Trends

జైల్లో రాజభోగం.. ఆ ఖైదీ వేసుకునే చెప్పులు రూ.లక్షన్నర

తీవ్రమైన ఆర్థిక నేరాలు చేసి.. ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కిస్తున్న అతగాడి పేరు సుఖేశ్ చంద్రశేఖర్. ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదూ? కరెక్టే. ఆర్థిక నేరాలకు పాల్పడి.. రూ.వందల కోట్ల మోసాలు చేసిన కేసులో జైలు జీవితాన్ని గడుపుతున్నాడు సుఖేశ్. ఇతడికి మరో హిస్టరీ కూడా ఉంది. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాయ్ ఫ్రెండ్ గా.. ఖరీదైన బహుమతులు ఇచ్చి ఆమెను ట్రాప్ చేసినట్లుగా అతడి మీద ఆరోపణలు ఉన్నాయి.

మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం ఢిల్లీ జైల్లో ఊచలు లెక్కిస్తున్న ఇతడి కారణంగా జాక్వెలిన్ మాత్రమే కాదు.. బాలీవుడ్ కు చెందిన మరో నటి నోరా ఫతేహ్ లు కూడా పోలీసుల విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. ఇవన్నీ చాలామందికి తెలిసిన విషయాలే. ప్రస్తుతం జైలు జీవితాన్ని అనుభవిస్తున్న సుఖేశ్.. నిజంగానే అనుభవించురాజా టైప్ లో అతగాడి పరిస్థితి ఉందన్న విషయాన్ని గుర్తించారు.

అతడి జైలు జీవితంపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తూ.. అతడి విలాస జీవితం ఒక రేంజ్ లో ఉందన్న విషయం బయటకు పొక్కింది. దీంతో.. జైలర్ దీపక్ శర్మతో పాటు ఇతర అధికారులు సుఖేశ్ శిక్ష అనువిస్తున్న జైలు గదికి ఆకస్మిక తనిఖీకి వెళ్లారు. అక్కడ అతగాడు ఖరీదైన గూచి చెప్పుల్ని వినియోగిస్తున్నట్లుగా గుర్తించి అవాక్కు అయ్యారు. ఎందుకంటే.. ఈ చెప్పుల విలువ కేవలం రూ.1.5 లక్షలు మాత్రమే. అంతేకాదు.. అతగాడు ధరించే రెండు జతల జీన్స్ విలువ రూ.80 వేలుగా గుర్తించారు.

అనూహ్యంగా జైలర్ వచ్చి తన గదిని తనిఖీ చేస్తున్న వేళ.. జైలు గదిలో ఒక పక్కకు వెళ్లి భోరున విలపించిన వైనం.. దానికి సంబంధించిన వీడియోక్లిప్ బయటకు వచ్చింది. తీవ్రమైన ఆర్థిక నేరం ఆరోపణలతో జైలుకు వచ్చి.. ఇంతలా రాజభోగాల్ని అనుభవిస్తున్న అతగాడి తీరుకు జైలు అధికారులు సైతం అవాక్కుఅయ్యారు. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. సుఖేశ్ ను తొలుత తీహార్ జైలుకు తరలించారు.

అయితే.. తన ప్రాణాలకు హాని ఉందంటూ అతడు సుప్రీంకోర్టుకు విన్నవించుకోవటంతో అతన్ని మండోలి జైల్ కు తరలించారు. తీహార్ జైలు అధికారులు తన నుంచి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఆరోపిస్తూ.. అక్కడి నుంచి మరో జైలుకు షిఫ్టు అయిన అతడు.. జైల్లో రాజభోగాల్ని అనుభవిస్తున్న వైనం అవాక్కు అయ్యేలా చేస్తోంది. తాను కోరుకున్నది అందుబాటులోకి వచ్చేలా చేసుకుంటున్న సుఖేశ్.. అధికారుల తనిఖీలు జరిపిన సమయంలో మాత్రం చిన్న పిల్లాడి మాదిరి రోదించటం గమనార్హం. తనిఖీల వ్యవహారాన్ని రికార్డు చేయగా.. దానికి సంబంధించిన ఫోటోలు బయటకు లీక్ కావటంపై అధికారులు ఆగ్రహంతో ఉన్నారు. అంతర్గత విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

This post was last modified on February 24, 2023 4:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

19 minutes ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

1 hour ago

‘పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర…

1 hour ago

ఈ బీజేపీ ఎంపీకి ఏమైంది?

ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…

2 hours ago

కొణిదెల నిహారిక: ఫ్రేమ్ మారినా, గ్లామర్ మాత్రం అలాగే..

యాంకర్‌గా మొదలై, హీరోయిన్‌గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…

2 hours ago

తారక్ అభిమానులు లైట్ తీసుకున్నారు

స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…

5 hours ago