హైదరాబాద్లోని నార్సింగిలో శ్రీచైతన్య కాలేజ్ క్లాస్ రూమ్లో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థి సాత్విక్ రాసిన సూసైడ్ నోట్ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కాలేజ్ ప్రిన్సిపల్, కొందరు లెక్చరర్లు తనను ఎంతగా వేధించారో ఆ విద్యార్థి తన సూసైడ్ నోట్లో రాశాడు. కాలేజీ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ఆచార్య, వార్డెన్ నరేష్, టీచర్ శోభన్ టార్చర్ వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. తన ఆత్మహత్యకు కారకులైన వారిపై యాక్షన్ తీసుకోవాలని సాత్విక్ ఆ లేఖలో కోరాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నందుకు క్షమించాలని అమ్మ, నాన్న, అన్నయ్యలను సాత్విక్ కోరాడు.
‘నాన్నా నేను ఈ పనిచేస్తున్నందుకు క్షమించండి. మిమ్మల్ని బాధపెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. మీరు బాధపడితే నా ఆత్మ శాంతించదు. ప్రిన్సిపల్, ఇంచార్జ్, లెక్చరర్ల వల్లే చనిపోతున్నాను. కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్, నరేశ్ల వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. ఈ ముగ్గురూ హాస్టల్ విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. నన్ను వేధించిన ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోండి’ అని సాత్విక్ తన లేఖలో రాశాడు.
కాగా సాత్విక్ ఆత్మహత్యకు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేశాయి. సాత్విక్ కుటుంబసభ్యులతో కలిసి కాలేజ్ ముందు ఆందోళన చేసిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాలేజ్ మేనేజ్మెంట్పై యాక్షన్ తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దాంతో ఉస్మానియాలో సాత్విక్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేశారు. మరోవైపు సాత్విక్ మృతిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సాత్విక్ మృతికి గల కారణాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ను విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆదేశించారు.
This post was last modified on March 2, 2023 8:38 am
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…