రీడమ్ పేరుతో ప్రతి ఒక్కరూ తమ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఎలా? అని ఇంకో యూజర్ మండిపడ్డారు.
ఇక, కొద్ది రోజుల క్రితం ఒక పురుషుడు బనియన్ పై, అండర్ వేర్ పై మెట్రోలో ప్రయాణిస్తే కేసు పెట్టారని, కానీ, ఈమెపై ఎటువంటి చర్య తీసుకోలేదని కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇదేనా లింగ సమానత్వం అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారిపై ఎలాంటి వివక్షా లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…