ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా…బుల్లెట్టు దిగిందా లేదా….బ్లాక్ బస్టర్ మూవీ ‘పోకిరి’లో మహేష్ బాబు చెప్పిన ఈ డైలాగ్ చాలా పాపులర్. కానీ, పోకిరి సినిమాలో ఈ డైలాగ్ నుంచి స్ఫూర్తి పొందిన కొందరు పోకిరి యువత…ఏం చేశామని కాదన్నయ్యా…పాపులర్ అయ్యామా లేదా అన్నట్లు తయారయ్యారు. ఓవర్ నైట్ గుర్తింపు పొందడం కోసం…సోషల్ మీడియాలో తమ పేరు..ఊరు వైరల్ కావం కోసం వింత పోకడలకు పోతున్నారు.
తాజాగా జనాల దృష్టిని ఆకర్షించేందుకు ఓ యువతి ఢిల్లీ మెట్రోలో రచ్చ చేసింది. మినీ బికినీ, బ్రాతో ధరించి కలకలం రేపింది. బీచ్ లో ధరించే టూ పీస్ బికినీ వేసుకొని పట్టపగలు మెట్రోలో వందలాది మంది ప్రయాణికుల మధ్య ప్రయాణించింది. ఇక, కాసేపటికి బికినీలో అసౌకర్యంగా కనిపించిన ఈ అమ్మడు స్కిన్ షో నుంచి తప్పించుకునేందుకు తన బ్యాగ్ ను అడ్డుపెట్టుకుంది. దీంతో, ఇదేం ఖర్మ అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.
అంత పొట్టి డ్రెస్ వేసుకోవడమెందుకు..అలా ఇబ్బంది పడటమెందుకు అని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది మహిళా సాధికారతకు ఉదాహరణా అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. మెట్రో స్టేషన్ సెక్యూరిటీని దాటి లోపలికి ఎలా వచ్చింది? చూడటానికి దరిద్రంగా ఉంది అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఎట్రాక్షన్ కోరుకుంటోన్న ఇలాంటి యువతులు ఇలా చేస్తున్నారని మరో యూజర్ స్పందించారు. ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని… బీచ్ కాదని…. ఫ్రీడమ్ పేరుతో ప్రతి ఒక్కరూ తమ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఎలా? అని ఇంకో యూజర్ మండిపడ్డారు.
ఇక, కొద్ది రోజుల క్రితం ఒక పురుషుడు బనియన్ పై, అండర్ వేర్ పై మెట్రోలో ప్రయాణిస్తే కేసు పెట్టారని, కానీ, ఈమెపై ఎటువంటి చర్య తీసుకోలేదని కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇదేనా లింగ సమానత్వం అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారిపై ఎలాంటి వివక్షా లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
This post was last modified on April 2, 2023 8:37 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…